Prakasam

News March 25, 2024

ప్రకాశం: ‘క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు’

image

క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడడం చట్టరీత్యా నేరమని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బెట్టింగ్‌‌ల సమాచారాన్ని ఎవరైనా సమాచారం అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. డబ్బులకు అశపడి బెట్టింగులు ఆడి నష్టపోతే ఆ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.

News March 24, 2024

గుడ్లూరు: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

image

విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గుడ్లూరులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుడ్లూరు మండలం నర్సాపురం గ్రామంలో పళ్లెం రాజేష్ అనే వ్యక్తి తెల్లవారుజామున గ్రామ శివారులో బహిర్భూమికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు పక్కనున్న ట్రాన్స్‌ఫార్మర్ తీగలు తగులుకొని రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 24, 2024

ప్రకాశం: DMHOకు ఏడీగా ఉద్యోగోన్నతి

image

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.రాజ్యలక్ష్మికి వైద్యశాఖ అడిషనల్ డైరెక్టర్‌గా ఉద్యోగోన్నతి లభించింది. ఆమె ఏప్రిల్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యలక్ష్మికి ఆడిషనల్ డైరెక్టర్ (స్పెషల్) హోదా కల్పిస్తూ ఇక్కడే పనిచేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న DMHO పోస్టును అప్‌గ్రేడ్ చేసి ఇక్కడే కొనసాగే విధంగా వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో తెలిపారు.

News March 24, 2024

ప్రకాశం: భార్యను హత్యచేసిన భర్త అరెస్ట్

image

వేటపాలెం మండల పరిధిలోని రోశయ్య కాలనీకి చెందిన దేవర లక్ష్మీ(35)ని హత్యచేసిన కేసులో భర్త లక్ష్మీనారాయణను చీరాల టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. గత బుధవారం గ్రామ శివారు ప్రాంతంలోని పొలాల్లోకి భార్యను తీసుకెళ్లి హతమార్చి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

News March 24, 2024

ప్రకాశం: టీడీపీలోకి మాజీమంత్రి శిద్దా?

image

టీడీపీలోకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆయన పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా దర్శి టీడీపీ అభ్యర్థిగా ఆయనకు టికెట్ ఇస్తామని అధిష్ఠానం భరోసా ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఆయన చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు దర్శిలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. మరి ఈయన పార్టీలో చేరితే పొత్తులో భాగంగా సీటు వస్తుందో రాదో చూడాలి.

News March 23, 2024

కొండేపి ఎమ్మెల్యేకు మాతృవియోగం

image

కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తల్లి సుబ్బమ్మ (83)అనారోగ్యంతో శనివారం సాయంత్రం కన్నుమూశారు. డోలా సుబ్బమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమె తుది శ్వాస విడిచారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో ఆదివారం సుబ్బమ్మ అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తెలిపారు.

News March 23, 2024

మార్కాపురం: 7 మంది వాలంటీర్లు రాజీనామా

image

మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయలలో పనిచేసే 7 మంది వాలంటీర్లు శనివారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు మేరకు 2024లో తిరిగి జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతో వాలంటీర్లు రాజీనామా చేస్తున్నట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కి అందచేశారు.

News March 23, 2024

ప్రకాశం: వైసీపీ MLAపై కేసు నమోదు

image

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారనే ఆరోపణలపై గిద్దలూరు MLA రాంబాబుపై శుక్రవారం రాత్రి కేసు నమోదైంది. ఈ నెల 18న మార్కాపురంలో షాదీఖానా స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆయనతోపాటు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ అలిబేగ్, 20వ వార్డు కౌన్సిలర్ షేక్ సలీం పాల్గొన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ రాహుల్ మీనా వారిపై కేసు నమోదు చేయించారు.

News March 23, 2024

ప్రకాశం జిల్లాలో YCP ఇప్పటివరకూ గెలవని స్థానాలు

image

2019లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 9 స్థానాలు కైవసం చేసుకుంది. కానీ వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ పార్టీ గెలవలేకపోయింది. అవే చీరాల, కొండపి, పర్చూరు స్థానాలు. అభ్యర్థుల మార్పుతో ఎలాగైనా ఈసారి గెలవాలని గట్టి పట్టుదలతో అధిష్ఠానం భావిస్తోంది. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఆ స్థానాల్లో జెండా ఎగురవేయాలని భావిస్తోంది.

News March 23, 2024

ప్రకాశం: ఏప్రిల్ 18 నుంచి నామినేషన్లు: ఎన్నికల అధికారి

image

ఏప్రిల్ 18 నుంచి జరిగే నామినేషన్లు జరగనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ట్రైల్ రన్ నిర్వహించారు. వచ్చే నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేయడం, ప్రత్యేక అధికారుల నియామకం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.