Prakasam

News May 30, 2024

అలా స్టిక్కర్లు వేయించుకుంటే బైక్ సీజ్: అద్దంకి సీఐ

image

బైక్ వెనకాల నంబర్ లేకుండా మంత్రి తాలుకా అంటూ స్టిక్కర్లు వేయించుకుంటే వాటిని సీజ్ చేస్తామని అద్దంకి పట్టణ సీఐ కృష్ణయ్య తెలిపారు. పట్టణంలో గొట్టిపాటి రవి మంత్రి తాలూకా అని, మరొకరు అద్దంకి ఎమ్మెల్యే హనిమిరెడ్డి తాలూకా అని బైక్ నంబర్ ప్లేట్లపై పేర్లు రాయించుకుని తిరగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో సీఐ వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

News May 30, 2024

ప్రకాశం: అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. తమ్ముడు మృతి

image

జిల్లాలోని ముండ్లమూరు మండలం సుంకరవారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో అన్నదమ్ముల మధ్య గురువారం రాత్రి ఘర్షణ చోటు చేసుకోవడంతో తమ్ముడు మృతి చెందాడు. రాయితో అన్న దాడి చేయడంతో తమ్ముడు బ్రహ్మయ్య(29) ఘటనా స్థలంలోని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

ప్రకాశం: సైకిల్ కొనివ్వలేదని ఆత్మహత్య

image

జిల్లాలోని రాచర్ల మండలం చోళవీడులో ఉరివేసుకొని మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. చోళవీడుకు చెందిన ఓ మైనర్ బాలుడు తన తల్లిదండ్రులు తను కోరిన సైకిల్ ఇప్పించలేదని ఇంటిలోకి వెళ్లి తలుపులు బిగించి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

ప్రకాశం: 4 రోజుల్లో మన MLA ఎవరో తెలుస్తుంది

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలింగ్‌ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఫలితాల కోసం అటు అభ్యర్థులు, ఇటు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ ఉంది. 2019లోని 12 స్థానాల్లో YCP-8, TDP-4 గెలిచాయి. YCP మరోసారి ఎక్కువ స్థానాలపై కన్నేయగా, TDPకి మెజార్టీ సీట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్ పట్టు సాధించాలని చూస్తుండగా, దీంతో ఎవరు గెలుస్తారనే చర్చ నడుస్తోంది. మరి మీ MLAగా ఎవరు గెలవబోతున్నారు.

News May 30, 2024

టంగుటూరు టోల్ ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టివేత

image

చెన్నై నుంచి మిర్యాలగూడకు వెళుతున్న కారులో భారీగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టంగుటూరు హైవే మీద ఉన్న టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా మద్దిశెట్టి మల్లేష్ వద్ద బిల్లులు లేకుండా 112 గ్రాముల బంగారం తీసుకెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. ఇందులో రూ.58 వేలు నగదు, రూ.89,98,220 విలువచేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశామని ఎస్సై పున్నారావు తెలిపారు.

News May 30, 2024

సాయంత్రం 5 గంటలలోగా ఎన్నికల ఫలితాలు: కలెక్టర్

image

జిల్లాలో జూన్ 4వ తేదీన సాయంత్రం ఐదు గంటలలోగా ఎన్నికల ఫలితాలు విడుదలయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఆయన మాట్లాడుతూ.. ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గం వేస్తున్నట్లు, నియోజకవర్గానికి ఐదు చొప్పున టేబుల్ వేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

News May 30, 2024

చీమకుర్తి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

చీమకుర్తి ఈస్ట్ బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న సీఐ దుర్గా ప్రసాద్ మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ హాస్పటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 30, 2024

వై.పాలెం: విధులు మరిచి తన్నుకున్న పోలీసులు

image

పోస్టల్ బ్యాలెట్ బాక్సుల వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు తమ విధులను మరిచారు. మంగళవారం రాత్రి పూటుగా మద్యం సేవించి ఆ మత్తులో మాట మాట పెరిగి వాగ్వాదానికి దిగి కొట్టుకున్న సంఘటన వై.పాలెంలోని అర్వో కార్యాలయం వద్ద జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారి అక్కడికి చేరుకుని పరిశీలించి మద్యం పరీక్ష నిర్వహించి తాగినట్లు గుర్తించి విధుల నుంచి తొలగించారు.

News May 30, 2024

10th మార్కుల జాబితాలో తప్పులుంటే ఇలా చేయండి: డీఈవో

image

ప్రకాశం: పదవ తరగతి మార్కుల జాబితా (2023-24 సంవత్సరం) లో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు తక్షణమే స్పందించాలని డీఈవో సుభద్ర తెలిపారు. తప్పులను సరిచేసుకోవాలంటే డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, విజయవాడ కార్యాలయంలోని మాణిక్యమాంబను సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.

News May 30, 2024

యర్రగొండపాలెం ఆర్ఓ సస్పెండ్

image

యర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీలేఖను తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి మీనా కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 13న జరిగిన పోలింగ్‌లో యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఘర్షణలు జరిగిన సమయంలో, సకాలంలో స్పందించకపోవడంతో ఎన్నికల కమిషన్ వేటు వేసినట్లు తెలిపారు. గురువారం నియోజకవర్గంకు కొత్త ఆర్ఓ ను కలెక్టర్ నియమించనున్నట్లు చెప్పారు.