India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిన్నగంజాం మండల పరిషత్ అభివృద్ధి అధికారి యుబి. వరప్రసాద్ మృతి చెందారు. సాధారణ ఎన్నికల బదిలీల్లో భాగంగా పల్నాడు జిల్లా మాచవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తూ ఆయన చిన్నగంజాం మండలానికి వచ్చారు. బ్రెయిన్ స్ట్రోక్కు చికిత్స పొందుతూ ఎంపీడీవో మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఎంపీడీవో మృతి పట్ల పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ప్రకాశం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ సోమవారం సాయంత్రానికి 93.89 శాతం పూర్తి చేసినట్లు జిల్లా స్థాయి అధికారులు తెలిపారు. జిల్లాలో 2,91,524 మంది పింఛన్దారులు ఉండగా, 2,73,604 మంది లబ్ధిదారులకు సచివాలయ సిబ్బందితో కలిసి రాజకీయ నాయకులు అందజేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి రేపు పంపిణీ చేయనున్నారన్నారు.

జిల్లాలో జూలైకి సంబంధించిన సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంటకు 291524 మంది పెన్షన్ దారులకు గాను 142517 మందికి పంపిణీ పూర్తి చేసి 48.89 శాతంగా నమోదైంది. జిల్లాలోని అన్ని గ్రామ, వార్డ్ సచివాలయ పరిధిలో అధికారులు ఇంటి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా 18వ స్థానంలో కొనసాగుతోంది. ఇక బాపట్ల జిల్లా 20వ స్థానంలో ఉంది.

ప్రకాశం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 3.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని పలు మండలాలలో ఓ మోస్తరు జల్లులు పడ్డాయి. తాళ్లూరు మండలంలో 24.2 మి.మీ., జరుగుమల్లిలో 27.4 మి.మీ., నాగులుప్పలపాడులో 16.0మి.మీ., మద్దిపాడులో 12.4 మి.మీ., ఒంగోలులో 11.2 మి.మీ., తర్లుపాడులో 11.1మి.మీ వర్షం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరో ఎనిమిది మండలాలలో చిరుజల్లులు పడ్డాయి.

పదోతరగతి మార్కుల జాబితా www.bse.ap.gov.in వెబ్సైట్లో పొందుపరిచినట్లు డీఈవో సుభద్ర ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల లాగిన్ ద్వారా విద్యార్థుల హాల్ టికెట్ ఉపయోగించి మార్కుల జాబితాను పొందవచ్చని పేర్కొన్నారు. మార్కుల జాబితాలో ఏదైనా తప్పులు ఉంటే విద్యార్థులు సరైన రికార్డులతో నేరుగా ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులకు తెలియజేయాలన్నారు.

కురిచేడు మండలంలోని దేకనకొండ గ్రామ పొలాల్లో ఓ వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతుడు తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా గోపాలపేటకు చెందిన అయినవోని లక్ష్మయ్య (55)గా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దర్శికి బతుకుదెరువు కోసం అతను వచ్చినట్లు తెలిసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

బావిలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన ముండ్లమూరు మండలంలోని వేములలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వినుకొండ నాగరాజు (48) చెరువు వద్ద బావిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఆసమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి బావిలో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. నీరు పూర్తిగా బయటకు వెళ్తేనే మృతదేహం లభ్యమవుతుందని తెలిపారు.

గుంటూరు – సికింద్రాబాద్ ట్రైన్ నంబర్ 17253 రైలు జులై 1 నుంచి ఔరంగాబాద్ వరకు పొడిగించి ఔరంగాబాద్ ఎక్స్ ప్రెస్ రైలుగా నడుపుతున్నట్లు గిద్దలూరు కమర్షియల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరులో ఉదయం 7.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుందన్నారు. ఇదే రైలు ఔరంగాబాద్లో సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు గుంటూరు చేరుతుందన్నారు.

ప్రకాశం జిల్లాలో పింఛన్ల పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తారన్నారు. సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేని చోట ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. 1వ తేదీనే దాదాపు పూర్తి చేయాలని పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలకుంట్లపాడులో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో రాజమండ్రికి చెందిన షేక్ జానీ(40) మృతి చెందాడని ఎస్సై శ్రీరామ్ ఆదివారం తెలిపారు. 5 సం. క్రితం వలస వచ్చి అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటూ రొయ్యల పరిశ్రమంలో కూలీగా పని చేస్తున్నాడన్నారు. రోడ్డు దాటుతుండగా కంటైనర్ ఢీకొట్టడంతో అదే వాహనం ముందు చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.