Prakasam

News August 6, 2024

వేటపాలెం గ్రంథాలయంలో గాంధీజీ చేతికర్ర

image

నాటి చరిత్రకు నేటి సాక్ష్యంగా నిలిచిన గ్రంథాలయమే వేటపాలెంలోని సారస్వత నికేతన గ్రంథాలయం. ఈ గ్రంథాలయాన్ని 1918 అక్టోబర్ 15న ప్రజానేత ఊటుకూరి వెంకట సుబ్బారావు ప్రోత్సాహంతో ఏర్పాటు చేశారు. అయితే 1929లో మహాత్మా గాంధీజీ ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. గాంధీజీ చిహ్నంగా గ్రంథాలయంలో గాంధీజీ చేతి కర్ర ఉండడం విశేషం. ఇక్కడి పాఠకులు గాంధీజీ చేతి కర్రను చూసేందుకు సైతం ఆసక్తి చూపుతారు.

News August 6, 2024

ప్రకాశం జిల్లాలో ఉచితంగా DSC కోచింగ్

image

ప్రకాశం జిల్లాలో టెట్ పాసైన గిరిజన విద్యార్థులకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జనార్దన్ రావు శుభవార్త చెప్పారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు టెట్ పాసైన అభ్యర్థులకు డీఎస్సీ కోచింగ్ ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో ఒంగోలులోని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈనెల 11వ తేదీలోగా సంప్రదించాలన్నారు.

News August 6, 2024

ప్రకాశం కలెక్టర్, ఎస్పీలకు సీఎం అభినందన

image

సీఎం చంద్రబాబు సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్‌లను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే కలెక్టర్, ఎస్పీలు జిల్లాలో పాలనాపరమైన అంశాలపై పట్టు సాధించడం పట్ల సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జిల్లాలోని స్థితిగతుల గురించి కలెక్టర్, ఎస్పీలు సీఎంకు వివరించారు.

News August 5, 2024

ప్రకాశం జిల్లా TODAY TOP NEWS

image

➤ పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరిచయం: మంత్రి గొట్టిపాటి
➤ అద్దంకిలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి
➤ ప్రకాశం జిల్లాలో మంచాన పట్టిన చింతలపల్లి గ్రామం
➤ ఈనెల 7వ తేదీన జిల్లాకు సీఎం చంద్రబాబు
➤ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాం: ప్రకాశం కలెక్టర్
➤ తండ్రి మందలించడంతో కొడుకు మృతి
➤ జిల్లావ్యాప్తంగా రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
➤ ఉత్కంఠ పోరులో.. సత్తా చాటిన ప్రకాశం కుర్రాళ్లు

News August 5, 2024

పెట్టుబడుదారులకు రెడ్ కార్పెట్ పరిచాం: మంత్రి గొట్టిపాటి

image

ఏపీలో విద్యుత్ రంగానికి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి ప్రవాసాంధ్రులకు విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. జె.పంగలూరు మండల ముప్పవరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. APలో పెట్టుబడిదారులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రెన్యూవబుల్ ఎనర్జీలో పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరిచామని, విద్యుత్ రంగంలో పెట్టుబడి పెట్టే సంస్థలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధం ఉందని తెలియజేశారు.

News August 5, 2024

కొమరోలు: మంచం పట్టిన చింతలపల్లి గ్రామం

image

కొమరోలు మండలం చింతలపల్లిలో ప్రజలు సీజనల్ వ్యాధుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికి ఒకరు లేదా ఇద్దరు మంచం పట్టారు. సీజనల్ వ్యాధులు సోకుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కొంతమందికి ఇళ్ల వద్ద చికిత్స అందించారు. మరి కొంతమంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

News August 5, 2024

చీరాల చేనేత రంగానికి పూర్వ వైభవం రానుందా?

image

చీరాల నియోజకవర్గం చేనేత రంగానికి ప్రసిద్ధి. ఇక్కడ ఎందరో చేనేత కార్మికులు నేటికీ చేనేత రంగాన్ని ఎంచుకుని తమ కుటుంబ పోషణ సాగిస్తున్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న చేనేత రంగానికి సీఎం చంద్రబాబు ఊతమిచ్చేలా 7వతేదీన జాతీయ చేనేత దినోత్సవ సభను చీరాలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు చేనేత రంగానికి సీఎం ఎటువంటి ప్రకటన చేస్తారనేదే ప్రస్తుతం చేనేత కార్మికుల్లో చర్చనీయాంశంగా మారింది.

News August 5, 2024

జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తా: ప్రకాశం కలెక్టర్

image

జిల్లాను అన్ని శాఖల అధికారుల సమష్టి కృషితో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. సీఎం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ జిల్లాకు సంబంధించిన అంశాల గురించి సమావేశంలో మాట్లాడారు. అనంతరం వంద రోజుల ప్రణాళిక ద్వారా జిల్లాలో చేపట్టవలసిన పలు అంశాల గురించి సీఎం దిశా నిర్దేశం చేశారు.

News August 5, 2024

సీఎంతో సమావేశమైన మంత్రులు, కలెక్టర్లు

image

సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు సైతం హాజరయ్యారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌లు హాజరయ్యారు. అలాగే జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి పైన వీరికి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

News August 5, 2024

సీఎంతో సమావేశమైన మంత్రులు, కలెక్టర్లు

image

సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు సైతం హాజరయ్యారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌లు హాజరయ్యారు. అలాగే జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి పైన వీరికి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.