Prakasam

News January 6, 2025

మార్కాపురం నుంచి విదేశీ నేరగాళ్లకు సిమ్ములు

image

దేశంలో రోజురోజుకీ సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం వాసుల పేరుతో సిమ్‌లు విదేశీ సైబర్ మోసగాళ్లకు వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర నిఘా సంస్థలు ఢిల్లీ నుంచి అమరావతికి సమాచారం ఇచ్చాయి. దీంతో మార్కాపురం టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. కేంద్ర నిఘా సంస్థలు కొన్ని సిమ్ములను గుర్తించగా అందులో 10 సిమ్ములు మార్కాపురం వాసుల పేరుతో ఉన్నట్లు సమాచారం.

News January 6, 2025

బీచ్ హ్యాండ్ బాల్‌లో 3వ స్థానంలో ప్రకాశం జట్టు

image

అచ్యుతాపురం మండలం పూడిమడకలో రెండు రోజులపాటు నిర్వహించిన బీచ్ హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో మూడవ స్థానంలో ప్రకాశం జట్టు నిలిచింది. రన్నర్‌గా కర్నూలు జట్టు, విజేతగా విశాఖ జట్టు నిలిచింది. విజేతలకు బహుమతులను జనసేన ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల కోఆర్డినేటర్ సుందరపు సతీశ్ కుమార్ అందజేశారు. ఈ పోటీలు విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

News January 5, 2025

బీచ్ హ్యాండ్ బాల్‌లో 3వ స్థానంలో ప్రకాశం జట్టు

image

అచ్యుతాపురం మండలం పూడిమడకలో రెండు రోజులపాటు నిర్వహించిన బీచ్ హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో మూడవ స్థానంలో ప్రకాశం జట్టు నిలిచింది. రన్నర్‌గా కర్నూలు జట్టు, విజేతగా విశాఖ జట్టు నిలిచింది. విజేతలకు బహుమతులను జనసేన ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల కోఆర్డినేటర్ సుందరపు సతీశ్ కుమార్ అందజేశారు. ఈ పోటీలు విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

News January 5, 2025

త్రిపురాంతకంలో రోడ్డు ప్రమాదం

image

త్రిపురాంతకం మండలంలోని గొల్లపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం  జరిగింది. ముందు వెళ్తున్న మిని లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. విజయవాడ నుంచి జగ్గయ్య పేట వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News January 5, 2025

ఒంగోలు: సోమవారం మీకోసం కార్యక్రమం రద్దు

image

ఒంగోలులోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీవ్ రంజన్ మిశ్రా వన్ మ్యాన్ కమిషన్ పర్యటన జిల్లాలో ఉన్నందున, సోమవారం పీజిఆర్ఎప్ హాలులో దళితుల నుంచి అర్జీలు సేకరించే కార్యక్రమం ఉన్న నేపథ్యంలో రద్దు చేసినట్లు తెలిపారు. దూరప్రాంతాల ప్రజలు ఎవరూ ఒంగోలు రావద్దని ఆమె కోరారు.

News January 4, 2025

పల్లె పండుగ రోడ్లను త్వరగా పూర్తి చేయండి: ప్రకాశం కలెక్టర్

image

పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. పనుల పురోగతిపై శనివారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో ఆమె సమీక్షించారు. చేసిన పనులకు బిల్లులను ప్రభుత్వం తక్షణమే చెల్లిస్తున్నందున పనులను వేగవంతం చేసి బిల్లులను అప్లోడ్ చేయాలని చెప్పారు. జిల్లాకు కేటాయించిన పనులు, వాటి పురోగతిపై నియోజకవర్గాల వారీగా ఆమె ఆరా తీశారు.

News January 4, 2025

ప్రకాశం జిల్లాలో ఎయిర్‌పోర్టుపై CM కీలక ప్రకటన

image

ప్రకాశం జిల్లా దొనకొండలో బ్రిటీష్ కాలంలోనే ఎయిర్ ఫోర్ట్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇది ఎప్పుడో మూతపడింది. ఈ నేపథ్యంలో ఒంగోలుకు దగ్గరలోని కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు గ్రామాల మధ్య ఎయిర్‌పోర్ట్ నిర్మించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఆ ఏరియాలో 723 ఎకరాలను గుర్తించినట్లు సీఎం చంద్రబాబు నిన్నటి సమీక్షలో వెల్లడించారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉంది.

News January 4, 2025

ప్రకాశం జిల్లాలో ఎయిర్‌పోర్టుపై CM కీలక ప్రకటన

image

ప్రకాశం జిల్లా దొనకొండలో బ్రిటీష్ కాలంలోనే ఎయిర్ ఫోర్ట్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇది ఎప్పుడో మూతపడింది. ఈ నేపథ్యంలో ఒంగోలుకు దగ్గరలోని కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు గ్రామాల మధ్య ఎయిర్‌పోర్ట్ నిర్మించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఆ ఏరియాలో 723 ఎకరాలను గుర్తించినట్లు సీఎం చంద్రబాబు నిన్నటి సమీక్షలో వెల్లడించారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉంది.

News January 4, 2025

ఒడిశా గవర్నర్‌గా ప్రకాశం జిల్లా వాసి

image

ఒడిశా గవర్నర్‌‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన కంభంపాటి హరిబాబు ప్రకాశం జిల్లా వాసే. నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం ఈయన స్వగ్రామం. మిజోరం గవర్నర్‌గా ఉన్న ఈయనను ఒడిశాకు బదిలీ చేశారు. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్‌‌భవన్‌లో హరిబాబుతో శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఒడిశా CMమోహన్ చరణ్ మాఝీ హాజరయ్యారు. ఆయన ఉన్నత చదువుల కోసం వైజాగ్ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు.

News January 3, 2025

ప్రకాశం: అరుదైన మొక్కల స్మగ్లింగ్.. ఇద్దరు అరెస్ట్

image

పక్కాగా అందిన సమాచారంతో అరుదుగా కనిపించే మొక్కలను తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఒంగోలులో గురువారం చోటుచేసుకుంది. నిందితుల నుంచి 9.8 కిలోల ఇంద్రజాల, 0.286 కిలోల మహేంద్రజాల మొక్కలు, 6 శంఖాలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులో ఉన్న నిందితుల సమాచారం‌ మేరకు మొక్కలు సరఫరా చేసిన వ్యక్తిని ఒంగోలులో పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద 6.64 కిలోల మొక్కలను స్వాధీనం చేసుకున్నారు