India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మార్కాపురానికి చెందిన అరిమెల్ల అశోక్(26) 2022లో తల్లిని హత్య చేశాడు. దీంతో అతణ్ని ఒంగోలు జైలుకు తరలించారు. బెయిల్ మీద బయటికి వచ్చి తర్వాత ఆయన పెదనాన్నను చంపాడు. మళ్లీ అతడిని జైలుకు పంపారు. కొద్ది రోజుల తర్వాత మానసిక స్థితి బాగోలేదు. వైద్యం కోసం విశాఖ మెంటల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ తనకు బెయిల్ రాదేమోనని భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఒంగోలుకు చెందిన రాజేశ్ బాబు అస్సాంలో హత్యకు గురయ్యాడు. అస్సాంలో రాజేశ్ ప్రిన్సిపల్గా, కెమిస్ట్రీ టీచర్గా పనిచేసేవాడు. అక్కడ ఓ విద్యార్థికి తక్కువ మార్కులు రావడం, ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆయన శనివారం మందలించాడు. తల్లిదండ్రులను తీసుకురావాలని ఆదేశించాడు. దీంతో ఆ విద్యార్థి కక్ష పెంచుకొని సాయంత్రం రాజేశ్ క్లాస్ చెబుతుండగా.. కత్తితో దాడి చేసి చంపేశాడు. పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.
జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగులు వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ పేర్కొన్నారు. మహిళకు అర్ధరాత్రి ఫోన్ చేసి వేధింపులు అనే కథనం “way2news”లో ఆదివారం రావడంతో ఎస్పీ సోమవారం స్పందించారు. లైంగిక వేధింపు నిరోధక చట్టాన్ని పక్కగా అమలు చేస్తున్నామని, అంతర్గత ఫిర్యాదుల మేరకు విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
చీరాల కొత్తపాలేనికి చెందిన మణికంఠరెడ్డి, కుసుమాంజలికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మొదటి సంతానంగా పాప పుట్టగా, కుసుమాంజలి గర్భవతిగా ఉన్న సమయంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందాడు. కుసుమాంజలికి రెండో కాన్పులో ఆడ కవలలకు జన్మనిచ్చింది. దీంతో అత్తా, మామ, మరిది ఇంట్లోకి రానివ్వలేదని అత్తింటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. కుసుమ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రకాశం జిల్లాలోని మూడు ప్రదేశాలలో సుమారు 42,833 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉన్నట్లు గనులు, భూగర్భ శాఖ జిల్లా అధికారి బి.జగన్నాథరావు తెలిపారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ తీసుకున్న నిర్ణయాల ప్రకారం టన్ను ఇసుక ధర రూ.247గా కలెక్టర్ ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్, సతుకుపాడు డంప్-1, డంప్-2లో రూ.247 చెల్లించి సొంత వాహనాలలో ఇసుక తీసుకెళ్లవచ్చని తెలిపారు.
ఒంగోలులోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కాలేజీలో ఈ నెల 11న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బాలికల ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ పి.ఉమామహేశ్వరిదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ చదువుతున్న, పాసైన అభ్యర్థులను ఉద్యోగం లేదా అప్రంటీస్ శిక్షణకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షణ భృతి చెల్లిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
దర్శి మండలం రాజంపల్లిలో విషాద ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. రావులపల్లి ప్రసాద్ మద్యం తాగి ఇంటికి వెళ్లి తల్లితో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ప్రసాద్ మద్యం మత్తులో తల్లితో గొడవ పడుతుండగా తమ్ముడు బాలరాజు క్షణికావేశంలో కర్రతో ప్రసాద్ను బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ప్రసాద్ను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నకిలీ సదరం సర్టిఫికెట్లను ఏరిపారేయాలని వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు దొంతిరెడ్డి గోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మార్కాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి వంద మందిలో 25% నకిలీ వ్యక్తులే దివ్యాంగులుగా చలామణి అవుతూ నిజమైన దివ్యాంగులకు ప్రభుత్వం ఇస్తున్న పథకాలను అనుభవిస్తున్నారని ఆరోపించారు. దివ్యాంగులకు న్యాయం చేసి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
కారుకు పోలీసు హారన్ బిగించి ఒంగోలు రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ భయాందోళనలకు గురి చేసిన ఓ ఆకతాయికి స్థానికులు శనివారం దేహాశుద్ధి చేశారు. పేర్నమిట్టకు చెందిన రవి ఇటీవలే కొత్త కారు కొని 4 రోజుల నుంచి పగలు రాత్రీ తేడాలేకుండా తిరుగుతున్నాడు. రోడ్డుపై వెళుతున్న ఒక మహిళకు అతి సమీపంలో కారు తీసుకెళ్లి ఆటపట్టించాడు. ఆగ్రహానికి గురైన మహిళ, స్థానికులు అతనిని పట్టుకొని తాళ్లతో కట్టేసి చితకబాదారు.
చీరాలలో టీడీపీ నాయకుడిపై దాడి చేసిన ఘటనలో నేరుగా పాల్గొన్న కానిస్టేబుల్ మువ్వా బాలశంకర రావు(ఉరఫ్ బాలు) సస్పెండ్ అయ్యారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. టీడీపీ నాయకుడిపై కానిస్టేబుల్ దాడి చేశాడు. దీంతో బాధితుడు చీరాల రెండో పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది. దీనిపై విచారించిన ఎస్పీ వకుల్ జిందాల్ కానిస్టేబుల్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.