India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మిస్సింగ్ కేసులు, NBW, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్కి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులను అరా తీశారు. మిస్సింగ్ కేసుల చేధనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చిన్నారులు, మహిళల అదృశ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రకాశం జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ ఘటన నరసరావుపేటలో జరిగింది. నరసరావుపేట (M) పెట్లూరువారిపాలెంలో స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న కొనకనమిట్ల (M) కాట్రగుంటకి చెందిన మల్లెల అజయ్(19) ఆదివారం NSP కాలువలో ఈతకు వెళ్లాడు. నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. కళాశాల వార్డెన్ ఫిర్యాదుతో నరసరావుపేట SI కిషోర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ SP హర్షవర్ధన్ రాజు ఆటో డ్రైవర్లకు ఆదివారం సూచనలు చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ప్రభుత్వం ఆమోదించిన ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలన్నారు. నిర్లక్ష్యంగా ఆటో నడపకూడదు, మద్యం సేవించి వాహణాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఆటోకు నంబర్ ప్లేట్ క్లియర్గా కనిపించేలా ఉండాలి, పోలీసు నంబర్ కూడా ఉండాలన్నారు.

మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ SP హర్షవర్ధన్ రాజు ఆటో డ్రైవర్లకు ఆదివారం సూచనలు చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ప్రభుత్వం ఆమోదించిన ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలన్నారు. నిర్లక్ష్యంగా ఆటో నడపకూడదు, మద్యం సేవించి వాహణాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఆటోకు నంబర్ ప్లేట్ క్లియర్గా కనిపించేలా ఉండాలి, పోలీసు నంబర్ కూడా ఉండాలన్నారు.

మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ SP హర్షవర్ధన్ రాజు ఆటో డ్రైవర్లకు ఆదివారం సూచనలు చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ప్రభుత్వం ఆమోదించిన ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలన్నారు. నిర్లక్ష్యంగా ఆటో నడపకూడదు, మద్యం సేవించి వాహణాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఆటోకు నంబర్ ప్లేట్ క్లియర్గా కనిపించేలా ఉండాలి, పోలీసు నంబర్ కూడా ఉండాలన్నారు.

ప్రకాశం జిల్లా యువతకు నైపుణ్యాలు అందించేందుకు జిల్లాస్థాయిలో అడ్వాన్సుడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. సుంచూరియా యూనివర్సిటీతో కలిసి ఏర్పాటు చేయాలని, అడ్వాన్స్డ్ కోర్సులపై శనివారం ప్రకాశం భవన్లో కలెక్టర్ రాజాబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికార రవితేజ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

పెద్ద దోర్నాల మండలం చిన్న గుడిపాడు సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెలుగొండ ప్రాజెక్టు వైపు వెళ్తున్న వింగర్ బొమ్మలపురం చెంచు కాలనీ వైపు వెళ్తున్న ఓ బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

10వ తరగతి పరీక్షల నిర్వహణలోఎలాంటి లోపాలు లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని శనివారం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల అధికారులతో ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా SP హర్షవర్ధన్తో కలిసి జిల్లాలోని పరిస్థితిపై కలెక్టర్ సమీక్షించారు. 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు జరుగుతాయని DEO తెలిపారు.

ప్రకాశం భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళా సాధికారతను ప్రతిబింబించేలా వేడుకలు ఘనంగా జరిపించాలని సూచించారు. రవాణా, భోజనం, సాంకేతిక ఏర్పాట్లలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

సంతనూతలపాడు ఎండ్లూరు డొంక వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ గ్రానైట్ రాళ్లతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో ముందు భాగం దెబ్బ తిన్నది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.