India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రకాశం జిల్లా పడమటి ప్రాంత ప్రజలకు నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ ఎన్నో ఏళ్లనాటి కల. దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఈ పేరు వింటూనే ఉన్నా పనులు పూర్తి కాలేదు. తాజాగా ఈ ప్రాజెక్టు సంబంధించి సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. జిల్లా పరిధిలో ఈ రైల్వే లైన్ భూసేకరణకు పెండింగ్లో ఉన్న రూ.12 కోట్లు ఇవాళే(శుక్రవారం) విడుదల చేయాలని నిన్నటి సమావేశంలో ఆదేశించారు. దీంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జమ్మూలో 30 మంది సైనికుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన సుబ్బయ్య (45)కు నార్పలలో అభిమానలోకం కన్నీటి వీడ్కోలు పలికింది. పోలీసులు, బంధువులు, ప్రజల అశ్రునయనాల మధ్య వారి సొంత వ్యవసాయ పొలంలో సైనిక లాంచనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. సైనిక అధికారులు గౌరవ వందనం సమర్పించి జాతీయ జెండాను జవాన్ సతీమణికి అందించారు. కన్నీటిని దిగమింగుతూ సుబ్బయ్య భార్య, కుమారుడు, కుమార్తె భౌతికకాయానికి సెల్యూట్ చేశారు.

మండలంలోని ఉలవపాడుకు చెందిన కామంచి కోటి అనే వ్యక్తి నందిని పొదుపు సంస్థను ప్రారంభించారు. ఈ పొదుపు సంఘాల్లో సింగరాయకొండకు చెందిన పలువురిని చేర్చుకొని 800 మంది చేత రూ.50 లక్షల వరకు కట్టించాడు. కోటి మరణించగా.. అతని భార్య నందిని పొదుపు సంస్థను నడుపుతూ వచ్చింది. గత కొన్ని నెలలుగా సంస్థను మూసివేయడంతో డబ్బులు కట్టిన వారు మోసపోయామని గ్రహించి న్యాయం కోసం సింగరాయకొండ ఎస్సై మహేంద్ర వద్దకు చేరారు.

‘మా వాడు బాగా చదివాడు.. విదేశాల్లో గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు’ అని ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. ఇంటికి వచ్చి తమను సంతోషంగా చూస్తాడనుకొని ఆనందపడ్డారు. కానీ.. ఓ <<14850503>>రోడ్డు ప్రమాదం<<>> వారి ఆశలను రోడ్డు పాలు చేసింది. ఈ ఘటన చీమకుర్తి బూదవాడలో చోటు చేసుకుంది. బుధవారం చిరంజీవి(32) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అతడితో ప్రయాణించిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో ఆ కుటుంబాన్ని శోకసంద్రాన్ని మిగిల్చింది.

జమ్మూలో విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్ వరికుంట్ల సుబ్బయ్య రియల్ హీరో అని మాజీ సీఎం జగన్ కొనియాడారు. సుబ్బయ్య ల్యాండ్మైన్ ఉచ్చు నుంచి తనతోటి జవాన్లు 30 మందిని కాపాడడం స్ఫూర్తిదాయకమని అన్నారు. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, అతని ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ‘X’లో పోస్టు చేశారు.

జమ్మూలో విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్ వరికుంట్ల సుబ్బయ్య రియల్ హీరో అని మాజీ సీఎం జగన్ కొనియాడారు. సుబ్బయ్య ల్యాండ్మైన్ ఉచ్చు నుంచి తనతోటి జవాన్లు 30 మందిని కాపాడడం స్ఫూర్తిదాయకమని అన్నారు. తన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, తన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ‘X’లో పోస్టు చేశారు.

లండన్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చీమకుర్తి మండలం బూదవాడకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పీ చిరంజీవి(32) మృతిచెందారు. అతను కారులో వెళుతుండగా డివైడర్ను ఢీకొట్టడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలియడంతో అతని తల్లిదండ్రులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతదేహం ఇండియాకు రావాల్సి ఉంది.

జమ్మూలో ల్యాండ్ మైన్ పేలి వీరమరణం పొందిన కంభం మండలం <<14838717>>రావిపాడుకు చెందిన జవాన్ <<>>వరికుంట్ల సుబ్బయ్యకు బుధవారం మంత్రి అనిత సంతాపం తెలిపారు. సైన్యంలో 23 ఏళ్లు సేవలందించిన సుబ్బయ్య ప్రాణాలు కోల్పోయిన వార్త కలచివేసిందన్నారు. కానీ, మృత్యువు చేరువైందని తెలిసినా గో బ్యాక్ అంటూ సహచర జవాన్లను అప్రమత్తం చేసి తనువు చాలించారని, జవాన్ సుబ్బయ్య సాహసం ఆదర్శమని మంత్రి అనిత తన X ఖాతాలో పోస్ట్ చేశారు.

ప్రకాశం జిల్లాలో కంది సాగు చేసిన రైతులకు జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాల కృష్ణ శుభవార్త చెప్పారు. రైతుల నుంచి ప్రభుత్వమే కందులు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈనెల 12వ తేదీ నుంచి కొనుగోలుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. కంది సాగు చేసిన రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు.

ప్రకాశం జిల్లా కంభం మండలం <<14839505>>రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్<<>> వరికుంట్ల సుబ్బయ్య(43) జమ్మూలో సోమవారం మృతిచెందిన విషయం తెలిసిందే. 25వ రాష్ట్రీయ రైఫిల్స్ హవల్దార్గా పనిచేస్తున్న సుబ్బయ్య పూంచ్ సెక్టార్ వద్ద పహారా కాస్తున్నారు. ఈక్రమంలో పొరపాటున ల్యాండ్ మైన్పై కాలు పెట్టారు. తన ప్రాణం పోవడం ఖాయమని భావించారు. సహచర జవాన్లను ‘GO BACK’ అంటూ అలర్ట్ చేశారు. కాసేపటికే ల్యాండ్ మైన్ పేలడంతో వీర మరణం పొందారు.
Sorry, no posts matched your criteria.