India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈనెల 7న కురిసిన అకాల వర్షానికి ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి వై గోపీచంద్ తెలిపారు. ఉద్యాన పంటలు అరటి 152 ఎకరాలు, బొప్పాయి 45 ఎకరాలు, కొంత మొక్కజొన్న పంట వర్షంతో పాటు వీచిన గాలులకు నేలకొరిగి దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి చెప్పారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
మండలంలోని పాత మగులూరు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు మిర్చి యార్డుకు మిరపకాయలు తీసుకొని వెళ్తున్న మినీ లారీ అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. అందులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే రహదారిపై మినీ ఆటో బోల్తాపడడంతో కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని లారీని పక్కకు తీసి ట్రాఫిక్ని క్లియర్ చేశారు.
చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య మనమడు పోలిశెట్టి శ్రీనివాసరావు ఎన్నికల నుంచి తప్పుకున్నాడు. చీరాల నుంచి గాజు గ్లాసు గుర్తుతో ఇండిపెండెంట్గా పోటీకి దిగిన శ్రీనివాసరావు గురువారం వైదొలగి TDP అభ్యర్థి మాలకొండయ్యకు మద్దతు ప్రకటించారు. శ్రీనివాసరావుకు కొండయ్య కండువా కప్పి TDPలోకి స్వాగతం పలికారు. చేనేతల వికాసానికి కొండయ్య హామీ ఇచ్చినందున తాను సంతృప్తి చెంది పోటీ నుంచి తప్పుకున్నట్లు పోలిశెట్టి చెప్పారు.
TDP అధినేత నారా చంద్రబాబు రేపు ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఆయన ఒంగోలుకు చేరుకుంటారు. అనంతరం నగరంలో రోడ్ షో నిర్వహించి, రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 11వ తేదీ ఉదయం చిత్తూరు జిల్లా, పూతలపట్టుకు వెళ్తారు. దీంతో దామచర్ల జనార్దన్కు సమాచారం అందగా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. మొదటగా చంద్రబాబు 11వ తేదీ ఒంగోలుకు రావాలి. కానీ ఆయన పర్యటన ఒక రోజు ముందుకు మారింది.
జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు ఎన్నికల కమిషన్ మరో చాన్స్ ఇస్తూ, ఒక రోజు పొడిగించింది. తొలుత ప్రకటించిన ప్రకారం బుధవారంతో ఈ ప్రక్రియ ముగియాల్సి ఉంది. తాజాగా గురువారం కూడా ఓటింగ్కు అవకాశం కల్పించింది. జిల్లాలో 19,050 మంది అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం సాయంత్రానికి 17,003 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు ఎన్నికల కమిషన్ మరో చాన్స్ ఇస్తూ, ఒక రోజు పొడిగించింది. తొలుత ప్రకటించిన ప్రకారం బుధవారంతో ఈ ప్రక్రియ ముగియాల్సి ఉంది. తాజాగా గురువారం కూడా ఓటింగ్కు అవకాశం కల్పించింది. జిల్లాలో 19,050 మంది అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం సాయంత్రానికి 17,003 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇటీవల పర్చూరు ఆర్వో కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న ఎస్ఐ నాగశివారెడ్డి టీడీపీ నేతను బూతులు తిట్టారని ఏప్రిల్ 23న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎస్పీకి ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఘటనపై ఎస్పీ ఆదేశాలతో బాపట్ల డీఎస్పీని విచారణ చేపట్టి ఇచ్చిన నివేదికతో ఎస్ఐ నాగశివారెడ్డిపై వేటు పడింది. గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ బుధవారం ఎస్ఐని సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు.
ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో శుక్రవారం చీరాల పోలేరమ్మ గుడి వద్ద నుంచి స్థానిక గడియార స్తంభం సెంటర్ వరకు ఉదయం 10 గంటలకు 2కె రన్ కార్యక్రమం జరగనుంది. దీనిని తెలుగు ప్రొఫెషనల్ వింగ్ (టీపీడబ్ల్యు) నిర్వహిస్తోందని, అందులో తాను పాల్గొంటున్నట్లు సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ బుధవారం తెలిపారు. సైకిల్ గుర్తుపై ఓట్లు వేయాలని, అందుకు అందరినీ జాగృతం చేసేందుకు 2కే రన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి గురువారం కూడా అవకాశం కల్పించినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ బుధవారం తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే అవకాశం బుధవారంతో ముగిసిందన్నారు. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు ఏవైనా కారణాల వల్ల ఓటు వేయకపోతే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేర నియంత్రణ చర్యలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జి, డార్మిటరీలను పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాడ్జీల్లో ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలించి, బస చేసినవారి వివరాలను తెలుసుకున్నారు. కొత్త వ్యక్తులను ప్రశ్నిస్తూ వివరాలు ఆరా తీశారు. లాడ్జి నిర్వాహకులు సక్రమంగా రిజిస్టర్ నిర్వహించాలని పోలీసులు సూచించారు.
Sorry, no posts matched your criteria.