Prakasam

News October 22, 2024

పోలీసు అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం: ప్రకాశం ఎస్పీ

image

విధినిర్వహణలో, అసాంఘిక శక్తుల చేతిలో అసువులు బాసిన పోలీసు సిబ్బంది సంక్షేమ కోసం జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడు కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విధినిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబ సభ్యులతో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమావేశమయ్యారు. విధినిర్వహణలో మరణించిన సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎస్పీ తెలిపారు.

News October 21, 2024

ప్రకాశం జిల్లాలో నేటి నుంచి అమరవీరుల వారోత్సవాలు

image

నేటి నుంచి 31వ తేదీ వరకు ప్రకాశం జిల్లాలో పోలీసు అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని ప్రకాశం జిల్లా SP దామోదర్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఏటా అమరులైన పోలీసులను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడుతూ.. ఈ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.

News October 21, 2024

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

image

చంద్రశేఖరపురం మండలం డీజీపేటకు చెందిన వృద్ధురాలు డేగ రత్తమ్మ (58) హత్యకు గురైంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం గడ్డికోసం రత్తమ్మ పొలం వెళ్లారు. పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు అమెను హత్యచేసి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, కమ్మలు దొంగిలించారు. సాయంత్రమైనా రత్తమ్మ ఇంటికి రాలేదని స్థానికులు పొలానికి వెళ్లి చూడగా హత్యకు గురైంది. పామూరు CI, చంద్రశేఖరపురం SI ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

News October 21, 2024

ప్రకాశం జిల్లాలో నేటి నుంచి అమరవీరుల వారోత్సవాలు

image

నేటి నుంచి 31వ తేదీ వరకు ప్రకాశం జిల్లాలో పోలీసు అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని ప్రకాశం జిల్లా SP దామోదర్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఏటా అమరులైన పోలీసులను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడుతూ.. ఈ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.

News October 21, 2024

ప్రకాశం: ‘ప్రైవేట్ విద్యా సంస్థల్లో జర్నలిస్ట్ పిల్లలకు 50% రాయితీ’

image

ప్రకాశం జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న జర్నలిస్ట్ పిల్లలకు 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 50శాతం రాయితీ ఇవ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా విద్యా సంస్థలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు విధిగా ఉత్తర్వులు పాటించాలన్నారు. రాయితీ పట్ల జిల్లాలోని జర్నలిస్ట్ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

News October 20, 2024

ప్రకాశం: దీపావళి బాణసంచా అనుమతులు పొడిగింపు

image

దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయించే వ్యాపార అనుమతులకు దరఖాస్తుల గడువును పొడిగించినట్లు DRO శ్రీలత శనివారం తెలిపారు. ఈనెల 22 వరకు గడువు పొడిగించినట్లు డీఆర్వో శ్రీలత తెలిపారు. ఈనెల 29 నుంచి 31 వరకు అమ్మకాలకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగలవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎవరు కూడా అనుమతులు లేకుండా మందులు విక్రయించరాదని అన్నారు.

News October 19, 2024

ఉమ్మడి ప్రకాశం రీజినల్ కోఆర్డినేటర్‌ ఇతనే.!

image

వైసీపీ అధ్యక్షుడు YS జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఏపీలోని పలు జిల్లాలకు ఏడుగురు నాయకులను రీజనల్ కో- ఆర్డినేటర్లుగా నియమించారు. దీనిలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును నియమిస్తూ పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆయన పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

News October 19, 2024

ఆ గ్రామాలపై ప్రత్యేక దృష్టి: ప్రకాశం కలెక్టర్

image

భూగర్భజలాలను అధికంగా వినియోగించిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి తిరిగి నీటిమట్టం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. మార్కాపురం మండలంలోని నికరంపల్లిని మోడల్ గ్రామంగా ఎంపిక చేశామన్నారు. ఈ గ్రామంలో భూగర్భ నీటిమట్టం పెంచడానికి తీసుకోవలసిన చర్యలపై శుక్రవారం సాయంత్రం ప్రకాశం భవనంలోని తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో ఆమె ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

News October 18, 2024

ప్రకాశం జిల్లాలో TDP బలోపేతానికి కృషి చేయాలి: CM

image

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నేడు ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని MLA,MPలు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు ఎటువంటి తప్పులు చేసినా సహించేది లేదన్నారు. ప్రజలకు అందుబాటలో ఉండాలన్నారు. 

News October 18, 2024

అద్దంకి వద్ద రోడ్డు ప్రమాదం.. టీచర్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన వినుకొండలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అద్దంకికి చెందిన ఉపాధ్యాయురాలు వినుకొండ మండలం గోకనకొండలో విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా బైక్‌పై స్కూల్‌కు వెళ్తుండగా.. నాగులవరం వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడ్డారు. తలకు బలంగా గాయమై తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.