India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చీరాల కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ MLA ఆమంచి కృష్ణమోహన్ దాఖలు చేసిన నామినేషన్ చెల్లుబాటు విషయం సందిగ్ధంగా మారింది. ఆమంచికి చెందిన ముఖ్యమైన డాక్యుమెంట్లతో పాటు, క్రిస్టల్ సీఫుడ్స్ ఫ్యాక్టరీకి విద్యుత్ బకాయిలు ఉన్నాయని అభ్యంతరాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆర్వో సూర్యనారాయణరెడ్డి ఆమంచి నామినేషన్ పెండింగ్లో ఉంచారు. శనివారం ఉదయం 10లోపు వాటిని సబ్మిట్ చేయాలని సూచించారు. దీంతో ఆమంచి నామినేషన్పై ఉత్కంఠ నెలకొంది.
జిల్లాలోని పుల్లలచెరువు మండలం మల్లపాలెం చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం సాయంత్రం రూ.20 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల నుంచి ఒంగోలుకు కారులో తీసుకెళ్తున్న అజీజ్ అనే వ్యక్తి నుంచి ఆ డబ్బును గుర్తించి, సరైన పత్రాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ రూ.50 వేలకు మించి డబ్బులు ఉంటే సరైన పత్రాలు చూపించాలన్నారు.
కొండపి నియోజకవర్గంలో ఒకే రోజు సీఎం జగన్, నందమూరి బాలకృష్ణ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న మర్రిపూడిలోని బస్టాండ్ సెంటర్లో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అదేరోజు కొండపిలో సీఎం జగన్ పర్యటిస్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇద్దరి పర్యటనలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జ్ డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో దాతల సహకారంతో గతంలో ఆర్వో ప్లాంట్ నిర్మించి పంచాయతీకి అప్పగించినా ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో మీటర్ కాలిపోయింది. దాని మరమ్మతుల కోసం ఓ మంత్రి జోక్యం చేసుకోవడం, అధికారుల మధ్య కోల్డ్ వార్ నేపథ్యంలో ప్లాంట్ వివాదం ముదిరింది.
యర్రగొండపాలెంలో టీ కొట్టు యజమాని శ్రీను త్రిపురాంతకం రోడ్ సెంటర్లో హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గురువారం రాత్రి జరగ్గా శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలను పరిశీస్తున్నారు. ఆ ప్రదేశంలో అచ్చు బొమ్మ ఆడుతున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలోనే పొగాకు వ్యాపారానికి టంగుటూరు మండలం ప్రసిద్ధి. ఇక్కడి నుంచి వివిధ పార్టీలకు చెందిన ఆరుగురు MLA అభ్యర్థులు ఉన్నారు. బాలినేని, దామచర్ల జనార్దన్ ఇద్దరిది ఈ మండలమే. వీరిద్దరూ ఒంగోలు నుంచి తలపడుతున్నారు. బుర్రా మధుది టంగుటూరులోని శివపురం. MLA డోలా వీరాంజనేయ స్వామిది తూర్పు నాయుడుపాలెం. తాటిపర్తి ఇక్కడివారే. వరికూటి అశోక్ బాబు కారుమంచిలో పుట్టి పెరిగారు. అటు గంటా శ్రీనివాసరావుది జరుగుమల్లి మం.
సీఎం జగన్ ఈనెల 28 నుంచి రోజూ 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈక్రమంలో ఆయన ఈ నెల 28న కందుకూరులో. 30న కొండపిలో పర్యటించనున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటలకు వెంకటగిరిలో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. 30వ తేదీ ఉదయం 10:00 గంటలకు కొండపిలో పర్యటించనున్నారు. సభా ప్రాంగణాల వివరాలు తెలియాల్సి ఉంది.
కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ ముస్లిం మైనార్టీస్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ రఫీ గురువారం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కందుకూరు టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహార శైలితో మానసిక వేదనకు గురైన తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమైనట్లు తెలిపారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ విద్యామండలి శాఖ ఈనెల 30 వరకు పొడిగించినట్లు ఆర్ఐఓ సైమన్ విక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు కూడా ఈ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇప్పటివరకు ఫీజు చెల్లించని వారు ఈఅవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాళ్లు చొరవ తీసుకొని విద్యార్థుల ఫీజులు చెల్లించి, పరీక్షలకు హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈనెల 26వ తేదీన గుడ్లూరులో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని గురువారం టీడీపీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సాయంత్రం కందుకూరు టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గుడ్లూరులో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొంటారని తెలిపారు. కావున మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.