Prakasam

News January 1, 2025

వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే ఉగ్ర

image

కనిగిరిలో ఎమ్మెల్యే Dr.ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సరం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ఓ వినూత్న కార్యక్రమానికి నాంది పలికారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు నేతలు, అభిమానులు, అధికారులు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ఆయన పూల దండలు, బొకేలు, స్వీట్స్, పండ్లు తీసుకురాకుండా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి సహకరించాలని హుండీ ఏర్పాటు చేసి విరాళాల సేకరణ చేపట్టారు.

News January 1, 2025

పర్చూరు నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌ఛార్జ్ మార్పు

image

పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా గాదె మధుసూదన రెడ్డి నియమితులయ్యారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గాదె మధుసూదన రెడ్డి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు. ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా యడం బాలాజీ ఉన్న విషయం తెలిసిందే.

News December 31, 2024

న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న బాపట్ల కలెక్టర్

image

విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి విద్యార్థులకు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలలో నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై కేక్ కట్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులతో కలిసి వేడుకలు  జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

News December 31, 2024

కులగణనపై అభ్యంతరాలను స్వీకరిస్తాం: బాపట్ల కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 7వ తేదీ వరకు షెడ్యూల్డ్ కులగణనపై సామాజిక తనిఖీ నిర్వహించి, అభ్యంతరాలను స్వీకరిస్తామని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. షెడ్యూల్డ్ కులాల కులగణన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించామని తెలిపారు. దీనిపై వచ్చే అభ్యంతరాలను వచ్చే జనవరి 11 వరకూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. తుది వివరాలను వచ్చే నెల 17న సచివాలయాల్లో ప్రదర్శిస్తామన్నారు.

News December 31, 2024

కొరిశపాడు: రోడ్డు మిల్లర్ ఢీకొని బాలుడి మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా కొరిశపాడులో సోమవారం విషాద ఘటన జరిగింది. స్థానిక జగజ్జీవన్ రావ్ కాలనీకి చెందిన దుడ్డు నాగయ్య కుమారుడు గౌతమ్ తన తాతతో కలిసి బైకుపై సెంటర్లో ఉన్న బొడ్డురాయి దగ్గరికి వెళ్లాడు. ఇద్దరు బైక్‌పై కూర్చొని ఉండగా రోడ్లు వేస్తున్న మిల్లర్ రివర్స్‌లో వచ్చి బైకును ఢీకొట్టింది. బాలుడికి బలమైన దెబ్బ తగలడంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

News December 31, 2024

వేడుకల్లో హద్దు మీరితే చర్యలు: ప్రకాశం SP

image

ప్రకాశం జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులకు ఎస్పీ ఏఆర్ దామోదర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 31వ తేది సాయంత్రం నుంచి అన్ని ముఖ్య కూడళ్లలో పోలీస్ పికెట్స్, నైట్ గస్తీ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పోలీస్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 30, 2024

ప్రకాశంలో ఆ 237 మందికి కొత్త పింఛన్లు

image

భర్త చనిపోతే వెంటనే భార్యకు పింఛన్ మంజూరయ్యాలే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పింఛన్ తీసుకునే వ్యక్తి చనిపోతే ఆ మరుసటి నెల నుంచే భార్యకు నగదు అందజేయనున్నారు. ప్రకాశం జిల్లాలో నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు 237 మంది మృతిచెందారు. ఆ మేరకు ఈనెల నుంచి వారి భార్యలకు పింఛన్ సొమ్ము ఇస్తామని కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రకటించారు. 

News December 30, 2024

ప్రకాశం జిల్లా పింఛన్‌దారులకు రూ.122‌కోట్లు విడుదల

image

ప్రకాశం జిల్లాలో 2,85,438 మంది పింఛన్ దారులకు ప్రభుత్వం రూ.122.79 కోట్లను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. ఈ నిధులు సోమవారమే సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి డ్రా చేయనున్నారు. 31వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటలకు ముందే లబ్ధిదారులకు పంపిణీని ప్రారంభించనున్నారు. జిల్లాలో గత రెండు నెలల నుంచి పింఛన్ తీసుకోని వారికి మూడు నెలలకు కలిపి ఒకేసారి ఇస్తారని కలెక్టర్ చెప్పారు.

News December 30, 2024

గాల్లోకి ఎగిరిన కారు.. మహిళ స్పాట్ డెడ్

image

రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. టంగుటూరు మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన లక్కె పద్మ(47), ఆమె కుమార్తెలు లక్ష్మీ, మాధవిలు బొంతలు కుట్టుకుని జీవిస్తున్నారు. ఆదివారం వాళ్ళు ఆటోలో ఒంగోలు వెళ్తుండగా పెళ్లూరు వద్ద డివైడర్‌ని ఢీకొన్న ఓ కారు గాల్లో ఎగిరి ఆటోపై పడింది. ఘటనలో పద్మ స్పాట్ లో చనిపోయారు. కుమార్తెలు ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. దీంతో వెంకటాయపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి

News December 30, 2024

ఒంగోలులో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడవచ్చన్నారు. ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామన్నారు.