Prakasam

News January 2, 2025

ప్రకాశం జిల్లా పొగాకు బోర్డు ఇంచార్జ్ ఆర్ఎం ఎవరంటే?

image

ప్రకాశం జిల్లా పొగాకు బోర్డు దక్షిణాది ప్రాంతీయ ఇన్‌ఛార్జ్ రీజనల్ మేనేజర్‌గా బి. సుబ్బారావు నియమితులయ్యారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ ఆర్ఎంగా ఉన్న లక్ష్మణ రావు కృష్ణ శ్రీ మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ప్రస్తుతం గుంటూరులోని ప్రధాన కార్యాలయంలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్న సుబ్బారావుకు ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు.

News January 2, 2025

బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి దారుణ హత్య

image

బాపట్ల జిల్లా నగరం మండలం చిన్నమట్లపూడిలో బుధవారం అర్ధరాత్రి నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన లుక్క నాగరాజు (43)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నాగరాజు భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రేపల్లె గ్రామీణ సీఐ సురేశ్ బాబు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News January 2, 2025

ఉగ్ర వినూత్న ఆలోచన.. ఆసుపత్రికి మహర్దశ

image

కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నూతన సంవత్సర వేడుకల్లో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కనిగిరి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి విరాళాల సేకరణ చేశారు. బొకేలకు బదులు విరాళాలను టీడీపీ శ్రేణులు, ప్రజలు, అధికారులు విరాళాలను ఆయనకు అందించారు.. విరాళాల రూపంలో రూ. 3,28,773లు సమకూర్చినట్లు ఆయన తెలిపారు. వైద్యశాల అభివృద్ధికి విరాళాలు అందించిన వారికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

News January 1, 2025

వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే ఉగ్ర

image

కనిగిరిలో ఎమ్మెల్యే Dr.ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సరం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ఓ వినూత్న కార్యక్రమానికి నాంది పలికారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు నేతలు, అభిమానులు, అధికారులు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ఆయన పూల దండలు, బొకేలు, స్వీట్స్, పండ్లు తీసుకురాకుండా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి సహకరించాలని హుండీ ఏర్పాటు చేసి విరాళాల సేకరణ చేపట్టారు.

News January 1, 2025

పర్చూరు నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌ఛార్జ్ మార్పు

image

పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా గాదె మధుసూదన రెడ్డి నియమితులయ్యారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గాదె మధుసూదన రెడ్డి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు. ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా యడం బాలాజీ ఉన్న విషయం తెలిసిందే.

News December 31, 2024

న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న బాపట్ల కలెక్టర్

image

విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి విద్యార్థులకు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలలో నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై కేక్ కట్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులతో కలిసి వేడుకలు  జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

News December 31, 2024

కులగణనపై అభ్యంతరాలను స్వీకరిస్తాం: బాపట్ల కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 7వ తేదీ వరకు షెడ్యూల్డ్ కులగణనపై సామాజిక తనిఖీ నిర్వహించి, అభ్యంతరాలను స్వీకరిస్తామని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. షెడ్యూల్డ్ కులాల కులగణన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించామని తెలిపారు. దీనిపై వచ్చే అభ్యంతరాలను వచ్చే జనవరి 11 వరకూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. తుది వివరాలను వచ్చే నెల 17న సచివాలయాల్లో ప్రదర్శిస్తామన్నారు.

News December 31, 2024

కొరిశపాడు: రోడ్డు మిల్లర్ ఢీకొని బాలుడి మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా కొరిశపాడులో సోమవారం విషాద ఘటన జరిగింది. స్థానిక జగజ్జీవన్ రావ్ కాలనీకి చెందిన దుడ్డు నాగయ్య కుమారుడు గౌతమ్ తన తాతతో కలిసి బైకుపై సెంటర్లో ఉన్న బొడ్డురాయి దగ్గరికి వెళ్లాడు. ఇద్దరు బైక్‌పై కూర్చొని ఉండగా రోడ్లు వేస్తున్న మిల్లర్ రివర్స్‌లో వచ్చి బైకును ఢీకొట్టింది. బాలుడికి బలమైన దెబ్బ తగలడంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

News December 31, 2024

వేడుకల్లో హద్దు మీరితే చర్యలు: ప్రకాశం SP

image

ప్రకాశం జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులకు ఎస్పీ ఏఆర్ దామోదర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 31వ తేది సాయంత్రం నుంచి అన్ని ముఖ్య కూడళ్లలో పోలీస్ పికెట్స్, నైట్ గస్తీ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పోలీస్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 30, 2024

ప్రకాశంలో ఆ 237 మందికి కొత్త పింఛన్లు

image

భర్త చనిపోతే వెంటనే భార్యకు పింఛన్ మంజూరయ్యాలే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పింఛన్ తీసుకునే వ్యక్తి చనిపోతే ఆ మరుసటి నెల నుంచే భార్యకు నగదు అందజేయనున్నారు. ప్రకాశం జిల్లాలో నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు 237 మంది మృతిచెందారు. ఆ మేరకు ఈనెల నుంచి వారి భార్యలకు పింఛన్ సొమ్ము ఇస్తామని కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రకటించారు.