Prakasam

News March 30, 2024

ప్రకాశం జిల్లాలో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మృతి

image

మార్కాపురంలోని గాంధీ బజార్‌లో శనివారం భవనం పైనుంచి ప్రమాదవశాత్తు సచివాలయ ఉద్యోగి పడిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలైన వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లయ్య (32) ఉదయం ఆసుపత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పట్టణ ఎస్ఐ రెహమాన్ తెలిపిన వివరాలు ప్రకారం.. మిద్దెపై బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో తీవ్రగాయాలపాలై మల్లయ్య చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

News March 30, 2024

గొట్టిపాటి V/s బూచేపల్లి

image

దర్శి రాజకీయ చర్చకు ఎట్టకేలకు తెరలేసింది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పోటీగా గొట్టిపాటి లక్ష్మిని ప్రకటించగానే అభ్యర్థుల పోటీ ఖరారు అయింది. వీరిరువురి నేపథ్యం గమనిస్తే.. ఇరు కుటుంబాలు రాజకీయ వారసత్వం నుంచి వచ్చినవారే, ఇద్దరు డాక్టర్లే కావడం గమనార్హం. గొట్టిపాటి కుటుంబం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు కీలకపాత్ర పోషించారు. ఇటు తండ్రి సుబ్బారెడ్డి వారసుడిగా శివప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారు.

News March 30, 2024

ప్రకాశం: ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్.. మహిళ మృతి

image

సింగరాయకొండ మండలం పెదనబోయినవారిపాలెంకు చెందిన కావలి పద్మ, రమాదేవి, ప్రహర్ష సింగరాయకొండ నుంచి ఆటోలో గ్రామానికి బయల్దేరారు. ఊళ్లపాలెం ప్రధాన రహదారి పక్కనే ఉన్న జగనన్న కాలనీ సమీపంలోకి వెళ్లేసరికి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఆటోని ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న పద్మ, మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో వారిని ఒంగోలు తరలిస్తుండగా పద్మ మధ్యలో మృతిచెందారు. ఎస్సై శ్రీరాం కేసు నమోదుచేశారు.

News March 29, 2024

సింగరాయకొండలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

సింగరాయకొండ పట్టణంలోని రాయల్ హోటల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయసు 40సం.రాలు ఉంటుందని, మృతుడి చేతి మీద కేశవ పద్మావతి అనే పచ్చబొట్టు ఉందన్నారు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ సంప్రదించాలన్నారు.

News March 29, 2024

ఒంగోలు ఎంపీ టిడిపి అభ్యర్థి మాగుంట రాజకీయ నేపథ్యం

image

ఒంగోలు ఎంపీ టిడిపి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈయన 2014 టిడిపిలో చేరి ఒంగోలు టిడిపి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 టిడిపికి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరి 2019 ఒంగోలు ఎంపీగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2024లో ఫిబ్రవరిలో వైసిపి పార్టీకి రాజీనామా చేసి మార్చి 16న 2024న మళ్లీ టిడిపిలో చేరారు. జిల్లాలో మాగుంట శ్రీనివాసరెడ్డి అందరికీ సుపరిచితమే.

News March 29, 2024

ప్రకాశం టీడీపీలో ముగ్గురు డాక్టర్లు పోటీ

image

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో  టీడీపీ తరఫున జిల్లాలో ముగ్గురు డాక్టర్లు పోటీ చేస్తున్నారు. ముగ్గురు పూర్తిగా వైద్య వృత్తిలో ఉండి ప్రజలకు సేవలందించారు. కొండపిలో బాలవీరాంజనేయస్వామి ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తూ 2009 నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే కనిగిరిలో కాంగ్రెస్ తరఫున ఉగ్రనరసింహారెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా దర్శి నుంచి వైద్యురాలు గొట్టిపాటి లక్ష్మి పోటీలో ఉన్నారు.

News March 29, 2024

ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట

image

ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పటివరకు ఒంగోలు వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇటీవలే చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.

News March 29, 2024

దర్శి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి

image

దర్శి సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారా అని చాలా రోజులు అటు ప్రజల్లో, ఇటు ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉండేది. వాటన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ దర్శి కూటమి అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి పేరు ఖరారయింది. ఈమె మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనుమరాలు. దర్శి టీడీపీ అభ్యర్థిగా ఇప్పటివరకు అనేకమంది పేర్లు ప్రచారం పొందగా నేటితో ఆ ఉత్కంఠకు తెరపడింది.

News March 29, 2024

ముండ్లమూరు: రెండు బైకులు ఢీ.. స్పాట్ డెడ్

image

రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం వేంపాడు-పెద్ద రావిపాడులో జరిగింది. వేంపాడుకు చెందిన గోపనబోయిన రామారావు(40) తన మిర్చి పొలంలోని కూలీలకు టిఫిన్ తీసుకుని బైకుపై ముండ్లమూరు నుంచి వస్తున్నారు. అదే సమయంలో రావిపాడుకు చెందిన ఉలవ మల్లికార్జున తన బైకుపై వస్తూ మలుపు వద్ద ఇరువురు ఢీకొన్నారు. రామారావు చనిపోగా, మల్లికార్జున గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు.

News March 29, 2024

తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్యే మద్దిశెట్టి?

image

దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ టీడీపీలో చేరనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కూటమి అభ్యర్థిగా టీడీపీ అధిష్ఠానం మద్దిశెట్టి వేణుగోపాల్ అయితే పరిస్థితి ఏంటో తెలుసుకునేందుకు నియోజకవర్గ ప్రజలకు ఐవిఆర్ఎస్ కాల్స్ చేయించి సర్వే చేయిస్తోంది. దీంతో ఆయన పార్టీ మారనున్నారని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. అయితే దర్శిలో ఇప్పటికే పలువురి పేర్లతో ఈ సర్వే కొనసాగుతోంది.