Prakasam

News June 20, 2024

ప్రకాశం జిల్లాలో తాగునీటి ఎద్దడికి ప్రత్యేక చర్యలు

image

జిల్లాలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాలో లోపాలు లేకుండా చూడడం కోసం ఆన్లైన్ ట్రాకింగ్ యాప్‌ను వినియోగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. పశువులకు కూడా నీటి సరఫరా చేసేందుకు తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. కనిగిరి, మార్కాపురం, నియోజకవర్గాలలో తాగునీటి ఎద్దడిని 3 రోజులకు ఒకసారి అధ్యయనం చేస్తామన్నారు. పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు.

News June 20, 2024

ఒంగోలు: దోపిడీ కేసులో నిందితులు అరెస్ట్

image

దోపిడీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు అడిషనల్ ఏఎస్పీ శ్రీధర్ రావు తెలిపారు. గురువారం ఒంగోలులోని SP కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొండపి మండలం వెన్నూరునకు చెందిన వంశీకృష్ణ తన బంధువుల ఫంక్షన్ నిమిత్తం ఈనెల 16న ఒంగోలు వచ్చారు. వంశీకృష్ణ కుమారుడు జయవర్ధన్ బాబును ఇద్దరు నిందితులు ఫంక్షన్లో మాయమాటలతో చెయిన్, బ్రాస్లెట్, ఉంగరం దొంగిలించారు. ఈమేరకు పోలీసు బృందాలతో పట్టుకున్నామన్నారు.

News June 20, 2024

ఒంగోలు: మార్పులకు అనుగుణంగా విద్యాబోధన జరగాలి

image

అంతర్జాతీయ సమాజంలో వస్తున్న మార్పులు ఉద్యోగ అవకాశాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆయా అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లాలోని ఎంపిక చేసిన 20 పాఠశాలు, కె.జి.బి.వి.లు, ఏ.పి.మోడల్ స్కూల్స్ ఒకేషనల్ కోర్సులు కలిగిన జూనియర్ లెక్చరర్లకు గురువారం కొప్పోలులో కెరీర్ ఎడ్యుకేషన్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

News June 20, 2024

టీటీడీ ఛైర్మన్‌గా ఏలూరి సాంబశివరావు.?

image

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా ఏలూరిని నియమించాలని చంద్రబాబు సర్కార్ చూస్తోందని సమాచారం. రాష్ట్ర మంత్రి మండలిలో ఏలూరికి స్థానం దక్కకపోవడంతో ఆయనకు సముచిత స్థానం కల్పించాలని అధిష్ఠానం చూస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే బాపట్ల జిల్లాలో ఎన్డీఏ కూటమి ఘన విజయానికి కారకులైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకి టీటీడీ ఛైర్మన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు ధీమాగా ఉన్నారు.

News June 20, 2024

ప్రకాశం: నామినేటెడ్ పదవుల కోసం పోటాపోటీ

image

TDP అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నామినేటెడ్‌ పదవులపై ఆ పార్టీ నాయకుల ఆశలు పెరుగుతున్నాయి. వీటితోపాటు రేషన్‌ డీలర్‌షిప్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల కోసం గ్రామ, మండల స్థాయి నాయకులు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఓ నియోజకవర్గ స్థాయిలో 150 నుంచి 170 వరకు, మండల స్థాయిలో 40-60 వరకు వివిధ రకాల పోస్టులు ఉన్నట్లు TDP శ్రేణులు క్షేత్రస్థాయిలో లెక్కలేసుకుని తమకు ఏ పదవులు కావాలో నిర్ణయించుకుంటున్నారు.

News June 20, 2024

ప్రకాశం: గంజాయి నిర్మూలనపై వంద రోజుల ప్రణాళిక

image

జిల్లాలో మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా గంజాయిని నిర్మూలించేందుకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. బాధితులకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. వంద రోజుల్లో స్పష్టమైన మార్పు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహిళ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

News June 20, 2024

ఒంగోలు: వృద్ధురాలుని హత్య చేసిన దుండగులు

image

ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలో వృద్ధురాలుని గుర్తుతెలియని దుండగులు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఎర్రమనేని సీతమ్మ(80) మంగళవారం అర్ధరాత్రి దుండగులు హత్య చేసి ఆమె దగ్గర ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News June 20, 2024

చీమకుర్తిలో కిడ్నాప్ కలకలం

image

చీమకుర్తిలో కిడ్నాప్ కలకలం రేపింది. చీమకుర్తి సీఐ దుర్గా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పూర్ణ అనే యువకుడు బైక్‌‌పై బైపాస్ కూడలి ప్రాంతంలో వెళ్తుండగా.. ఎండ్లూరి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఆయనను వెంబడించి దాడి చేశాడు. మత్తు సూది ఇచ్చి కారులో హైదరాబాద్‌లోని మల్కాపూర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ స్పృహలోకి వచ్చిన పూర్ణ తప్పించుకొని తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు సీఐ తెలిపారు.

News June 20, 2024

చీమకుర్తి: నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

image

చీమకుర్తి మండల పరిధిలో పరివర్తకం మార్పిడి పనుల కారణంగా కె.వి.పాలెం, ఏలూరివారిపాలెం, గోనుగుంట, రామచంద్రాపురం, పిడతలపూడి, మర్రిపాలెం, మువ్వవారిపాలెం, జీఎలప్పురం గ్రామాలకు.. గురువారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈఈ కృష్ణారెడ్డి, ఏడీఈ శ్రీనివాసరావు తెలిపారు. చీమకుర్తి ఉపకేంద్రం పరిధిలోని పరిశ్రమలకు సైతం అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.

News June 20, 2024

యద్దనపూడి: టీడీపీ ఫ్లెక్సీల చించివేత

image

యద్దనపూడి మండలం వింజనంపాడు అధికార పార్టీ ఫ్లెక్సీలను చించివేసిన ఘటన కలకలం రేపింది. వైసీపీకి చెందిన సీనియర్ నేత సమక్షంలోనే ఆ పార్టీ కార్యకర్త కావాలనే సమీపంలో ఉన్న టీడీపీ ఫ్లెక్సీ చించివేయడంపై ఆగ్రామ టీడీపీ నేతలు యద్దనపూడి పోలీసులను ఆశ్రయించారు. కావాలని వైసీపీ నాయకులు, శ్రేణులు అధికార టీడీపీకి చెందిన ప్లెక్సీలు చించివేయడంపై ఆ గ్రామాల్లో కలకలం రేపుతోందని గ్రామస్థులు పేర్కొన్నారు.