Prakasam

News July 26, 2024

ఒంగోలు: 34 మంది తహశీల్దార్లు రిలీవ్

image

సార్వత్రిక ఎన్నికల సమయంలో సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న తహశీల్దార్లను మరొక జిల్లాకు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఆ మేరకు బదిలీపై ప్రకాశం జిల్లా వచ్చిన 34 మంది తహశీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ తమిమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన తహశీల్దారులు వారి బాధ్యతలను కార్యాలయంలోని ఉప-తహసీల్దారులకు అప్పగించాలని పేర్కొన్నారు.

News July 26, 2024

ప్రకాశం: జాతీయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేస్తున్న వారికి జాతీయ పురస్కారాలు అందించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి. అర్చన తెలిపారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రదానం చేస్తారన్నారు. ఈ పురస్కారానికి ఆసక్తి గలవారు ఆన్లైన్లో ఈనెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 26, 2024

సైబర్ నేరాలపై ‘ప్రకాశం పోలీస్’ విస్తృత అవగాహన

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా పోలీస్ శాఖ ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తోంది. మెసేజింగ్ యాప్‌ల ద్వారా పంపిన APK ఫైల్స్‌ను ఇన్ స్టాల్ చేయడం, అపరిచిత వ్యక్తులతో ఫోన్లో మాట్లాడడం, ఓటీపీ పంచుకోవడం వంటివి చేయవద్దని గురువారం ఒక ఆసక్తికర పోస్టర్‌ను విడుదల చేసింది. చెడు వినకు, చూడకు, మాట్లాడకు అనేలా విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రజలను ఆలోచింపచేస్తోంది.

News July 25, 2024

ఒంగోలు: పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆంధ్రకేసరి విశ్వ విద్యాలయం పరిధిలో ఉన్న రెండు న్యాయ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇటీవల నిర్వహించిన మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి గురువారం విడుదల చేశారు. ఆయా కళాశాలల నుంచి మూడు సంవత్సరాల లా కోర్సులో 69.7 శాతం ఉత్తీర్ణతతో 223 మంది ఉత్తీర్ణులయ్యారని ఆయన తెలిపారు. ఐదు సంవత్సరాల లా కోర్సులో 62.5 శాతంతో ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు.

News July 25, 2024

ప్రకాశం: చిట్టీల పేరుతో రూ.2.50 కోట్లు స్వాహా

image

చిట్టీల పేరుతో రూ.2.50 కోట్లతో ఓ వ్యక్తి పరారైన ఘటన తాళ్లూరు మండలం, తూర్పు గంగవరంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పఠాన్ సుభాని కొంతకాలంగా నమ్మకంగా గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారితో చీటీ పాట నడిపించేవాడు. 65 మంది సభ్యులు కూలీనాలీ చేసుకున్న నగదుతో చీటీ పాట పాడేవారు. ఆ వ్యక్తి రాత్రికి రాత్రి కుటుంబ సభ్యులతో పరారు కావడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News July 25, 2024

అదనపు పొగాకు ఉత్పత్తిపై జరిమానా రద్దు

image

అదనపు పొగాకు ఉత్పత్తిపై జరిమానా రద్దు చేయాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు. వాతావరణం అనుకూలించడంతో పొగాకు అధికంగా ఉత్పత్తి అయ్యిందని, గతంలో కూడా జరిమానా తొలగించి కొనుగోలు చేసినట్లు ఆయనకు వివరించారు. సదరు విషయంపై కేంద్ర మంత్రి అధికారులతో మాట్లాడి పెనాల్టీ రద్దుకు ఆదేశించినట్లు సమాచారం.

News July 25, 2024

ఒంగోలు: 30న గెస్ట్ అధ్యాపకులకు ఇంటర్వ్యూలు

image

ఒంగోలులోని ప్రభుత్వ డీఎస్ మహిళా కళాశాలలో ఈ నెల 30న గెస్ట్ అధ్యాపకులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.కళ్యాణి తెలిపారు. కళాశాలలో ఖాళీగా ఉన్న కామర్స్, హిందీ పోస్టులకు గెస్ట్ అధ్యాపకులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులకు ఎంపికలో ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు.

News July 25, 2024

చంద్రశేఖరపురం: ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

image

ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చంద్రశేఖరపురం మండలంలోని అరివేముల గ్రామం వద్ద బుధవారం చోటు చేసుకుంది. మండలంలోని పెద్దగోగులపల్లికి చెందిన ఆటో డ్రైవర్ గుర్రం గురవయ్య (65) స్వగ్రామానికి వెళ్తుండగా అరివేముల వద్ద ఆటో బోల్తాపడడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News July 25, 2024

ప్రకాశం: బాలికపై వృద్ధుడు అఘాయిత్యం

image

బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి యత్నించి ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. టంగుటూరుకు చెందిన ఇత్తడి విజయ్ కుమార్(55) కొయ్య పనిచేస్తుంటాడు. భార్య మృతితో మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక పాఠశాలకు వెళ్లేదారిలో ఉండే విజయ్ కుమార్‌ను తాత అని పలకరిచ్చేది. దీంతో బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించగా బాలిక కేకలు వేయగా, స్థానికులు దేహశుద్ధి చేశారు.

News July 25, 2024

జాతీయస్థాయి పోటీలకు దొనకొండ విద్యార్థులు

image

దొనకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం క్రీడాకారులకు అభినందన కార్యక్రమం జరిగింది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు జి. కోటేశ్ ఎం.వి సంజన జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనందున వారిని ప్రధానోపాధ్యాయులు రామాంజనేయులు అభినందించారు. మన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. వ్యాయామ ఉపాధ్యాయుడు కాలే నరసింహారావు ప్రోత్సాహం ఎంతో ఉందని ఆయన కొనియాడారు.