India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బెంగళూరులో HMPV కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతికి ప్రకాశం జిల్లాకు రానున్నారు. దీంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాగా దీని ప్రభావం ఉండదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రకాశం జిల్లా DMHO టి. వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
ఉమ్మడి ప్రకాశంలో జిల్లాలోని ఫేక్ పెన్షన్లపై అధికారులు నిన్నటి నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో కొందరిలో టెన్షన్ నెలకొంది. కొండపి మండలంలో నకిలీ వికలాంగుల పెన్షన్దారులను గుర్తించేందుకు ఎంపీడీఓ నేతృత్వంలో డాక్టర్లు పర్యటించారు. వీరి రాకను గమనించిన కొందరు నకిలీ పెన్షన్దారులు ఇళ్లకు తాళాలువేసి ఊరెళ్లారని తెలుస్తోంది. మరికొందరు కనిపించకుండా పరారయ్యారని సమాచారం.
ప్రకాశం జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో సోమవారం ముగ్గురు మృతి చెందారు. పోలీసులు వివరాల మేరకు.. ఎదురాళ్లపాడుకులో నాగం గంగమ్మ(42) కారు ఢీకొనడంతో మృతిచెందగా, దర్శి ఓబన్నపల్లికి చెందిన కాశీనాయన రెడ్డి(24) గడ్డి ట్రాక్టర్ ఢీకొని మృతి చెందాడు. ముండ్లమూరులో సుధీర్(18) వరి కోత ర్యాంప్ ఢీకొనగా అక్కడికక్కడే చనిపోయాడు.
ఒంగోలులోని పోలీస్ పెరేడ్ మైదానంలో సోమవారం జరిగిన కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో 233 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. మొత్తం 600 మంది అభ్యర్థులకు గాను 319 మంది మాత్రమే హాజరయ్యారు. వారికి ఉదయం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం పలు ఈవెంట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ దామోదర్, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో సోమవారం జిల్లాలోని ఏఎన్ఎంలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అధిక రక్తపోటు, మధుమేహం, రక్తస్రావంతో బాధపడుతున్న వారిని సరైన సమయంలో గుర్తించి వైద్య సేవలు అందించడం ద్వారా మాతృ మరణాలు, శిశు మరణాలను నివారించవచ్చు అని తెలిపారు.
జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు తన ఛాంబర్ సోమవారం ప్రకాశం జిల్లాకు సంబందించిన 8 నియోజకవర్గాల నూతన ఓటరు లిస్టుల సీడీ కాపీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం పోలింగ్ బూతులు..2183, జిల్లా మొత్తం ఓటర్లు 1819448, పురుషు ఓటర్లు 905885, మహిళా ఓటర్లు 913450, థర్డ్ జండర్ ఓటర్లు 113 మంది అని తెలిపారు. జిల్లా లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నారని తెలిపారు.
ప్రకాశం జిల్లాలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు సోమవారం ఒంగోలులో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. గ్రామాల్లో కూలీలకు రూ.300 వేతనం పెంచుటానికి ఏఏ ప్రణాళికలు ఉన్నాయో క్షేత్ర సహాయకులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కార్యక్రమంలో అమలుపరుస్తున్న పల్లె పండుగ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి సూచించారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. అర్జీలు పునరావృతం అయితే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్, అధికారులు పాల్గొన్నారు
➤ చర్లపల్లి-తిరుపతి(07077): 6వ తేదీ
➤ తిరుపతి-చర్లపల్లి(07078): 7వ తేదీ
➤ చర్లపల్లి-తిరుపతి(02764):8, 11, 15 వ తేదీ
➤ కాచిగూడ-తిరుపతి(07655): 9, 16వ తేదీ
➤ తిరుపతి-కాచిగూడ(07656): 10, 17వతేదీ
పై ట్రైన్లు చీరాల, ఒంగోలు స్టేషన్లలో ఆగుతాయి. వీటికి ఇవాళ ఉదయం 8 గంటలకు బుకింగ్ ప్రారంభం అవుతుంది.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న నకిలీ పెన్షన్లపై అధికారులు దృష్టి పెట్టారు. వికలాంగులు, వృద్ధాప్య తదితర పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో లక్షలమంది పెన్షన్లు పొందుతున్నారు. వాటిలో చాలా వరకు బోగస్ పెన్షన్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో నేటినుంచి వాటి లెక్కను పెద్ద ఆసుపత్రుల డాక్టర్ల బృందం ఇళ్లకే వచ్చి మరీ లబ్ధిదారులను టెస్ట్ చేయనుంది.
Sorry, no posts matched your criteria.