India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం(ఒంగోలు) ఇన్ఛార్జ్ ఉపకులపతిగా ఏయూ జర్నలిజం విభాగం సీనియర్ ఆచార్యులు డీవీఆర్ మూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆచార్య మూర్తి ఏయూ పరీక్షలు విభాగం డీన్గా విధులను నిర్వహిస్తున్నారు. గతంలో ఈయన విదేశీ భాషలు విభాగాధిపతిగా, జర్మన్ సెంటర్ డైరెక్టర్, జర్నలిజం విభాగాధిపతిగా, బిఓఎస్ ఛైర్మన్గా పదవులు నిర్వహించారు.
మార్కాపురంలో గురువారం ఓ రిమాండ్ ఖైదీ రైలు నుంచి దిగి పరారయ్యాడు. విశాఖ నుంచి అనంతపురానికి తీసుకొస్తున్న క్రమంలో ఖైదీ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నాడు. ఇతను గుత్తి మండలం పి.కొత్తపల్లికి చెందిన నరేశ్గా పోలీసులు తెలిపారు. గంజాయి రవాణా కేసులో ముద్దాయి అయిన నరేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ప్రకాశం జిల్లా మీదగా ప్రయాణించే పలు ఎక్స్ప్రెస్ రైళ్లను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. జులై 21 నుంచి రైలు నం.17282 నరసాపూర్-గుంటూరు ఎక్స్ప్రెస్, రైలు నం.17227 గుంటూరు-డోన్, 22 నుంచి రైలు నం.17228 డోన్-గుంటూరు ఎక్స్ప్రెస్, రైలు నం.17281 గుంటూరు-నరసాపూర్ రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
తాళ్లూరు మండలం దారంవారిపాలెం గ్రామానికి చెందిన మేడగం చంద్రశేఖరరెడ్డి(21) బుధవారం కాలుజారి బావిలో పడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. చంద్రశేఖరరెడ్డి పంజాబ్లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఇటీవల సెలవు నిమిత్తం ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో పొలం వద్ద బావిలో నీరు తాగేందుకు దిగగా ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయాడు. ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో ఒంగోలు మేయర్ గంగాడ సుజాత వ్యవహారం ఆసక్తి రేపుతోంది. వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆమె పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఇటీవల ఒంగోలుకు వచ్చిన మాజీ బాలినేని ఈ వార్తలను ఖండించారు. ఆమె వైసీపీలోనే ఉంటారని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆమె టీడీపీ ఎంపీ మాగుంటను కలిశారు. ఈక్రమంలో ఆమె బాలినేనికి షాక్ ఇస్తారేమోనన్న చర్చ జరుగుతోంది.
ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా ఏఆర్ దామోదర్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాతో తనకు మంచి అనుబంధం ఉందని, జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ, నేరాల నియంత్రణ విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా భావిస్తున్న గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈనెల 18, 19 తేదీలలో ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం తెలిపింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాలలో పనిచేసే రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద ఉండరాదని అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసర సహాయం కోసం 1070, 112 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని మద్దులూరు రొయ్యల ఫ్యాక్టరీ వద్ద బుధవారం బైక్ ను టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న రావెళ్ళ వెంకట్రావు టిప్పర్ టైర్ల కింద పడి మృతి చెందాడు. వెంకట్రావు కుమార్తె లారీ టైర్ల కింద పడి కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. కుమార్తెను ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాచర్ల మండలం ఫారం గ్రామ పరిసర పొలాల్లో చిరుతపులి సంచరించినట్లు ప్రజలు గుర్తించారు. గ్రామానికి చెందిన కొందరు పరిసర పొలాల్లో తిరుగుతుండగా పులి అడుగులను కనుగొన్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో ఎఫ్ఎస్ఓ జమాల్ బాషా, శ్రీనివాస్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పాదముద్రలను బట్టి పులి సంచరించినట్లు కనిపిస్తోందని, స్పాట్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
ప్రకాశం జిల్లా కొత్త ఎస్పీగా ఆర్ దామోదర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ నాగేశ్వరరావుతో పాటు జిల్లాలోని పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో పాటు సిబ్బంది ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వం, డీజీపీకి కృతజ్ఞతలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.