India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. మంగళవారం ప్రకాశం భవనం నుంచి మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, సచివాలయాల సేవలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పారిశుద్ధ్యం, స్వామిత్వ సర్వేపై సమీక్షించారు. APMAY 2.0 పథకంతో చేపట్టిన ఇళ్ళ నిర్మాణంలో వేగం పెంచాలన్నారు.

ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. మంగళవారం ప్రకాశం భవనం నుంచి మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్, సచివాలయాల సేవలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పారిశుద్ధ్యం, స్వామిత్వ సర్వేపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. APMAY 2.0 పథకంతో చేపట్టిన ఇళ్ళ నిర్మాణంలో వేగం పెంచాలన్నారు.

అంగన్వాడీల్లోని చిన్నారుల సమగ్ర ఎదుగుదలే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా దృష్టి సారించాలని సీడీపీఓలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు, సిబ్బంది పనితీరుపై మంగళవారం ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. వయసుకు తగినట్లుగా పిల్లల బరువు, ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

సింగరాయకొండ నవోదయకోచింగ్ సెంటర్లో తౌశిక్ మృతి పట్ల తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు దాటినప్పటికీ విచారణలో జాప్యం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ కారణమని వారు బహిరంగంగా చెబుతున్నా.. పోలీసులు వార్డెన్ను విచారించకపోవడం పట్ల వారు ఆందోళన చెందుతున్నారు. వార్డెన్పైనే తమకు అనుమానం ఉందని వారు బహిరంగంగా చెబుతున్నారు.

రైల్వే శాఖ చేపట్టిన గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టులో మరో కీలక అంకం పూర్తయింది. గజూలపల్లి-చెలుమ గ్రామాల మధ్య నిర్మిస్తున్న 320 మీటర్ల పొడవైన సొరంగ మార్గం (టన్నెల్) పనులు దిగ్విజయంగా పూర్తయ్యాయి. సోమవారం ఈ సొరంగం చివరి అడ్డంకిని తొలగించి విజయవంతంగా అనుసంధానం చేశారు. పనులు పూర్తి కావడంతో రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది. రవాణా వ్యవస్థను బలోపేతం చేసేదిశగా ఇది ఒక భారీ మైలురాయిగా నిలవనుంది.

పాకల బీచ్ ఫెస్టివల్లో విశ్రాంతి లేకుండా పనిచేసిన పోలీసు సిబ్బందిని SP హర్షవర్ధన్ సోమవారం అభినందించారు. 2 రోజులపాటు అహర్నిశలు కృషిచేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, ట్రైనీ కానిస్టేబుళ్లు, హోంగార్డుల పనితీరును ఆయన ప్రశంసించారు. సింగిల్ రోడ్డు ప్రవేశ మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, VIP కదలిక సమన్వయం సమర్థవంతంగా చేయడం అభినందనీయమని SP అన్నారు.

పాకల బీచ్ ఫెస్టివల్లో విశ్రాంతి లేకుండా పనిచేసిన పోలీసు సిబ్బందిని SP హర్షవర్ధన్ సోమవారం అభినందించారు. 2 రోజులపాటు అహర్నిశలు కృషిచేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, ట్రైనీ కానిస్టేబుళ్లు, హోంగార్డుల పనితీరును ఆయన ప్రశంసించారు. సింగిల్ రోడ్డు ప్రవేశ మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, VIP కదలిక సమన్వయం సమర్థవంతంగా చేయడం అభినందనీయమని SP అన్నారు.

ప్రకాశం డివిజన్ పరిధిలోని అన్నబోయినపల్లి, చాగళ్లు, దూబగుంట, జె.పంగలూరు, కందలూరు, మర్లపాడు, ఎం. నిడమనూరుతో పాటు 52 చోట్ల BPM, ABPM పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రూ.12 వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. పదో తరగతి పాసైతే చాలు. దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. 52 పోస్టుల ఖాళీల వివరాల కోసం ఇక్కడ <

మార్కాపురం జిల్లా కంభంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా దళితుల బతుకు మారట్లేదు. సకల జనుల సౌభాగ్యం అని నినాదాలు వినిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం గిరిజనుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. 18 ఏళ్ల క్రితం మార్కెట్ యార్డ్ వెనుక వైపు ST/SCలకోసం నిర్మించిన మదర్ థెరిస్సా కాలనీకి ఇప్పటికి కూడా కనీసం నడవడానికి సరైన దారిలేదు. తమ హయాంలో ఎంతో చేశామని చెప్పుకునే పాలకులకు ఇలాంటివి కనపడవా? అనేది ప్రశ్న.

పాకల బీచ్ ఫెస్టివల్కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫెస్టివల్ ప్రాంగణమంతా సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ల నిఘాలో ఉంటుందని ఆయన వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశామని, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
Sorry, no posts matched your criteria.