India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తానని ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. మార్కాపురంలో ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. మార్కాపురానికి నీళ్లు, నియామకాలతో పాటు మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తానని చెప్పుకొచ్చారు. అలాగే సంపద సృష్టిస్తూ.. సంక్షేమాన్ని ఇస్తానని తెలిపారు. ‘సంపద సృష్టించే ముఖ్యమంత్రి కావాలా.. గంజాయి తెచ్చే ముఖ్యమంత్రి కావాలా’ అని ప్రజలను అడిగారు.
గిద్దలూరు ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక్కడ కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఉన్నారు. ఆయన 2014 ఎన్నికల్లో 12 వేలకు వైగా ఓట్లతో గెలిచారు. అటు వైసీపీ నుంచి మార్కాపురం MLA కుందూరు నాగార్జునరెడ్డి గిద్దలూరు బరిలో ఉన్నారు. స్థానికులకే పట్టం కట్టాలని టీడీపీ ప్రచారం చేస్తుంటే, ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తానని కేపీ అంటున్నారు. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలలో ఒకేఒక మహిళా అభ్యర్థి పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున దర్శి అసెంబ్లీ నియోజకవర్గానికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల బరిలో ఉన్నారు.వైసీపీ నుంచి ఎవరు పోటీలో లేరు. దీంతో జిల్లాలో మహిళా అభ్యర్థి గెలుపుపై పార్టీలు లెక్కలేసుకుంటున్నారు.
పామూరు పట్టణ రెండో ప్రాదేశిక ఎంపీటీసీ ఆకుపాటి వెంకటేశ్కు తమిళనాడుకు చెందిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. సామజిక సేవా విభాగంలో విశిష్ఠ సేవలు అందించి సందర్భంగా శనివారం యూనివర్సిటీ వారు ఆకుపాటి వెంకటేశ్ను సత్కరించి డాక్టరేట్కు సంభందించిన సర్టిఫికెట్ను, డాలర్ను అందజేశారు.
కారంచేడు మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన కట్ట సుబ్బారావు (24) తాను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రాష్ట్ర పోలీసు కంట్రోల్ రూమ్కి వీడియో పంపాడు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. ఇంకొల్లు సీఐ శ్రీనివాసరావు నేతృత్వంలో కారంచేడు పోలీస్ సిబ్బంది అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా బాధితుడిని గుర్తించి బంధువులకు అప్పగించారు.
ప్రజా గళంలో భాగంగా ఈనెల 31వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మార్కాపురం పట్టణానికి రానున్నట్లు మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగే సభలో పాల్గొని అక్కడినుంచి హెలికాప్టర్లో మార్కాపురం చేరుకుంటారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
మార్కాపురంలోని గాంధీ బజార్లో శనివారం భవనం పైనుంచి ప్రమాదవశాత్తు సచివాలయ ఉద్యోగి పడిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలైన వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లయ్య (32) ఉదయం ఆసుపత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పట్టణ ఎస్ఐ రెహమాన్ తెలిపిన వివరాలు ప్రకారం.. మిద్దెపై బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో తీవ్రగాయాలపాలై మల్లయ్య చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
దర్శి రాజకీయ చర్చకు ఎట్టకేలకు తెరలేసింది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పోటీగా గొట్టిపాటి లక్ష్మిని ప్రకటించగానే అభ్యర్థుల పోటీ ఖరారు అయింది. వీరిరువురి నేపథ్యం గమనిస్తే.. ఇరు కుటుంబాలు రాజకీయ వారసత్వం నుంచి వచ్చినవారే, ఇద్దరు డాక్టర్లే కావడం గమనార్హం. గొట్టిపాటి కుటుంబం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు కీలకపాత్ర పోషించారు. ఇటు తండ్రి సుబ్బారెడ్డి వారసుడిగా శివప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారు.
సింగరాయకొండ మండలం పెదనబోయినవారిపాలెంకు చెందిన కావలి పద్మ, రమాదేవి, ప్రహర్ష సింగరాయకొండ నుంచి ఆటోలో గ్రామానికి బయల్దేరారు. ఊళ్లపాలెం ప్రధాన రహదారి పక్కనే ఉన్న జగనన్న కాలనీ సమీపంలోకి వెళ్లేసరికి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఆటోని ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న పద్మ, మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో వారిని ఒంగోలు తరలిస్తుండగా పద్మ మధ్యలో మృతిచెందారు. ఎస్సై శ్రీరాం కేసు నమోదుచేశారు.
సింగరాయకొండ పట్టణంలోని రాయల్ హోటల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయసు 40సం.రాలు ఉంటుందని, మృతుడి చేతి మీద కేశవ పద్మావతి అనే పచ్చబొట్టు ఉందన్నారు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.