India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఈ నెల 8వ తేదీతో రెవెన్యూ సదస్సులు ముగిసిన నేపథ్యంలో అన్ని మండలాల తహశీల్దార్లు, మండల సర్వేయర్లతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెవిన్యూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దర్శనం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎంపీ వైరస్ నివారణలో భాగంగా.. ఒంగోలులోని GGHలో 20 బెడ్లు ఏర్పాటు చేశామని, ఎక్స్పర్ట్ కమిటీతోపాటు పలు కమిటీలను నియమించామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున తెలిపారు. మగవారికి 10 బెడ్లు, మహిళలకు 10 బెడ్ల చొప్పున ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. డాక్టర్ కళ్యాణి HOD జనరల్ మెడిసిన్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించి, ప్రభుత్వ ఆసుపత్రి పట్ల మరింత గౌరవాన్ని పెంచే విధంగా వైద్యులు పనిచేయాలని కలెక్టరు తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం కలెక్టర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని (జీజీహెచ్) సందర్శించి అన్నీ విభాగాల హెచ్ఓడిలతో సమావేశమై, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ, అందిస్తున్న వైద్య సేవలపై క్షుణ్ణంగా సమీక్షించారు.
బాపట్ల జిల్లాలో అర్హులైన నిరుపేదలందరూ PMAY 2.0 పథకం క్రింద ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని, బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. విజన్ బాపట్ల-2047 అమలు ప్రణాళికపై 14 శాఖల అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించిందన్నారు.
ప్రకాశం జిల్లాలో వివిధ పనులకు ప్రధాని మోదీ విశాఖ నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. దోర్నాల-కుంట జంక్షన్(రూ.245 కోట్లు), వెలిగోడు-నంద్యాల(రూ.601 కోట్లు) రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుడతారు. అలాగే రూ.108 కోట్లతో గిద్దలూరు-దిగువమెట్ట డబ్లింగ్ పనులకు భూమి పూజ చేస్తారు. రూ.907 కోట్లతో పూర్తి చేసుకున్న 6 వరుసల చిలకలూరిపేట బైపాస్ను ప్రారంభిస్తారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం తిమ్మవరం రోడ్డులోని వాటర్ ట్యాంకు వద్ద నివాసం ఉండే దుర్గారావు కుమారుడు నాగరాజు(2) ఇంటి బయట ఆడుకుంటూ నాలుగో తేదీన ఎలుకల పేస్టు తిన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు గుంటూరు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. హాస్పటల్ నుంచి వచ్చిన సమాచారంతో కేసు నమోదు చేశామని మేదరమెట్ల ఎస్ఐ మొహమ్మద్ రఫీ తెలిపారు.
శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసిబాబుకు మంగళవారం మరోసారి నోటీసులు జారీ చేసినట్లు ఎస్సీ దామోదర్ చెప్పారు. ఈనెల 8న ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈనెల 3న హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా గైర్హాజరయ్యాడు.
బెంగళూరులో hMP వైరస్ కేసు నమోదైన నేపథ్యంలో అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతికి జిల్లాకు వస్తున్నా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు చెప్పారు. మంగళవారం జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా లాగా దీని ప్రభావం ఉండదన్నారు. జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని చెప్పారు.
సంతమాగులూరు మండలంలోని ఏల్చూరులో ఈనెల రెండో తేదీన రోడ్డు ప్రమాదం జరిగి బాలుడికి గాయాలయ్యాయి. ఈ కథనం <<15047387>>Way2News<<>>లో ప్రచురితమైంది. ఈ వార్తకు ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ట్విటర్(X) వేదికగా స్పందించారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తన బృందం దానిని పరిశీలించి, సాధ్యమైన సహాయం బాలుడికి చేస్తుందని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.