Prakasam

News December 24, 2024

ప్రకాశం: ఆ ప్రాంతంలోనే వరుస భూ ప్రకంపనలు

image

ప్రకాశం జిల్లాలో గత 3రోజులుగా వరుస భూ ప్రకంపనలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. అందులోనూ దర్శి నియోజకవర్గంలోనే ఈ ప్రకంపనలు సంభవించడం గమనార్హం. 21వ తేదీన మొదటిగా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో, 22న సింగన్నపాలెం, మారెళ్లలో, 23న తాళ్లూరు, విఠలాపురం, కొత్తపాలెం, ముండ్లమూరు, పసుపుగల్లు గ్రామాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఇలా గత 3 రోజులుగా 7సార్లు భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

News December 24, 2024

బాధితులకు న్యాయం అందించేలా చూడాలి: ప్రకాశం ఎస్పీ

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి 68 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజలు సమస్యలను చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.

News December 23, 2024

తాళ్లూరులో మళ్లీ కంపించిన భూమి

image

తాళ్లూరు మండలంలో సోమవారం‌ రాత్రి 8 గంటల సమయంలో పది నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. తాళ్లూరు, విఠలాపురం, కొత్తపాలెం, ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామాలలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇలా ఒకే రోజు మూడు సార్లు భూకంపం‌ రావడం, మూడు రోజుల నుంచి రోజూ భూమి కంపించడం గమనార్హం.

News December 23, 2024

ఒంగోలు: పబ్లిక్ గ్రీవెన్స్ సెల్‌కు 68 ఫిర్యాదులు

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి 68 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజలు సమస్యలను చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు.

News December 23, 2024

ప్రకాశం జట్టుకు ప్రథమ స్థానం

image

ఈనెల 21వ తేదీ నుంచి తిరుపతి జిల్లా పుత్తూరులో జరిగిన అండర్-19 రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఖోఖో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలుర జట్టు ప్రథమ స్థానం సాధించినట్లు ఖోఖో రాష్ట్ర కార్యదర్శి మేకల సీతారాంరెడ్డి ఆదివారం తెలిపారు. ఈ జట్టును చంద్రగిరి ఎమ్మెల్యే భాను ప్రకాశ్ అభినందించారన్నారు. ఈ జట్టు బాపట్ల జిల్లా పంగులూరులో 20 రోజులు పాటు శిక్షణ తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

News December 23, 2024

ప్రకాశం జిల్లాలో ఒకేరోజు 2సార్లు భూకంపం

image

ప్రకాశం జిల్లా తాళ్లూరు, ముండ్లమూరు మండలాల్లో వరుస భూకంపాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆదివారం ముండ్లమూరు మండలంలో ఉదయం 11 గంటలకు భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అయితే రాత్రి 7 గంటల సమయంలో మరోసారి భూమి కంపించినట్లు సమాచారం. తాళ్లూరు మండలంలో సాయంత్రం గంట వ్యవధిలో‌ 2సార్లు భూమి కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇలా భూమిలో ప్రకంపనలకు కారణం భూమిలోని పొరల సర్దుబాటేనని పరిశోధకులు అంటున్నారు.

News December 23, 2024

ఒంగోలు పోలీస్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

image

ఒంగోలు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎస్పీ మాట్లాడారు. క్రిస్మస్‌ శాంతి, సంతోషాలకు ప్రేమ, త్యాగనిరతికి చిహ్నమన్నారు.‌ క్రీస్తు బోధనలు మంచి మార్గంలో నడిపిస్తాయని‌ చెప్పారు. అనంతరం పెయింట్, డ్రాయింగ్ గ్రీటింగ్ కార్డులు, నాటక ప్రదర్శన చేసిన చిన్నారులను ఎస్పీ అభినందించారు. అనంతరం బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో AR అడిషనల్ ఎస్పీ పాల్గొన్నారు.

News December 22, 2024

 ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు

image

ప్రకాశం జిల్లాలో ఆదివారం మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. జిల్లాలోని ముండ్లమూరు మండలంలో సెకను పాటు భూమి కంపించింది. అదే మండల పరిధిలోని సింగన్నపాలెం, మారెళ్లలోనూ భూ ప్రకంపనలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయితే శనివారం రోజు కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు రోజులుగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

News December 22, 2024

పుష్ప-2 సినిమా చూసి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. నర్సు మృతి

image

దోర్నాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీశైల దేవస్థానం వైద్యశాల నర్సు మల్లిక మృతి చెందారు. శ్రీశైలానికి చెందిన ఆమె.. భర్త, పాపతో కలిసి కర్నూలుకు షాపింగ్ నిమిత్తం నిన్న వెళ్లారు. రాత్రి పుష్ప-2 సినిమా చూసి, తిరుగు పయనమయ్యారు. తెల్లవారుజామున మంచు కారణంగా వారు ప్రయాణిస్తున్న కారు టూరిస్ట్ బస్సును ఢీకొంది. మల్లిక అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త, పాపకు ఏమీ కాలేదని వారి సన్నిహితులు తెలిపారు.

News December 22, 2024

ప్రకాశం: హాస్టల్లోనే ఫార్మసీ విద్యార్థిని ప్రసవం

image

గుంటూరు కలెక్టర్, ఎస్పీ ఆఫీస్‌కి కూత వేటు దూరంలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని ఆడబిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాకు దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్లోనే ప్రసవించడంతో అధికారులు జీజీహెచ్‌కి తరలించారు. ఈఘటనపై కలెక్టర్ నాగలక్ష్మీ హెచ్ డబ్ల్యూఓ జయప్రదను సస్పెండ్ చేసి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. సమీప బంధువు గర్భానికి కారణమని సమాచారం.