Prakasam

News January 10, 2025

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: ప్రకాశం కలెక్టర్

image

రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఈ నెల 8వ తేదీతో రెవెన్యూ సదస్సులు ముగిసిన నేపథ్యంలో అన్ని మండలాల తహశీల్దార్లు, మండల సర్వేయర్లతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  రెవిన్యూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు.

News January 10, 2025

వినియోగదారులు అపోహలు విడాలి: ప్రకాశం ఎస్.ఈ

image

విద్యుత్ వినియోగదారుల పిఎం సూర్య ఘర్ యోజన పై అనుమానాలు వీడాలని ప్రకాశం జిల్లా ఎస్.ఈ కట్టా వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. సోలార్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల లాభమే తప్ప నష్టం లేదని స్పష్టం చేశారు. కరెంటు బిల్లు చాలా తక్కువ వస్తుందని, సబ్సిడీ బ్యాంకు లోన్ కూడా లభిస్తుందని వెల్లడించారు. తమ సిబ్బంది వినిగిదారులని కలుస్తారని తెలిపారు.

News January 9, 2025

మార్కాపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

మార్కాపురం కోమటికుంట – జమ్మనపల్లి రోడ్డులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలను టిప్పర్ లారీ ఢీకొట్టి 100 అడుగుల దూరం వరకు ఈడ్చుకొని వెళ్ళింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 9, 2025

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: ప్రకాశం కలెక్టర్

image

రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఈ నెల 8వ తేదీతో రెవెన్యూ సదస్సులు ముగిసిన నేపథ్యంలో అన్ని మండలాల తహశీల్దార్లు, మండల సర్వేయర్లతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  రెవిన్యూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు.

News January 9, 2025

వైకుంఠ ఏకాదశి.. ప్రకాశం ఎస్పీ కీలక ఆదేశాలు

image

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దర్శనం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టామన్నారు.

News January 9, 2025

కొత్త వైరస్.. ఒంగోలు GGHలో 20 బెడ్లు ఏర్పాటు

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎంపీ వైరస్‌ నివారణలో భాగంగా.. ఒంగోలులోని GGHలో 20 బెడ్లు ఏర్పాటు చేశామని, ఎక్స్‌పర్ట్ కమిటీతోపాటు పలు కమిటీలను నియమించామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున తెలిపారు. మగవారికి 10 బెడ్లు, మహిళలకు 10 బెడ్ల చొప్పున ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. డాక్టర్ కళ్యాణి HOD జనరల్ మెడిసిన్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చారు.

News January 9, 2025

ప్రకాశం: ‘రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి’

image

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించి, ప్రభుత్వ ఆసుపత్రి పట్ల మరింత గౌరవాన్ని పెంచే విధంగా వైద్యులు పనిచేయాలని కలెక్టరు తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం కలెక్టర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని (జీజీహెచ్) సందర్శించి అన్నీ విభాగాల హెచ్ఓడిలతో సమావేశమై, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ, అందిస్తున్న వైద్య సేవలపై క్షుణ్ణంగా సమీక్షించారు.

News January 9, 2025

ఇల్లు నిర్మించుకునేవారికి శుభవార్త: బాపట్ల కలెక్టర్

image

బాపట్ల జిల్లాలో అర్హులైన నిరుపేదలందరూ PMAY 2.0 పథకం క్రింద ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని, బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. విజన్ బాపట్ల-2047 అమలు ప్రణాళికపై 14 శాఖల అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించిందన్నారు.

News January 8, 2025

ప్రకాశం జిల్లాలో నేడు మోదీ ప్రారంభించేవి ఇవే..!

image

ప్రకాశం జిల్లాలో వివిధ పనులకు ప్రధాని మోదీ విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. దోర్నాల-కుంట జంక్షన్(రూ.245 కోట్లు), వెలిగోడు-నంద్యాల(రూ.601 కోట్లు) రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుడతారు. అలాగే రూ.108 కోట్లతో గిద్దలూరు-దిగువమెట్ట డబ్లింగ్ పనులకు భూమి పూజ చేస్తారు. రూ.907 కోట్లతో పూర్తి చేసుకున్న 6 వరుసల చిలకలూరిపేట బైపాస్‌ను ప్రారంభిస్తారు.

News January 8, 2025

కొరిశపాడు: చికిత్స పొందుతూ బాలుడి మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం తిమ్మవరం రోడ్డులోని వాటర్ ట్యాంకు వద్ద నివాసం ఉండే దుర్గారావు కుమారుడు నాగరాజు(2) ఇంటి బయట ఆడుకుంటూ నాలుగో తేదీన ఎలుకల పేస్టు తిన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు గుంటూరు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. హాస్పటల్ నుంచి వచ్చిన సమాచారంతో కేసు నమోదు చేశామని మేదరమెట్ల ఎస్ఐ మొహమ్మద్ రఫీ తెలిపారు.