Prakasam

News December 10, 2024

ప్రకాశం: నకిలీ పెన్షన్లపై అధికారుల దృష్టి

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న నకిలీ పెన్షన్‌లపై అధికారులు దృష్టి పెట్టారు. వికలాంగులు, వృద్ధాప్య తదితర పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ నిర్వహించే ఉత్తర్వులలో భాగంగా.. ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు మండలం చిలకపాడు గ్రామాన్ని ఫైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి మొదటిరోజు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలపై మీరేమంటారో కామెంట్ చేయండి.

News December 9, 2024

పర్చూరు వద్ద ఒకే రోజు నలుగురు మృతి

image

పర్చూరు మండలం అన్నంబట్లవారిపాలెం సమీపంలో బైక్‌పై బీచ్‌కు వెళ్లి వస్తున్న <<14826140>>ముగ్గురిని ఆదివారం ఓ లారీ ఢీకొంది.<<>> ఈ ప్రమాదంలో అత్తా, అల్లుడు అక్కడికక్కడే మృతి చెందగా.. కుమార్తె చికిత్స పొందుతూ చనిపోయింది. అదే ప్రాంతంలో తూమాటి సుబ్బయ్య(74) అనే వ్యక్తి <<14827146>>సైకిల్‌పై వెళ్తుండగా లారీ ఢీకొని మృతి<<>> చెందాడు. ఇలా ఒకే రోజు మండలంలో నలుగురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

News December 7, 2024

ధర్మవరపు సుబ్రహ్మణ్యం అద్దంకి నియోజకవర్గానికి చెందిన వారే

image

తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. నేడు ఆయన వర్ధంతి. బల్లికురవ మండలం, కొమ్మినేనివారిపాలెంలో 1954లో జన్మించిన ఆయన అనారోగ్య కారణంగా 2013, డిసెంబర్ 7న మరణించారు. ఆయన ప్రాథమిక విద్యను తన స్వగ్రామంలో, 6 నుంచి 10వ తరగతి వరకు అద్దంకిలో చదివారు. ఒంగోలు CSR శర్మ కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసించారు.

News December 7, 2024

ప్రకాశం: రెవెన్యూ సదస్సులో 640 అర్జీలు

image

జిల్లా వ్యాప్తంగా తొలిరోజు శుక్రవారం నిర్వహించిన “రెవెన్యూ సదస్సు”లలో 640 అర్జీలు వచ్చాయని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. వీటిలో ఒంగోలు డివిజన్‌లో 273, కనిగిరిలో 230, మార్కాపురంలో 137 వచ్చాయన్నారు. ఈ మొత్తం అర్జీలు 35 రకాల సమస్యలకు సంబంధించినవని ఆమె శుక్రవారం తెలిపారు. మొత్తం అర్జీలలో నాలుగింటిని అప్పటికప్పుడే పరిష్కరించామన్నారు. ప్రజలు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News December 7, 2024

ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన అంబేద్కర్

image

ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత అంబేద్కర్ కే దక్కుతుందని ఎస్పీ దామోదర్ చెప్పారు.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అణగారిన బలహీన వర్గాల అభ్యుదయం కోసం, కుల నిర్మూలన కోసం అంబేద్కర్ ఎంతగానో పాటుపడ్డారన్నారు

News December 6, 2024

కొత్తపట్నం బీచ్ వద్ద చిన్న సైజు విమానం

image

కొత్తపట్నం తీరప్రాంతంలో చిన్న సైజులో ఉన్న గల ఓ విమానాన్ని మెరైన్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో ఈ పరికరం పడింది. విషయం తెలుసుకున్న మెరైన్ సీఐ, ఎస్సైలు గస్తీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ రాజు, రామిరెడ్డి, హోంగార్డు లక్ష్మణ్‌లు తీరానికి వెళ్లి మత్స్యకారుల నుంచి ఆ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

News December 5, 2024

ప్రకాశం: కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గురువారం తీవ్ర విషాద ఘటన జరిగింది. కొనకనమిట్ల మండలం సిద్దవరం శివారులోని నిమ్మతోటలో విద్యుత్ లైన్లు లాగుతుండగా కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు చనిపోయారు. మృతులు పెద్దారవీడుకు చెందిన నాగరాజు (28), రంగారావు(30)గా గుర్తించారు. విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండా పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

News December 5, 2024

ప్రకాశం: సంచలనమైన సర్పంచ్ హత్యకేసు కొట్టివేత

image

2016లో సంచలనమైన సంతమాగులూరు గ్రామ సర్పంచ్ గడ్డం వెంకటరెడ్డి హత్యకేసులో బుధవారం ఒంగోలు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 8 సంవత్సరాలకు పైన న్యాయస్థానంలో విచారణ జరిగిన ఈ కేసులో నేర ఆరోపణకు సంబంధించి సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఒంగోలు సెషన్స్ న్యాయస్థానం న్యాయమూర్తి టి. రాజావెంకటాద్రి సెక్షన్ 235(1) కింద కేసును కొట్టి వేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.

News December 5, 2024

మంత్రి అనితతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకాశం కలెక్టర్

image

విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ యంత్రాంగం ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత అన్నారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. కాన్ఫరెన్స్‌లో హోం మంత్రి మాట్లాడుతూ.. విపత్తుల సమయంలో ప్రాణనష్టం జరగకుండా చూడటం అత్యంత ప్రాధాన్యమన్నారు.

News December 4, 2024

నేడు రాజకీయ ఘనపాటి కొణిజేటి రోశయ్య వర్ధంతి

image

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ సీఎం, రాజకీయ ఘనపాటి కొణిజేటి రోశయ్య మరణించి నేటికీ 3 ఏళ్లు పూర్తయ్యాయి. చీరాల MLAగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రోశయ్య అసెంబ్లీలో వరుసగా 7సార్లు, మొత్తం 15 సార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా రికార్డ్ సృష్టించారు. ఆయన తమిళనాడు కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌గా సేవలను అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఆయన ఒక్కడికే సొంతం.