Prakasam

News July 31, 2024

ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.!

image

వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైల్స్ పట్ల మొబైల్ వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రకాశం పోలీసులు హెచ్చరించారు. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు సైబర్ నేరాల నియంత్రణపై దృష్టి సారించారు. ఈ మేరకు వారు విడుదల చేసిన ప్రకటన ఆధారంగా.. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసి సైబర్ నేరాల బారిన పడవద్దన్నారు. ఏవైనా సైబర్ ఫిర్యాదులను 1930కు చేయాలని సూచించారు.

News July 31, 2024

ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.!

image

వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైల్స్ పట్ల మొబైల్ వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రకాశం పోలీసులు హెచ్చరించారు. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు సైబర్ నేరాల నియంత్రణపై దృష్టి సారించారు. ఈ మేరకు వారు విడుదల చేసిన ప్రకటన ఆధారంగా.. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసి సైబర్ నేరాల బారిన పడవద్దన్నారు. ఏవైనా సైబర్ ఫిర్యాదులను 1930కు చేయాలని సూచించారు.

News July 31, 2024

ఒంటరి మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్

image

చీరాల మండలం ఈపూరుపాలెం పరిధిలో జరిగిన ఒంటరి మహిళ హత్య కేసును ఛేదించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చీరాల డీఎస్పీ జగదీశ్ నాయక్ తెలిపారు. చీరాలలోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. మృతురాలు పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయురాలు కావడంతో ఆమె వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతో, కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఆంజనేయులు దాడి చేసి హత్య చేశాడన్నారు.

News July 31, 2024

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 25 మంది తహశీల్దార్లకు పోస్టింగ్

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా EC ఆదేశాల మేరకు పలువురు తహశీల్దార్లు పక్క జిల్లాలకు బదిలీపై వెళ్లారు. బదిలీపై వెళ్లిన 25 మంది తహశీల్దార్లు ఆయా జిల్లాల నుంచి రిలీవ్ పొంది, 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. జిల్లా కలెక్టర్ వెంకట మురళి 25 మంది తహశీల్దార్లకు జిల్లాలో పోస్టింగ్ కల్పిస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

News July 31, 2024

దొనకొండలో విమానాలు ఎగరడానికి ముహూర్తం ఖరారైందా?

image

దొనకొండ విమానాశ్రయానికి ఉన్న చరిత్ర అంతా ఇంతా కాదు. 1934లో తెల్లదొరలు ఈ విమానాశ్రయం నిర్మించారు. స్వాతంత్ర్యం తర్వాత 1965 వరకు ఇక్కడ సైనిక విమానాలు రయ్.. రయ్ అంటూ చక్కర్లు కొట్టేవి. ఇక ఆ సమయం నుంచి ఇక్కడ ఒక్కసారిగా విమానాల రాకపోకలు బందయ్యాయి. తాజాగా కూటమి ప్రభుత్వం దొనకొండ విమానాశ్రయానికి పూర్వ వైభవం తెచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో ప్రకాశం జిల్లాకు మహర్దశ పట్టిందని ప్రజలు అంటున్నారు.

News July 30, 2024

గంజాయి అక్రమ రవాణాపై నిఘా: ఎస్పీ

image

జిల్లాలో గంజాయి అక్రమ రవాణా నివారించడమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి హోమ్ మంత్రి వంగలపూడి అనితా నిర్వహించిన సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీ పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కై అన్ని చర్యలు తీసుకుంటున్నామని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై నిరంతర నిఘా ఉంచినట్లు తెలిపారు.

News July 30, 2024

రేపు ప్రకాశం జిల్లాకు వర్ష సూచన

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రేపు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకృతి విపత్తుల సంస్థ తెలిపింది. జిల్లాలోని పలు మండలాలలో సైతం వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ప్రకటన విడుదల చేసింది. వర్షాలు కురిసే సమయంలో రైతులు వ్యవసాయ మోటార్ల వద్దకు వెళ్లకుండా ఉండాలని సూచించారు.

News July 30, 2024

ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.!

image

వాట్సాప్‌లకు వచ్చే ఏపీకే ఫైల్స్ పట్ల మొబైల్ వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రకాశం పోలీసులు హెచ్చరించారు. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు సైబర్ నేరాల నియంత్రణపై దృష్టి సారించారు. ఈ మేరకు వారు విడుదల చేసిన ప్రకటన ఆధారంగా.. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసి సైబర్ నేరాల బారిన పడవద్దన్నారు. ఏవైనా సైబర్ ఫిర్యాదులను 1930కు చేయాలని సూచించారు.

News July 30, 2024

యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం: ప్రకాశం కలెక్టర్

image

యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు కలెక్టరేట్‌లోని మినీ సమావేశమందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా నైపుణ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు.

News July 30, 2024

ఢిల్లీ స్వాతంత్ర్య వేడుకలకు దొనకొండ వారు ఎంపిక

image

ఆగస్టు 15వ తేదీన ఢిల్లీలో జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఎంపికైన ఐదు పాఠశాలల్లో, దొనకొండ జడ్పీ పాఠశాల తరఫున గణిత ఉపాధ్యాయుడు షేక్‌ చాంద్ బాషా, పదో తరగతి విద్యార్థి హర్ష సాయి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామాంజనేయులు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలకు ఇలాంటి అవకాశం రావడం సంతోషకరమన్నారు.