India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దేశంలో, రాష్ట్రంలో విద్యుత్ వాహనాల ఉత్పత్తి, ఏర్పాటుచేసిన ఫ్యాక్టరీలు, కేటాయించిన నిధులపై ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మంగళవారం పార్లమెంట్లో ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి కుమారస్వామి సమాధానమిస్తూ గత ఐదేళ్లలో 1,68,263 వాణిజ్య, మూడు చక్రాల, రెండు చక్రాల విద్యుత్ వాహనాలు ఉత్పత్తి అయ్యాయన్నారు. దేశంలో 257 తయారీ యూనిట్లు ఉండగా రాష్ట్రంలో నాలుగు ఉన్నాయని వివరణ ఇచ్చారు.

పొదిలి అడ్డరోడ్డు సమీపంలోఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 300 బస్తాల రేషన్ బియ్యాన్ని మంగళ వారం ఎన్ఫోర్స్మెంట్ ఆర్డీవో, ఆర్ఐ, వీఆర్వో కలిసి అక్రమంగా దాచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం ఎక్కడ నుంచి తెచ్చారు, ఎన్నిరోజుల నుంచి ఈ దందా జరుగుతుందనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సోమవారం జమ్మూ కశ్మీర్లో మృతి చెందాడు. 25వ రాష్ట్రీయ రైఫిల్స్ హవల్దార్గా పని చేస్తున్న వరికుంట్ల వెంకట సుబ్బయ్య అనే జవాన్ జమ్మూ కశ్మీర్లో వీధులు నిర్వహిస్తుండగా మందు పాతర పేలి వీర మరణం పొందాడు. కాగా ప్రస్తుతం అతని మృతదేహాన్ని రాజా సుఖదేవ్ సింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు తరలించినట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సిఉంది.

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న నకిలీ పెన్షన్లపై అధికారులు దృష్టి పెట్టారు. వికలాంగులు, వృద్ధాప్య తదితర పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ నిర్వహించే ఉత్తర్వులలో భాగంగా.. ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు మండలం చిలకపాడు గ్రామాన్ని ఫైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి మొదటిరోజు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలపై మీరేమంటారో కామెంట్ చేయండి.

పర్చూరు మండలం అన్నంబట్లవారిపాలెం సమీపంలో బైక్పై బీచ్కు వెళ్లి వస్తున్న <<14826140>>ముగ్గురిని ఆదివారం ఓ లారీ ఢీకొంది.<<>> ఈ ప్రమాదంలో అత్తా, అల్లుడు అక్కడికక్కడే మృతి చెందగా.. కుమార్తె చికిత్స పొందుతూ చనిపోయింది. అదే ప్రాంతంలో తూమాటి సుబ్బయ్య(74) అనే వ్యక్తి <<14827146>>సైకిల్పై వెళ్తుండగా లారీ ఢీకొని మృతి<<>> చెందాడు. ఇలా ఒకే రోజు మండలంలో నలుగురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. నేడు ఆయన వర్ధంతి. బల్లికురవ మండలం, కొమ్మినేనివారిపాలెంలో 1954లో జన్మించిన ఆయన అనారోగ్య కారణంగా 2013, డిసెంబర్ 7న మరణించారు. ఆయన ప్రాథమిక విద్యను తన స్వగ్రామంలో, 6 నుంచి 10వ తరగతి వరకు అద్దంకిలో చదివారు. ఒంగోలు CSR శర్మ కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసించారు.

జిల్లా వ్యాప్తంగా తొలిరోజు శుక్రవారం నిర్వహించిన “రెవెన్యూ సదస్సు”లలో 640 అర్జీలు వచ్చాయని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. వీటిలో ఒంగోలు డివిజన్లో 273, కనిగిరిలో 230, మార్కాపురంలో 137 వచ్చాయన్నారు. ఈ మొత్తం అర్జీలు 35 రకాల సమస్యలకు సంబంధించినవని ఆమె శుక్రవారం తెలిపారు. మొత్తం అర్జీలలో నాలుగింటిని అప్పటికప్పుడే పరిష్కరించామన్నారు. ప్రజలు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత అంబేద్కర్ కే దక్కుతుందని ఎస్పీ దామోదర్ చెప్పారు.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అణగారిన బలహీన వర్గాల అభ్యుదయం కోసం, కుల నిర్మూలన కోసం అంబేద్కర్ ఎంతగానో పాటుపడ్డారన్నారు

కొత్తపట్నం తీరప్రాంతంలో చిన్న సైజులో ఉన్న గల ఓ విమానాన్ని మెరైన్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో ఈ పరికరం పడింది. విషయం తెలుసుకున్న మెరైన్ సీఐ, ఎస్సైలు గస్తీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ రాజు, రామిరెడ్డి, హోంగార్డు లక్ష్మణ్లు తీరానికి వెళ్లి మత్స్యకారుల నుంచి ఆ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గురువారం తీవ్ర విషాద ఘటన జరిగింది. కొనకనమిట్ల మండలం సిద్దవరం శివారులోని నిమ్మతోటలో విద్యుత్ లైన్లు లాగుతుండగా కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు చనిపోయారు. మృతులు పెద్దారవీడుకు చెందిన నాగరాజు (28), రంగారావు(30)గా గుర్తించారు. విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండా పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.