Prakasam

News June 17, 2024

ప్రకాశం జిల్లాలో నాలుగు రోజులు కరవు బృందం పర్యటన

image

రబీలో కరవు పరిస్థితిని పరిశీలించేందుకు రితేశ్ చౌహాన్ నేతృత్వంలోని కేంద్ర బృందం కరవు ప్రభావిత జిల్లాల్లో 18వతేది నుంచి 21 వరకు పర్యటించనున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. 10 మంది సభ్యులు మూడు బృందాలుగా క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడతారు. ఇందులోని ఒక బృందం నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించి పరిస్థితి తెలుసుకుంటారని ఆయన తెలిపారు.

News June 16, 2024

ఏల్చూరులో తప్పిన పెను ప్రమాదం

image

మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఏల్చూరులోని పంట పొలాలకు మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ పక్కకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. బోల్తా పడిన ట్రాక్టర్‌ను స్థానికులు పైకి లేపారు.

News June 16, 2024

ఒంగోలు: బక్రీదు పండుగపై అడిషనల్ SP కీలక సూచనలు

image

త్యాగానికి, సత్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పర్వదినాన్ని సుఖ శాంతులతో జరుపుకోవాలని అడిషనల్ ఎస్పీ కె.నాగేశ్వరరావు సూచించారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. గోవుల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు జిల్లాలో 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.

News June 16, 2024

ఒంగోలు: గ్రామీణ ప్రాంత మహిళలకు మగ్గం వర్క్‌పై ఉచిత శిక్షణ

image

మహిళలకు మగ్గం వర్క్‌లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ మహిళలకు ఈనెల 24 నుంచి నుంచి ఒంగోలులో శిక్షణ ఇస్తామన్నారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు మహిళలు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి, సదుపాయాలు ఉంటాయని తెలిపారు.

News June 16, 2024

చీరాల: సముద్ర తీరంలో విద్యార్థి గల్లంతు

image

చీరాల మండలం వాడరేవు సముద్ర తీర ప్రాంతంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. నూజివీడులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న 11 మంది విద్యార్థులు సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ కోసూరి కార్తీక్ (19), మైలవరపు కేదారేశ్వరరావు (19) అలల ధాటికి గల్లంతయ్యారు. మెరైన్ పోలీసుల సాయంతో కేదారేశ్వరరావును కాపాడగలిగారు. కార్తీక్ కోసం గాలిస్తున్నారు.

News June 16, 2024

పొదిలి: నిద్రమాత్రలు మింగిన ANM

image

పొదిలిలోని పి.హెచ్.సిలో పనిచేస్తున్న ANM విజయ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటిసిబ్బంది గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా ఆరోగ్యకేంద్రంలో పనిచేస్తున్న ఓ ఆశ కార్యకర్తకు ANM విజయకు గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో శనివారం ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన విజయ నిద్రమాత్రలు మింగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

News June 16, 2024

ప్రకాశం: తండ్రి కోసం విగ్రహం కట్టించిన కుమారులు

image

కన్న తండ్రికి కుమారులు ఏకంగా గుడి కట్టిన ఘటన సీఎస్‌పురం మండలం కొండ్రాజుపల్లిలో జరిగింది. మట్లే బోడెయ్య, కొండమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. బోడెయ్య వ్యవసాయం చేసి కుమారులను చదివించారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు మాలకొండలరావు రైల్వేలో, చిన్న కుమారుడు సచివాలయంలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో 2021లో బోడెయ్య మృతి చెందగా.. కుమారులిద్దరు తమ పొలంలో బోడెయ్యకు గుర్తుగా గుడి కట్టి ఆయన విగ్రహాన్ని అందులో ఉంచారు.

News June 16, 2024

గుడ్లూరు: అనుమానాస్పదంగా వృద్ధుడు దారుణ హత్య

image

గుడ్లూరు మండలం నరసాపురం- కొత్తపల్లి గ్రామాల రహదారిలోని అటవీ ప్రాంతంలో నరసాపురానికి చెందిన గిరిజన వృద్ధుడు తలపల రమణయ్య (60) దారుణ హత్యకు గురైన విషయం ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కాళ్లు చేతులు కట్టివేసి రమణయ్యను దారుణంగా దుండగులు హత్య చేశారు. సమాచారం అందుకున్న గుడ్లూరు పోలీసులు ఆ ప్రాంతాన్ని చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

News June 16, 2024

చీరాల: బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

image

చీరాల రామ్ నగర్ సమీపంలో శనివారం ఆర్టీసీ బస్సు, బైకు ఢీకొనగా ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రాంనగర్ వద్ద ఒక వేడుక జరుగుతుండడంతో ఒకవైపు రోడ్డుకు తాళ్లు కట్టగా రేపల్లె వెళుతున్న ఆర్టీసీ బస్సు రాంగ్ రూట్‌లో వచ్చి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొంది. దీంతో బైకు నడుపుతున్న ఐటీసీ ఉద్యోగి బుచ్చిబాబు కిందపడగా .. తలకు తీవ్ర గాయమైంది. హుటాహుటిన బుచ్చిబాబును గుంటూరుకు తరలించారు.

News June 16, 2024

జంతు సంరక్షణ చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు: బాపట్ల ఎస్పీ

image

జంతు సంరక్షణ చట్టాలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. జూన్ 17న బక్రీద్ పండగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. జంతువులను చట్టవిరుద్ధంగా వధించడాన్ని అరికట్టడానికి, జంతు సంరక్షణ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.