India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జూన్ నెల పూర్తి కావొస్తున్న ప్రకాశం జిల్లాలో వర్షాల జాడ లేకపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. ఖరీఫ్ సీజన్లో 90 వేల హెక్టార్లకు పైగా పంటలు జిల్లాలో సాగవుతుంటాయి. ఇందులో అత్యధికంగా 70-75 వేల హెక్టార్లలో కంది వేస్తుండగా, కొన్ని చోట్ల సజ్జ పండిస్తారు. ప్రస్తుతం కంది, పొగాకుకు మంచి ధరలు ఉండటంతో ఎక్కువ మంది వీటిపైనే మొగ్గు చూపుతున్నారు. ఏ పంటలు వేయాలన్నా వరుణిడి కోసం రైతన్నలు ఎదురుచూపులు తప్పడం లేదు.
కనిగిరికి చెందిన రసూల్ (32) అనే వ్యక్తి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఘన్పూర్ శివారులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రసూల్ కొన్నేళ్ల క్రితం చుక్కాపూర్ అనే గ్రామానికి వలసవెళ్లాడు. ఆదివారం సాయంత్రం నడుచుకుంటూ ఘన్పూర్ గ్రామం వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా.. కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో మరణించాడు.
ప్రకాశం జిల్లాకు నూతన కలెక్టర్ గా తమీమ్ అన్సారియాను నియమితులైన విషయం తెలిసిందే. 2015 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అన్సారియా గతేడాది ఫిబ్రవరిలో శ్రీకాకుళం కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈమె భర్త 2012 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన మనజీర్ జిలానీ సామూన్ ప్రస్తుతం శ్రీకాకుళం కలెక్టర్గా ఉన్నారు. గతేడాది ఒకేసారి ఇద్దరు శ్రీకాకుళం జిల్లాకు బదిలీపై వచ్చారు. తాజాగా అన్సారియా ప్రకాశం కలెక్టర్గా నియమితులయ్యారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అమలు చేస్తున్న మతతత్వ, కార్పొరేట్ విధానాలపై దేశవ్యాప్తంగా ఐక్యపోరాటాలు చేయడం ద్వారానే ప్రభుత్వరంగ సంస్థలను, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోగలమని సీపీఎం రాష్ట్ర నాయకుడు వై.సిద్దయ్య తెలిపారు. చీరాలలో జరుగుతున్న సీపీఎం జిల్లా శిక్షణ తరగతులలో ఆయన బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య శక్తులను కలుపుకొని పోరాటాలు చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని వివరించారు.
గత ఐదేళ్లలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి కఠినంగా శిక్షించాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ.. బాలినేని అనుచరులు భూకబ్జాలు చేస్తూ దొంగ రిజిస్ట్రేషన్లతో పట్టణంలో భయానక వాతావరణాన్ని సృష్టించారన్నారు. తక్షణమే సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలన్నారు.
వేటపాలెంలో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరికి చెందిన 12 మంది యువకులు వేటపాలెం మండలంలోని రామాపురం బీచ్కు వెళ్లారు. వీరంతా సముద్ర స్నానానికి దిగగా.. అందులో ఇద్దరు మృతిచెందారు. చనిపోయిన వారిని బాలసాయి(26), బాలనాగేశ్వరరావు(27)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చీరాల పట్టణంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ థియేటర్ సమీపంలో నడిరోడ్డుపై గుర్తుతెలియని దుండగుడు ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడిని కంచర్ల సంతోశ్గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అద్దంకి మండలంలో శనివారం 33 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తిమ్మాయపాలెం పొలాల్లో కొందరు శుక్రవారం రాత్రి మద్యం తాగుతుండగా ప్రత్యర్థి వర్గీయులు వారిపై కర్రలు, రాడ్లతో దాడిచేసి గాయపరిచారు. క్షతగాత్రుడు ఎం.శివకృష్ణ ఫిర్యాదు మేరకు 33 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మాయగాళ్ల బారిన పడి అలేఖ్య అనే యువతి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. పోలీసుల వివరాల మేరకు.. కారంచేడుకు చెందిన జాగర్లమూడి అలేఖ్య అనే యువతి ఉద్యోగ వేటలో ఉండగా తన వాట్సప్కు ఓ మెసేజ్ వచ్చింది. ఉద్యోగం ఆశచూపి వారు అడిగినంత మొత్తం రూ.5.30 లక్షలు చెల్లించింది. చివరకు ఆ గ్రూపు డిలీట్ కావడంతో అలేఖ్యకు మోసం అర్థమైంది. గ్రహించి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఎస్సై సురేష్ తెలిపారు.
మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముండ్లమూరు మండలం శంకరాపురంలో శనివారం వెలుగు చూసింది. పరుశురాం కుమారుడు జమదగ్ని (19) ఒంగోలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఇటీవల విడుదల చేసిన సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. మనస్తాపానికి గురై ఊరికి దూరంగా ఉన్న పొలాల్లో ఉరేసుకొని విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై పరిశీలించి కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.