Prakasam

News May 2, 2024

ప్రకాశం: ఎన్నికల విధులపై ఎస్పీ దిశానిర్దేశం

image

జిల్లా పోలీస్ సిబ్బంది సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని ఎస్పీ గరుడ్ సుమిత్ సూచించారు. జిల్లాకు కేటాయించిన CAPF అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో నిర్వహించాల్సిన విధుల గురించి దిశానిర్దేశం చేశారు. అలాగే అక్రమ నగదు, మద్యం, ప్రలోభ వస్తువులకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News May 1, 2024

సీఎం పర్యటనను విజయవంతం చేయండి: చెవిరెడ్డి

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 3వ తేదీన కనిగిరికి రానున్నట్లు ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

News May 1, 2024

మార్కాపురం: రథోత్సవంలో అపశ్రుతి

image

మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవంలో బుధవారం అపశ్రుతి చోటు చేసుకుంది. రథోత్సవాన్ని తిలకించేందుకు పాడుబడిన భవనంపై భక్తులు నిలబడి ఉండడంతో భవనం ముందు భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలకు గాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 1, 2024

గిద్దలూరుకు రానున్న పవన్ కళ్యాణ్ 

image

ఈ నెల 3వ తేదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గిద్దలూరులో పర్యటిస్తారు. పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని గిద్దలూరు నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

News May 1, 2024

చీరాలలో చంద్రబాబు ప్రసంగంపై ఉత్కంఠ

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చీరాలకు వస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆ బహిరంగ సభలో ఏం మాట్లాడతారన్న విషయమై ఉత్కంఠ నెలకొంది.  చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్లారు. తాజాగా బలరాం కుమారుడు వెంకటేశ్ చీరాల నుంచే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో  బలరాం, వెంకటేశ్‌పై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. 

News May 1, 2024

ప్రైవేట్ పాఠశాలల్లో 696 మందికి ఉచిత ప్రవేశాలు: DEO సుభద్ర

image

జిల్లాలో తొలి దశలో 696 మంది విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు డీఈవో డి.సుభద్ర తెలిపారు. కమిషనర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన లాటరీలో జిల్లాలో ఒకటో తరగతిలో ప్రవేశాలకు పలువురు విద్యార్థులు అర్హత సాధించారన్నారు. వీరిలో బీసీలు 234, మైనార్టీలు 53, ఓసీలు 147, ఎస్సీ 244, ఎస్టీ విద్యార్థులు 18 మంది ఉన్నారన్నారు. 

News May 1, 2024

చీరాల: రైలు ఢీకొని మహిళ మృతి

image

చీరాలలో మంగళవారం దారుణం జరిగింది. రైల్వేస్టేషన్లోని మూడో నంబరు ఫ్లాట్‌ఫారంను దాటుతున్న ఓ గుర్తు తెలియని మహిళను తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ప్రమాదవశాత్తు ఢీకొంది. ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉండొచ్చని రైల్వే ఎస్సై కొండయ్య తెలిపారు. ఆమె వద్ద ఎటువంటి ఆధారాలు లభ్యంకాలేదు. వివరాలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు. 

News May 1, 2024

ప్రకాశం జిల్లాలో డీసెట్ నోటిఫికేషన్ విడుదల

image

ప్రభుత్వ డైట్లు, ప్రైవేటు డీఈడీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఏఈడీ)లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు డీసెట్-24 నోటిఫికేషన్ విడుదలైనట్లు DEO సుభద్ర తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు ఆన్‌లైన్లో మే 8 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను మే9 వరకు ఆన్‌లైన్లో సమర్పించవచ్చు. మే 24న పరీక్ష ఉండగా, మే 30న ఫలితాలు ప్రకటిస్తారు.

News May 1, 2024

వెలిగండ్ల: బిల్డింగ్ పైనుంచి పడి వ్యక్తి మృతి

image

వెలిగండ్ల మండలం తమ్మినేనిపల్లికి చెందిన రామిరెడ్డి అనే వ్యక్తి గుంటూరులో మంగళవారం అనుమానాస్పద స్థితిలో బిల్డింగ్ పైనుంచి జారిపడి మృతి చెందారు. ఈ ప్రమాదంపై మృతుని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేక ఏదైనా కుట్రకోణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సివుంది.

News May 1, 2024

ప్రకాశం జిల్లా రాజకీయాలపై నందమూరి బాలకృష్ణ ఆరా

image

ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఒంగోలు వచ్చిన సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను దామచర్ల జనార్దన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు బొకేను అందజేసి శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై బాలకృష్ణ ఆరా తీసినట్లు తెలిసింది. కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.