India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కందుకూరు 8 వార్డు సచివాలయంలో పనిచేస్తున్న తనను అదే సచివాలయంలో విధులు నిర్వహించే అడ్మిన్ నమ్మించి మోసం చేశాడని మహిళా ఉద్యోగి పోలీసులను ఆశ్రయించింది. ఆ వ్యక్తి ఆమెతో రెండు ఏళ్ళ పాటు ప్రేమ వ్యవహారం నడిపి పెళ్లి చేసుకోమని అడిగితే మాట దాటేస్తూ.. పెళ్లి చేసుకునేది లేదంటూ చెప్పడంతో చేసేది లేక పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టారు.
మంగళగిరిలో ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు 11వ ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ & బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ నిర్వహించారు. ఈ పోటీలలో సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన పరుచూరి కుమారి నంద పాల్గొని సత్తా చాటింది. సీనియర్ మహిళల 76 కేజీల పవర్ లిప్టింగ్ విభాగంలో, అలాగే బెంచ్ ప్రైస్ ఛాంపియన్ షిప్ పోటీలో పాల్గొని రెండు సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో ఆమెను గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.
కురిచేడు మండలంలోని బోధనంపాడులో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 108 అంబులెన్స్ డ్రైవర్ అబుదావలిపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బీరు సీసాతో దాడి చేశాడు. మద్యం మత్తులో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణ వల్లే ఈ దాడి జరిగినట్లుగా స్థానిక ప్రజలు తెలిపారు. అబుదావలి పరిస్థితి విషమంగా ఉండటంతో దర్శి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
వర్షం కోసం రైతు ఎదురు చూస్తుంటాడు. పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తుంటారు. అయితే ఏ రంగానికి సంబంధం లేకుండా అందరూ ఎదురు చూసేవి ఎన్నికల ఫలితాలు. దీంతో జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 స్థానాల్లో తమ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని పలువురు బెట్టింగ్లు కాస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెరలేవాలంటే 4వ తేదీ వరకు ఆగాల్సిందే.
యర్రగొండపాలెంలో సీనియర్ జర్నలిస్టు షేక్ కలీం శుక్రవారం ఉదయం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయన స్వగృహానికి వెళ్లి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రెస్ క్లబ్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో పాత్రికేయులు వలి సాహెబ్, బాజీ, రసూల్ ఖాన్, నాగేష్, గణేశ్, కొండయ్య, అజహర్, తదితరులు పాల్గొన్నారు.
చీమకుర్తిలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ఇసుక వాగుకు చెందిన గుంటూరు రమేశ్ (43) పొదిలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తూర్పు బైపాస్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో సీఐ దుర్గాప్రసాద్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరుకు చెందిన ఇంపాన(23), చేతన్ ల మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. వీరికి పెద్దలు పంచాయతీ చేసి నగదు ఇచ్చేలా ఒప్పందం రాయించారు. తరువాత చేతన్ మరొకరిని వివాహం చేసుకుని చీమకుర్తిలో బేకరీ నిర్వహిస్తున్నాడు. బుధవారం చీమకుర్తికి వచ్చిన ఇంపాన పెళ్లి చేసుకోవాలని చేతన్ను అడగ్గా, ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
దోర్నాల మండలం యడవల్లి గ్రామ సమీపంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. వెంకటేశ్వర నాయుడు బైకుపై వెళ్తున్న నేపథ్యంలో వాహనం అదుపుతప్పి టిప్పర్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణాలు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఒంగోలు నుంచి కనిగిరికి వస్తున్న ఆర్టీసీ బస్సులో వెలిగండ్ల మండలం అగ్రహారానికి చెందిన ఫొటోగ్రాఫర్ రామకృష్ణ గుండెపోటుతో మృతి చెందారు. ఒంగోలులో చదువుతున్న తన కుమార్తెను చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కనిగిరి డిపోలో ఆర్టీసీ డ్రైవర్ వెళ్లి చూడగా.. సీటులో పడిపోయి ఉన్నాడు. రామకృష్ణను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అద్దంకికి చెందిన మహిళ బుధవారం సాయంత్రం స్నానం చేస్తోంది. ఇదే సమయంలో పక్కింటి బాలుడు ఆమెను వీడియో తీశాడు. దీన్ని గుర్తించిన మహిళ కుటుంబ సభ్యులు అతడ్ని నిలదీశారు. తొలుత తాను అలాంటి చర్యలకు పాల్పడలేదని బుకాయించినప్పటికీ అనంతరం మొబైల్ పరిశీలించగా దృశ్యాలు కనిపించడంతో చేసిన తప్పును అంగీకరించాడు. ఆమేరకు మహిళ బంధువులు పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Sorry, no posts matched your criteria.