Prakasam

News July 23, 2024

రోడ్డు మరమ్మతుల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

చీమకుర్తి మండలంలోని మర్రిచెట్లపాలెం, బుధవాడ గ్రామాల వద్ద దెబ్బతిన్న జాతీయ రహదారి రోడ్డును కలెక్టర్ తమిమ్ అన్సారియ మంగళవారం పరిశీలించారు. రోడ్డు మరమ్మతు పనుల ఎస్టిమేషన్, తదితర వివరాలను ఆర్ అండ్ బి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రధాన రహదారి ఒకటైన ఒంగోలు-కర్నూలు జాతీయ రహదారి మరమ్మతు పనులు వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News July 23, 2024

ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ

image

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రకాశం జిల్లాకు సైతం తగిన ప్రాధాన్యం లభించింది. ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అందిస్తామన్న కేంద్రం, విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కాగా జిల్లాకు ఎంత ప్యాకేజీ అనేది తెలియాల్సి ఉంది.

News July 23, 2024

మార్కాపురం: దరఖాస్తుల ఆహ్వానం

image

మార్కాపురం ఆకాశవాణి కేంద్రంలో అనౌన్సర్ల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రోగ్రామ్ హెడ్ పి. ప్రశాంత్ కిరణ్ తెలిపారు. మార్కాపురం, పరిసర ప్రాంతాల వారై ఉండాలన్నారు. తెలుగు భాషపై పూర్తి అవగాహన, మంచి కంఠస్వరం, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి సమకాలిన రాజకీయ, ఆర్థిక అంశాలపై పట్టు ఉండాలన్నారు. ఆసక్తి గల వారు వచ్చే నెల 5 లోపు తమని సంప్రదించాలన్నారు. రాత, స్వర పరీక్షలతో ముఖాముఖీ ఉంటుందన్నారు.

News July 23, 2024

రేపు, ఎల్లుండి ఒంగోలు త్రిబుల్ ఐటిలో ప్రవేశాలు

image

ఒంగోలులోని త్రిబుల్ ఐటీ కళాశాలలో 24, 25 తేదీలలో ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు త్రిబుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా తెలిపారు. ప్రవేశాలకు హాజరుకాని విద్యార్థులకు తిరిగి ప్రవేశాలు పొందేందుకు మరోసారి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News July 23, 2024

చీరాల: బాలికను వేధించిన నిందితుడి అరెస్టు

image

బాలికను వేధించిన కేసులో నిందితుడు కటకటాలపాలయ్యాడు. పోలీసుల వివరాల మేరకు.. చీరాల మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికను ఫోన్ నంబర్ ఇవ్వమని వేధించాడు. బాలిక తల్లి ఈపూరుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు తెలిపారు.

News July 23, 2024

సంతనూతలపాడు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

image

సంతనూతలపాడు పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ దామోదర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి స్టేషన్ ఆవరణలో ఉన్న వివిధ కేసులకు సంబంధించిన వాహనాలను పరిశీలించారు. స్టేషన్లోని సిబ్బంది వివరాలు, రికార్డుల నిర్వహణ, పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాలు, శాంతిభద్రతలు, అసాంఘిక కార్యకలాపాల గురించి ఎస్పీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

News July 22, 2024

కనిగిరి పోలీస్ స్టేషన్లో 108 అంబులెన్స్‌

image

కొనకనమిట్ల మండలానికి చెందిన 108 వాహనం ఈనెల 10న కనిగిరి మున్సిపాలిటీలోని టకారిపాలెం వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొనగా అతడు మృతి చెందాడు. ఆ అంబులెన్స్‌కు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్‌ లేకపోవడంతో కనిగిరి పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. జిల్లాలోని పదుల సంఖ్యలో అంబులెన్స్‌‌లకు ఈ ధ్రువపత్రాలు లేవని పలువురు చెప్తున్నారు.

News July 22, 2024

ప్రకాశం: మీ MLA ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారు?

image

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ గళం వినిపించనుండగా.. వారిలో డోల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే ఇంటూరి, కొండయ్య, తాటిపర్తి చంద్రశేఖర్ మొదటి సారి గళం వినిపించనున్నారు. మరి మీ MLA అసెంబ్లీలో ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి.

News July 22, 2024

ప్రకాశం: గేదెలు అడ్డురావడంతో ఇద్దరి మృతి

image

మార్కాపురం మండలం తిప్పాయపల్లెం వద్ద ఉన్న జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గేదెలు అడ్డంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమని బాధితులు తెలిపారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గేదెలను తప్పించబోయి పక్కనే ఉన్న పొలంలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. గేదెలను మేతకోసం పశుపోషకులు వదిలేస్తున్నారని, అవి రోడ్డుపై తిరగడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

News July 22, 2024

ప్రకాశం: సాగర్ జలాలను పరిశీలించిన సబ్ కలెక్టర్

image

సాగర జలాలు విడుదల తరుణంలో నీటి చౌర్యం జరగకుండా ఆ శాఖ అధికారుల ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆదివారం త్రిపురాంతకం మండలంలోని విశ్వనాథపురం, దూపాడు పంపు సెట్ పరిసర ప్రాంతాలను మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, రెవిన్యూ అధికారులు తనిఖీ చేసి పరిశీలించారు. రైతులు, తదితరులు నీటి సరఫరాను చౌర్యం చేయకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.