Prakasam

News May 29, 2024

కందుకూరు: పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

గుర్తు తెలియని వ్యక్తి పురుగు ముందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం కందుకూరు పట్టణ శివారు ధూబగుంట ప్రాంతంలోని వైఎస్సార్ కాలనీలో వెలుగు చూసింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని కేసు నమో చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 29, 2024

ఒంగోలు: ఉద్యోగం ఇప్పిస్తానని రూ.10 లక్షల మోసం

image

తన భర్తకు ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ప్రధానోపాధ్యాయుడికి రూ.10లక్షలు ఇచ్చి మోసపోయినట్టు సంధ్యలత అనే మహిళ మీడియా ముందు వాపోయారు. కనిగిరికి చెందిన విజయభాస్కర్‌ రెడ్డి అనే వ్యక్తి కుంచనపల్లి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారని, ఒంగోలులో తన ఇంటి పక్కన వారి ద్వారా పరిచయమయ్యారని చెప్పారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.

News May 29, 2024

గొడవలు జరగకుండా ప్రత్యేక చర్యలు: ఎస్పీ

image

ఓట్ల లెక్కింపు రోజున జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునిల్ తెలిపారు. బుధవారం కనిగిరిలో రాజకీయ నాయకులు, ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో కౌంటింగ్ తర్వాత ఎటువంటి గొడవలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాలలో బాణసంచా కాల్చడం, డ్రోన్ ఎగురవేయడం చేయరాదని స్పష్టం చేశారు.

News May 29, 2024

కౌంటింగ్ రోజు ప్రకాశం జిల్లాలో ఆంక్షలు

image

జూన్ 4న జిల్లాలో పలు ఆంక్షలు విధించనున్నట్లు SP గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజున ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించి, జాతీయ రహదారిపై ఒకే మార్గంలో రాకపోకలు వచ్చేలా చేస్తామన్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో బాణసంచా కాల్చడం, డ్రోన్ ఎగరవేడయం చేయరాదన్నారు. మద్యం విక్రయించకుండా చేయడంతో పాటు, కేంద్రంలోకి వచ్చే వారికి బ్రీత్ అనలైజ్ పరీక్షీంచనున్నట్లు తెలిపారు.

News May 29, 2024

ప్రకాశం జిల్లాలో వేడిగాలులు

image

ప్రకాశం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలతో జనం విలవిల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. రాత్రి ఆరు గంటలు దాటినా వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. పెరుగుతున్న వడగాడ్పుల తీవ్రత కారణంగా జనం బయటకు అడుగు పెట్టేందుకు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. జిల్లాలోని 21 గ్రామాల్లో మంగళవారం 40 డిగ్రీలకు పైగా నమోదవ్వగా, మాలెపాడులో అత్యధికంగా 42.09 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News May 29, 2024

దర్శి: స్నేహితులతో సరదా ఈత.. ప్రాణం తీసింది

image

తాళ్లూరు మండలంలోని రామభద్రపురానికి చెందిన మణికంఠరెడ్డి ఆదివారం రామతీర్థం రిజర్వాయర్లో గల్లంతైన విషయం తెలిసిందే. మణికంఠరెడ్డి తన మిత్రులతో కలిసి ఆదివారం రామతీర్థం రిజర్వాయర్లో సరదాగా ఈతకెళ్లి అక్కడ ఈతకొడుతూ లోపలికి వెళ్లి కనిపించకుండా పోయాడు. ఆరోజు నుంచి గాలింపు చర్యలు చేపట్టగా, మంగళవారం మృతదేహం ఒకపక్కకు కొట్టుకొని వచ్చింది. మణికంఠ మృతితో రామభద్రపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 28, 2024

ఉలవపాడు: బొలెరో వాహనాన్ని ఢీ కొట్టిన కారు

image

ఉలవపాడులోని ఉత్తర బైపాస్‌లో బైక్‌ను తప్పించబోయి బొలెరో వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైపాస్ రోడ్డులో వెళ్తున్న కారుకు సడన్‌గా వచ్చిన బైక్‌ను తప్పించబోయి ముందున్న బొలోరో వాహనాన్ని ఢీకొట్టగా ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. దానితో స్థానికులు పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.

News May 28, 2024

మార్కాపురం: లాయర్‌పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

image

న్యాయవాదిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు మార్కాపురం పట్టణ రెహమాన్ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. మార్కాపురం పట్టణంలోని కోర్టు సెంటర్లో ఈనెల 25న రాత్రి రసూల్ అనే న్యాయవాదిపై నిసార్ మొహమ్మద్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఆస్తుల వివాదానికి సంబంధించిన ఓ కేసులో న్యాయవాది రసూల్‌పై కక్ష పెంచుకొని దాడికి పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుడని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు.

News May 28, 2024

మరో 7 రోజులే.. ప్రకాశంలో పట్టాభిషేకం ఎవరిది.?

image

ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4 వచ్చేస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 MLA, 2 MP స్థానాలు ఉండగా.. ఫలితాలకు మరో 7 రోజుల సమయమే ఉంది. ఓ వైపు ఉత్కంఠ నెలకొనగా, బెట్టింగులు జోరందుకున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో YCP 8 MLA, 2 MP, టీడీపీ 4 MLA స్థానాలను గెలుచుకుంది. తాజా ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇరుపార్టీల నేతలు గెలుపుపై ధీమాగా ఉండగా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కామెంట్ చేయండి.

News May 28, 2024

టంగుటూరు: వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

టంగుటూరు మండలం తేటుపురంలోని పాలేరు వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. పోలీసుల వివరాల మేరకు.. 35 సంవత్సరాలు కలిగిన వ్యక్తి బ్లూ రంగు డ్రాయర్ ధరించి ఉన్నాడు. ఒడ్డుకు మృతదేహం కొట్టుకు రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.