India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం జిల్లాలో ఎన్నికలు హోరా హోరీగా జరిగాయి. ఉ. 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటగా MP, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు చేపడతారు. నియోజకవర్గాలుగా వీటిని పరిశీలిస్తే వై.పాలెం (1,549), దర్శి(1,837), S.N.పాడు (1905), ఒంగోలు (4,577), కొండపి (1,794), మార్కాపురం (2,764), గిద్దలూరు (3,550), కనిగిరి (2,480) ఓట్లు పోలైనాయి. ఫలితాల్లో ఇవి కీలకం కానున్నాయి.
జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఫేక్ వార్తలపై పార్టీలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫేక్ వార్తలను సృష్టించి ప్రజలను, రాజకీయ పార్టీల కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలను ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు తెలియజేస్తుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన మార్టూరులో చోటుచేసుకుంది. వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో మస్తాన్ అనే యువకుడు కళ్యాణ్ అనే వ్యక్తిపై బీరు సీసాతో తలపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ కళ్యాణిని 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అర్బన్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి RTV ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేసింది. వీరి ప్రకారం TDP-9, YCP-2, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుస్తుందని తెలిపారు. దర్శి, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి స్థానాల్లో TDP పాగా వేస్తుందని, కందుకూరు, వై.పాలెంలో YCP గెలిచే అవకాశం ఉందన్నారు. కాగా చీరాలలో ఆమంచి గెలుస్తారన్నారు. దీంతో TDP శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
కురిచేడు మండలం పడమరకాశీపురంలో చెరువులో పడి ఓ బాలుడు మృతి చెందాడు. సోమవారం గ్రామానికి చెందిన సాధం బంగారు(13) తమ గేదెలను తోలుకొని మేతకు వెళ్ళాడు. గేదెలకు నీళ్లు తాగించడానికి చెరువులోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో చెరువులోకి దిగిన గేదెలను తోలేందుకు వెళ్ళగా.. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు బాలుడి మృతదేహాన్ని చెరువులో నుంచి బయటికి తీశారు.
ఒంగోలు YCP MP అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుస్తారని ఓ ఇంటర్వ్యూలో ఆరా సర్వే సంస్థ ప్రతినిధి మస్తాన్ చెప్పుకొచ్చారు. దీనికి కారణం.. మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి YCPకి బలమైన నియోజకవర్గాలు కాబట్టి ఒంగోలు ఎంపీగా గెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాగే చీరాల, ఒంగోలులో వైసీపీ విజయం సాధిస్తుందని, కొండపిలో ఓడిపోతుందని, కందుకూరు, అద్దంకిలో టైట్ ఫైట్ ఉండబోతోందని తెలిపారు.
కుమారుడిని తుపాకీతో కాల్చిచంపిన కానిస్టేబుల్ను 302 సెక్షన్ కింద ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏఆర్ కానిస్టేబుల్ కొదమల ప్రసాద్ బాబు గార్డ్గా పనిచేస్తున్నాడు. శనివారం ప్రసాద్ కుమారుడు శేషుకమల్ జీతం డబ్బులు డ్రా చేసుకొని ఇంట్లో ఇవ్వమని తండ్రిని అడగ్గా.. ప్రసాద్ నిరాకరించాడు. దీంతో మాటామాటా పెరిగి.. కోపంతో తన సర్వీస్ రివాల్వర్తో శేషును కాల్చడంతో శేషుకుమార్ చనిపోయాడు.
జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు కేంద్రంలోని కలెక్టరేట్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఈనెల 1 నుంచి 30 వరకు జరిగే ప్రత్యేక తనిఖీల కార్యక్రమాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. బాల కార్మికులు ఎక్కడైనా పనిచేసినట్లయితే పోలీసు నంబరు 100 లేదా చైల్డ్ లైన్కు సమాచారం అందించాలని సూచించారు.
కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా జరిగేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్, రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్లోని స్పందన హాలులో రిటర్నింగ్ అధికారులతో సమావేశమై కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఉదయం 5 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని, కౌంటింగ్ హాలులోకి సెల్ఫోన్లు అనుమతించవద్దన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా కూటమి అభ్యర్థులు ఆదివారం మార్కాపురంలోని కందుల నారాయణరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. తాజా ఎన్నికల అంశాలు, భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతుందని, చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నారని వారు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.