India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

ప్రకాశం జిల్లాలోని 14 మండలాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కలెక్టర్ రాజబాబు అన్నారు. కనిగిరి, కొండపి, కొత్తపట్నం, మర్రిపూడి, మద్దిపాడు, నాగులుప్పలపాడు, ఒంగోలు, పామూరు, పీసీపల్లి, పొన్నలూరు, సంతనూతలపాడు, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున పరిస్థితిని పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.

ప్రకాశం జిల్లాకు దిత్వా తుఫాన్ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రేపు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. కాబట్టి భారీ వృక్షాల వద్ద, పాత భవనాల్లో ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరాలని వారు సూచించారు. నెల్లూరు జిల్లాలో కూడా RED ALERT ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రకాశం జిల్లాలోని 14 మండలాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కలెక్టర్ రాజబాబు అన్నారు. కనిగిరి, కొండపి, కొత్తపట్నం, మర్రిపూడి, మద్దిపాడు, నాగులుప్పలపాడు, ఒంగోలు, పామూరు, పీసీపల్లి, పొన్నలూరు, సంతనూతలపాడు, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున పరిస్థితిని పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

ప్రకాశం జిల్లా ప్రజలు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. గ్రీవెన్స్ డేలో అర్జీలు అందించినప్పటికీ పరిష్కారం కాకపోయినా, తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు 1100ను సంప్రదించాలని సూచించారు. తుఫాన్ నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో PGRS రద్దయిన విషయం తెలిసిందే.

ప్రకాశం జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి తగ్గుముఖం పట్టిందని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి G.బాలాజీ అన్నారు. 2020-21లో 82419 మందికి టెస్ట్ చేయగా 897 మందికి నిర్ధారణ అయింది. 2021-22లో 202901కి గాను 1250, 2022-23లో 245611కి గాను 1173, 2023-24లో 120334కి గాను 930, 2024-25లో 165269 మందికి గానూ 692, 2025-26 ఇప్పటి వరకు 79901 మందికి టెస్ట్ చేయగా 354 కేసులతో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా 18వ స్థానంలో నిలిచింది.

ప్రకాశం జిల్లా ప్రజలు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. గ్రీవెన్స్ డేలో అర్జీలు అందించినప్పటికీ పరిష్కారం కాకపోయినా, తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు 1100ను సంప్రదించాలని సూచించారు. తుఫాన్ నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో PGRS రద్దయిన విషయం తెలిసిందే.

ప్రకాశం జిల్లాలోని 14 మండలాలు, 168 గ్రామాల్లో దిత్వా తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి ఆదివారం మండల స్థాయి అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో అధికారులందరూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని చెరువుల వద్ద క్షేత్రస్థాయి సిబ్బంది పరిస్థితిని గమనించాలన్నారు.

సెల్ఫోన్ చూస్తూ, మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేస్తే, ప్రమాదాలను ఆహ్వానించినట్లేనని ప్రకాశం పోలీసులు వాహనదారులకు సూచించారు. ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దని కోరారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.