Prakasam

News March 16, 2024

ప్రకాశం జిల్లా వైసీపీలో ఒకే ఒక్కడుగా బాలినేని

image

ప్రకాశం జిల్లా వైసీపీలో గత, తాజా ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బాలినేని ఒకే ఒక్కడిగా నిలిచారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో కొందరు సీట్లు కోల్పోవడం, ఇంకొందరు స్థానాలు మారడం జరిగింది. ఒంగోలు నుంచి బాలినేని ఒక్కరే తిరిగి సీటు దక్కించుకున్నారు. జిల్లాలోని సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, వైపాలెం, కొండపి నియోజకవర్గాలకు అందరూ కొత్తవారే.

News March 16, 2024

వందలాది కార్లతో ర్యాలీగా బయలుదేరిన మాగుంట

image

ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి శనివారం తాడేపల్లిలోని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒంగోలు నుంచి వందలాది కార్లతో తన అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఉన్న మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. తాడేపల్లి బయలుదేరి వెళ్లారు.

News March 16, 2024

ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేపథ్యం

image

ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి మండలం తుమ్మలగుంటలో 1973లో జన్మించారు. ఏపీ అభివృద్ధిలో PhD పూర్తి చేశారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి సహకారంతో 2007లో తుడా ఛైర్మన్ గా పనిచేశారు. 2014లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే తిరిగి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఒంగోలు ఎంపీగా పోటీ చేయనున్నారు.

News March 16, 2024

ఎంపీ మాగుంటతో ఎమ్మెల్యే గొట్టిపాటి, దామచర్ల భేటీ

image

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని శనివారం టీడీపీకి చెందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌లు కలిశారు. ఒంగోలులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో వారు భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం తాడేపల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఎంపీ మాగుంట ఆయన కుమారు రాఘవరెడ్డి ఆ పార్టీలో చేరనున్నారు.