Prakasam

News April 28, 2024

30న యర్రగొండపాలెంకు చంద్రబాబు రాక

image

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 30వ తేదీన యర్రగొండపాలెంకు రానున్నారు. ఉదయం 10 గంటలకు నియోజకవర్గాన్ని ఉద్దేశించి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ మేరకు పార్టీ జిల్లా నాయకులకు సమాచారం అందగా వారు చంద్రబాబు నాయుడు సభ ఏర్పాట్లలో సన్నద్ధమయ్యారు.

News April 28, 2024

ఒంగోలులో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

image

సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఒంగోలులోని గొడుగుపాలెంలో శనివారం వేకువజామున జరిగింది. ఒకటో పట్టణ సీఐ ఎం.లక్ష్మణ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న షేక్ ముస్తాక్ కుమార్తె ఆరిఫా సుల్తానా(19) నగరంలోని రైజ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అవడంతో ఇంట్లో ఉరేసుకుంది. ఘటనపై కేసు నమోదైంది.

News April 28, 2024

దర్శి: నిద్రిస్తున్న బాలికపై అత్యాచార యత్నం

image

బాలికపై అత్యాచారానికి యత్నించిన ఘటన ముండ్లమూరు మండలంలో శనివారం జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, తల్లిదండ్రులతో కలిసి ఇంటి మేడపై నిద్రిస్తోంది. దోమలు కుడుతున్నాయని సోదరుడితో కలిసి కిందికి దిగి ఇంటి వరండాలో నిద్రపోయింది. అదే గ్రామానికి చెందిన బ్రహ్మయ్య బాలిక నోరు మూసి, అరిస్తే చంపేస్తానని బెదిరించి, అత్యాచారం చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News April 28, 2024

ప్రకాశం: కోనంకి సబ్ డివిజన్‌లో ఆగిన సాగర్ జలాలు

image

కోనంకి సబ్ డివిజన్‌లో రెండో దఫా వచ్చిన సాగర్ జలాలు శనివారం వేకువజాముతో ఆగిపోయాయి. మార్టూరు, పర్చూరు, కారంచేడు, యద్దనపూడి, ఇంకొల్లు మండలాలలో 68 మంచి నీటి చెరువులు ఉండగా వాటిలో 58 చెరువులకు నీళ్లు చేరినట్లు ఎన్ఎస్పీ ఈఈ ఉమామహేశ్వరరావు చెప్పారు. మార్టూరు చెరువుకు మాత్రం 50 శాతం సాగర్ జలాలు చేరాయి. జూన్ నెల వరకు గ్రామంలో తాగునీటికి ఇబ్బంది ఉండదని పంచాయతీ అధికారులు చెబుతున్నారు.

News April 27, 2024

కందుకూరులో వైసీపీకి బిగ్ షాక్

image

కందుకూరులో వైసీపీకి షాక్ తగిలింది. అ పార్టీకి చెందిన ప్రముఖ కాపు బలిజ నాయకులు దారం మాల్యాద్రి, దారం కృష్ణ తమ అనుచర గణంతో శనివారం జనసేన పార్టీలో చేరారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డికి వైసీపీ టికెట్ దక్కకపోవడంతో కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఈ నాయకులు ఇద్దరూ శనివారం తమ అనుచరులతో కలిసి పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు సమక్షంలో జనసేనలో చేరారు.

News April 27, 2024

ఒంగోలు పార్లమెంట్ అప్‌డేట్స్

image

➤ మొత్తం ఓటర్ల సంఖ్య: 18,22,470➤ పురుషుల ఓటర్లు: 9,07,980➤ మహిళా ఓటర్లు: 9,23,374➤ఇతరులు: 111➤పోలింగ్ బూత్‌ల సంఖ్య: 2187అభ్యర్థులు:-➤ వైసీపీ అభ్యర్థి: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి➤ కూటమి అభ్యర్థి: మాగుంట శ్రీనివాసులు రెడ్డి➤ కాంగ్రెస్ అభ్యర్థి: సుధాకర్ రెడ్డి

News April 27, 2024

అమెరికా యూనివర్సిటీ ఎన్నికల్లో అద్దంకి వాసి

image

అమెరికాలో యూనివర్సిటికీ సంబంధించిన ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికలలో ఏపీకి చెందిన రోహిత్ శ్రీసాయి బాచిన అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. వీరి స్వగ్రామం అద్దంకి నియోజకవర్గం జె. పంగులూరు గ్రామం. వీరి తండ్రి బాచిన హనుమంత రావు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా ఏపీ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్నారు.

News April 27, 2024

30న టంగుటూరు రానున్న సీఎం జగన్

image

ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచార సభ ఈ నెల 30న ఉదయం 10 గంటలకు టంగుటూరులో జరగనున్నట్లు రాష్ట్ర మంత్రి, కొండపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. వైసీపీ శ్రేణులు ముందుగా కొండపిలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని షెడ్యూలు విడుదల చేశారు. అయితే సీఎం పర్యటనకు, జన సమీకరణకు టంగుటూరు అనుకూలంగా ఉంటుందని భావించి మార్చినట్లు మంత్రి సురేశ్ తెలియచేశారు.

News April 27, 2024

ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ ఆమోదం

image

చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్‌ను చీరాల నియోజకవర్గ ఎన్నికల అధికారి సూర్యనారాయణరెడ్డి శనివారం ఆమోదించారు. ఆమంచి కృష్ణమోహన్‌కు రూ.4.63 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు పలువురు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమంచి నామినేషన్‌ను ఆర్ఓ పెండింగ్‌లో ఉంచారు. శనివారం విద్యుత్ బకాయిలపై ఆమంచి వివరణ ఇవ్వడంతో నామినేషన్ ఆమోదించారు.

News April 27, 2024

ఒంగోలు: రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోండి

image

బీపీఈడీ, డీపీఈడీ విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం మే 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి కేఎస్. రాజు ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయినా విద్యార్థినీ, విద్యార్థులు రీవాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్, జవాబు పత్రాలు కరెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

error: Content is protected !!