Prakasam

News June 21, 2024

వేటపాలెం: గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

image

వేటపాలెం మండలం రామాపురం తీరం వద్ద నలుగురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. మృతులు ఏలూరు జిల్లా దుగ్గిరాలకి చెందిన నలుగురు యువకులుగా పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు చేపట్టగా ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. మృతి చెందిన యువకులలో నితిన్ (26), అమలరాజ (27), కిషోర్ (25) మృతదేహాలు లభ్యమయ్యాయి. నాని (23) అనే యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News June 21, 2024

కందుకూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ బుర్రాకి మాతృ వియోగం

image

మాజీ శాసనసభ్యులు, కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి బుర్రా లక్ష్మమ్మ వయోభారం వలన శుక్రవారం మరణించారని బుర్రా అనుచరులు తెలిపారు. కాగా శనివారం ఉదయం 10:00 గంటలకు టంగుటూరు మండలం, శివపురం గ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు సూచన మేరకు తెలియజేశారు.

News June 21, 2024

వేటపాలెం: సముద్ర తీరం వద్ద తీవ్ర విషాదం

image

వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. సముద్ర స్నానానికి వచ్చిన నలుగురు యువకులు గల్లంతైన ఘటన వెలుగు చూసింది. ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన నలుగురు వ్యక్తులు గల్లంతు అయినట్లు స్థానికులు తెలిపారు. తీరానికి మూడు మృతదేహాలు కొట్టుకు రాగా నాలుగో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 21, 2024

చీరాల: యువతిపై అత్యాచారం.. ఆపై హత్య?

image

చీరాల మండలం ఈపురుపాలెంలో సుచరిత (21) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు రేప్ చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News June 21, 2024

జిల్లా ప్రజలకు ప్రకాశం పోలీసులు హెచ్చరిక

image

ప్రకాశం జిల్లాలో డ్రగ్స్‌, గంజాయి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ వాల్ పోస్టర్‌ను పోలీసులు విడుదల చేశారు. ఎవరైనా గంజాయి ఇతరత్రా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్టు సమాచారం ఉంటే ఇవ్వాలని, పరిష్కరించడానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. అలాగే ఎప్పటికప్పుడు వాటిపై నిఘా ఉంటుందన్నారు.

News June 21, 2024

ప్రకాశం: 24న ఐటీఐ ప్రవేశాలకు కౌన్సెలింగ్

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలోని ప్రవేశాలకు ఈనెల 24, 25 తేదీలలో కౌన్సెలింగ్ జరుగుతుందని జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు తెలిపారు. పదవ తరగతి మార్కులు జాబితా కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు వంటి పత్రాలతో ఆ తేదీల్లో హాజరుకావాలన్నారు. కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత కళాశాల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వనున్నట్లు వివరించారు.

News June 21, 2024

ఆమంచిని మెచ్చిన షర్మిల.. ఎందుకంటే?

image

రాష్ట్రం మొత్తం మీద చీరాల నియోజకవర్గంలో అత్యధికంగా 42 వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభినందించారు. గురువారం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో షర్మిల అధ్యక్షతన జరిగిన ఎన్నికల ఫలితాల సమీక్షా సమావేశంలో చీరాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావన వచ్చింది. ఆమంచి తన సత్తా చాటారని షర్మిల వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కూడా పాల్గొన్నారు.

News June 21, 2024

నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

image

ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి టీడీపీ తరఫున 10 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ తరఫున ఇద్దరు ఎమ్మెల్యేలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఈ 12 మంది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమ ఎమ్మెల్యే నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల ప్రజలు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News June 21, 2024

జిల్లా ప్రజలను ఆదుకోవాలి: మంత్రి స్వామి

image

ప్రకాశం జిల్లాలో పరిస్థితిలను పరిశీలించి, సమగ్ర నివేదిక తయారుచేసి జిల్లా ప్రజలను ఆదుకోవాలని మంత్రి స్వామి కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లాలో కరవు పరిస్థితులను అంచనా వేయడానికి వచ్చిన బృందంతో ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని కరవు పరిస్థితులను కలెక్టర్, మంత్రి స్వామి బృందానికి తెలియజేశారు.

News June 20, 2024

ప్రకాశం జిల్లాలో తాగునీటి ఎద్దడికి ప్రత్యేక చర్యలు

image

జిల్లాలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాలో లోపాలు లేకుండా చూడడం కోసం ఆన్లైన్ ట్రాకింగ్ యాప్‌ను వినియోగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. పశువులకు కూడా నీటి సరఫరా చేసేందుకు తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. కనిగిరి, మార్కాపురం, నియోజకవర్గాలలో తాగునీటి ఎద్దడిని 3 రోజులకు ఒకసారి అధ్యయనం చేస్తామన్నారు. పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు.