Prakasam

News August 7, 2024

చీరాలలో యువకుడి దారుణ హత్య

image

బాపట్ల జిల్లా చీరాల ఆదినారాయణపురం వద్ద మంగళవారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సైకిల్ మీద వెళ్తున్న సయ్యద్ అరీఫ్ (18)ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఆరిఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సైకిల్ కారుకు సైడ్ ఇవ్వలేదనే విషయంలో వాగ్వాదం జరిగి.. ఆగ్రహించి కారు డ్రైవర్ కత్తితో దాడి చేసినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది.

News August 7, 2024

చీరాలలో యువకుడి దారుణ హత్య

image

బాపట్ల జిల్లా చీరాల ఆదినారాయణపురం వద్ద మంగళవారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సైకిల్ మీద వెళ్తున్న సయ్యద్ అరీఫ్ (18)ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఆరిఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సైకిల్ కారుకు సైడ్ ఇవ్వలేదనే విషయంలో వాగ్వాదం జరిగి.. ఆగ్రహించి కారు డ్రైవర్ కత్తితో దాడి చేసినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది.

News August 7, 2024

చంద్రబాబు చీరాల పర్యటన షెడ్యూల్ ఇదే.!

image

సీఎం చంద్రబాబు నేడు చీరాలకు రానున్న సందర్భంగా పర్యటన వివరాలను CM కార్యాలయం ప్రకటించింది. మధ్యాహ్నం 3.35 గంటలకు హెలికాప్టర్ ద్వారా చంద్రబాబు సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారన్నారు. అలాగే 3.50 గంటలకు బీవీబీఎన్ హై స్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారని, అనంతరం 5.40 గంటలకు CM తిరుగు ప్రయాణం అవుతారన్నారు.

News August 6, 2024

ప్రకాశం జిల్లా TODAY TOP NEWS

image

➤ ప్రకాశం కలెక్టర్, ఎస్పీలకు సీఎం అభినందనలు➤ ప్రకాశం జిల్లాలో ఉచితంగా డీఎస్సీ కోచింగ్➤ టూలేట్ బోర్డు చూసి.. ఇంట్లోకి వచ్చి దాడి➤ సచివాలయ సెక్రటేరియట్‌పై దాడి ➤ అద్దంకిలో రాగి తీగ దొంగలు అరెస్టు➤ శ్రీశైలం డ్యాం అందాలను చూద్దాం రండి➤ అద్దంకి: మా పిల్లలు తప్పు చేయలేదు➤ త్వరలో మార్కాపురాన్ని జిల్లా చేస్తాం: ఎమ్మెల్యే కందుల➤ నాటి చరిత్రకు సాక్ష్యంగా వేటపాలెం గ్రంథాలయం

News August 6, 2024

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌తో ఎస్పీ భేటీ

image

ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఏఆర్ దామోదర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించాలని ఎస్పీకి సూచించారు. వారితోపాటు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు.

News August 6, 2024

ఒంగోలు: TOLET బోర్డు చూసి.. ఇంట్లోకి చొరబడి దాడి

image

అద్దెకు ఇల్లు కావాలంటూ ఇంట్లోకి చొరబడి మహిళ మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన ఘటన ఒంగోలు ఒకటో పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒంగోలులోని ఈమనిపాలెంలో నివసిస్తున్న సుగుణ తమకు గల మరో ఇంటి వద్ద అద్దెకు ఇస్తామంటూ TOLET బోర్డు ఏర్పాటు చేశారు. దీనితో ఓ అగంతకుడు ఫోన్ చేయగా, సుగుణ ఇల్లు చూపిస్తుండగా, దాడిచేసి బంగారు గొలుసు, ఫోన్ లాక్కెళ్ళినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

News August 6, 2024

ఒంగోలు: TOLET బోర్డు చూసి.. ఇంట్లోకి చొరబడి దాడి

image

అద్దె ఇల్లు కావాలని, ఇంట్లోకి చొరబడి దాడికి దిగి మహిళ మెడలోని బంగారు గొలుసును చోరీకి పాల్పడ్డ ఘటన ఒంగోలు ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒంగోలులోని ఈమనిపాలెంలో నివసిస్తున్న సుగుణ తమకు గల మరో ఇంటి వద్ద అద్దెకు ఇస్తామంటూ TOLET బోర్డు ఏర్పాటు చేశారు. దీనితో ఓ అగంతకుడు ఫోన్ చేయగా, సుగుణ ఇల్లు చూపిస్తుండగా, దాడిచేసి బంగారు గొలుసు, ఫోన్ లాక్కెళ్ళినట్లు పోలీసులకు ఈమేరకు ఫిర్యాదు అందింది.

News August 6, 2024

ఒంగోలు: ITIలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో మూడవ విడత ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను ఈనెల 26వ తేదీలోగా నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లాలో ఒకటికంటే ఎక్కువ ఐటీఐ కళాశాలలను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News August 6, 2024

చంద్రబాబు సభా ప్రాంగణాన్ని పరిశీలించిన MLA

image

ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చీరాలకు రానున్న సందర్భంగా.. ఆ సభా ప్రాంగణాలను ఏమ్మెల్యే కొండయ్య సోమవారం రాత్రి పరిశీలించారు. వేటపాలెం మండలంలోని చేనేతపురి కాలనీలో సభా ఏర్పాట్లకు అనువైన ప్రదేశాలను, జాండ్రపేట బీవీఆర్ హైస్కూల్ ప్రాంగణాన్ని పరిశీలించారు. స్థలం ఎంపికపై అధికారులతో చర్చించారు. అధికారులు అందరూ సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం అయ్యేవిధంగా కృషి చేయాలని MLA సూచించారు.

News August 6, 2024

చంద్రబాబు సభా ప్రాంగణాన్ని పరిశీలించిన MLA

image

ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చీరాలకు రానున్న సందర్భంగా.. ఆ సభా ప్రాంగణాలను ఏమ్మెల్యే కొండయ్య సోమవారం రాత్రి పరిశీలించారు. వేటపాలెం మండలంలోని చేనేతపురి కాలనీలో సభా ఏర్పాట్లకు అనువైన ప్రదేశాలను, జాండ్రపేట బీవీఆర్ హైస్కూల్ ప్రాంగణాన్ని పరిశీలించారు. స్థలం ఎంపికపై అధికారులతో చర్చించారు. అధికారులు అందరూ సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం అయ్యేవిధంగా కృషి చేయాలని MLA సూచించారు.