Prakasam

News October 23, 2024

ఒంగోలు: పశుగణన సర్వే పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

image

ఈ నెల 25 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు “21వ అఖిల భారత పశుగణన” సర్వే చేపట్టబోతున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టరును మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పశుసంవర్థక అధికారి బేబీరాణి సమక్షంలో ఆమె ఆవిష్కరించారు. పశువులకు సంబంధించిన సమగ్ర గణాంకాలు ఉంటే వాటికి సంబంధించిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా రూపొందించగలదని కలెక్టర్ అన్నారు.

News October 22, 2024

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం ఎస్పీ

image

సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. నేషనల్/స్టేట్ హ్యూమన్ రైట్స్ కమీషన్ అసోసియేషన్, అనుబంధ సంస్థల అధికారులమని కాల్స్ చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తే సైబర్ నేరాలకు గురికాకుండా ఉండవచ్చన్నారు. కొందరు నేరగాళ్లు హ్యూమన్ రైట్స్ పేరుతో ఫేక్ వెబ్‌సైట్లు, ఐడీ కార్డ్‌లు, సోషల్ మీడియా గ్రూపులు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.

News October 22, 2024

మార్టూరు మండలంలో వివాహిత దారుణ హత్య

image

మార్టూరు మండలం డేగరమూడిలో ఓ వివాహిత హత్యకు గురైంది. భర్త నుంచి విడిపోయి ఓ వ్యక్తితో సహజీవనం చేసింది. ఈ మధ్య అతనికి దూరంగా తండ్రితో పుట్టింట్లో ఉంటుంది. ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ప్రియుడు ఆదివారం ఆమె ఇంటికి వెళ్లి కత్తితో పొడవగా ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. సీఐ శేషగిరిరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

News October 22, 2024

పోలీసు అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం: ప్రకాశం ఎస్పీ

image

విధినిర్వహణలో, అసాంఘిక శక్తుల చేతిలో అసువులు బాసిన పోలీసు సిబ్బంది సంక్షేమ కోసం జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడు కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విధినిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబ సభ్యులతో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమావేశమయ్యారు. విధినిర్వహణలో మరణించిన సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎస్పీ తెలిపారు.

News October 21, 2024

ప్రకాశం జిల్లాలో నేటి నుంచి అమరవీరుల వారోత్సవాలు

image

నేటి నుంచి 31వ తేదీ వరకు ప్రకాశం జిల్లాలో పోలీసు అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని ప్రకాశం జిల్లా SP దామోదర్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఏటా అమరులైన పోలీసులను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడుతూ.. ఈ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.

News October 21, 2024

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

image

చంద్రశేఖరపురం మండలం డీజీపేటకు చెందిన వృద్ధురాలు డేగ రత్తమ్మ (58) హత్యకు గురైంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం గడ్డికోసం రత్తమ్మ పొలం వెళ్లారు. పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు అమెను హత్యచేసి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, కమ్మలు దొంగిలించారు. సాయంత్రమైనా రత్తమ్మ ఇంటికి రాలేదని స్థానికులు పొలానికి వెళ్లి చూడగా హత్యకు గురైంది. పామూరు CI, చంద్రశేఖరపురం SI ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

News October 21, 2024

ప్రకాశం జిల్లాలో నేటి నుంచి అమరవీరుల వారోత్సవాలు

image

నేటి నుంచి 31వ తేదీ వరకు ప్రకాశం జిల్లాలో పోలీసు అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని ప్రకాశం జిల్లా SP దామోదర్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఏటా అమరులైన పోలీసులను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడుతూ.. ఈ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.

News October 21, 2024

ప్రకాశం: ‘ప్రైవేట్ విద్యా సంస్థల్లో జర్నలిస్ట్ పిల్లలకు 50% రాయితీ’

image

ప్రకాశం జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న జర్నలిస్ట్ పిల్లలకు 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 50శాతం రాయితీ ఇవ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా విద్యా సంస్థలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు విధిగా ఉత్తర్వులు పాటించాలన్నారు. రాయితీ పట్ల జిల్లాలోని జర్నలిస్ట్ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

News October 20, 2024

ప్రకాశం: దీపావళి బాణసంచా అనుమతులు పొడిగింపు

image

దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయించే వ్యాపార అనుమతులకు దరఖాస్తుల గడువును పొడిగించినట్లు DRO శ్రీలత శనివారం తెలిపారు. ఈనెల 22 వరకు గడువు పొడిగించినట్లు డీఆర్వో శ్రీలత తెలిపారు. ఈనెల 29 నుంచి 31 వరకు అమ్మకాలకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగలవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎవరు కూడా అనుమతులు లేకుండా మందులు విక్రయించరాదని అన్నారు.

News October 19, 2024

ఉమ్మడి ప్రకాశం రీజినల్ కోఆర్డినేటర్‌ ఇతనే.!

image

వైసీపీ అధ్యక్షుడు YS జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఏపీలోని పలు జిల్లాలకు ఏడుగురు నాయకులను రీజనల్ కో- ఆర్డినేటర్లుగా నియమించారు. దీనిలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును నియమిస్తూ పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆయన పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.