Prakasam

News January 8, 2025

కొరిశపాడు: చికిత్స పొందుతూ బాలుడి మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం తిమ్మవరం రోడ్డులోని వాటర్ ట్యాంకు వద్ద నివాసం ఉండే దుర్గారావు కుమారుడు నాగరాజు(2) ఇంటి బయట ఆడుకుంటూ నాలుగో తేదీన ఎలుకల పేస్టు తిన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు గుంటూరు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. హాస్పటల్ నుంచి వచ్చిన సమాచారంతో కేసు నమోదు చేశామని మేదరమెట్ల ఎస్ఐ మొహమ్మద్ రఫీ తెలిపారు.

News January 8, 2025

RRR కేసులో తులసిబాబుకు మరోసారి నోటీసులు

image

శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసిబాబుకు మంగళవారం మరోసారి నోటీసులు జారీ చేసినట్లు ఎస్సీ దామోదర్ చెప్పారు. ఈనెల 8న ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈనెల 3న హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా గైర్హాజరయ్యాడు.

News January 8, 2025

ప్రకాశం: వైరస్ వల్ల ప్రజలు భయపడకండి: డీఎంహెచ్‌వో

image

బెంగళూరులో hMP వైరస్ కేసు నమోదైన నేపథ్యంలో అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతికి జిల్లాకు వస్తున్నా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు చెప్పారు. మంగళవారం జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా లాగా దీని ప్రభావం ఉండదన్నారు. జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని చెప్పారు.

News January 7, 2025

సంతమాగులూరు: Way2News కథనానికి స్పందించిన మంత్రి లోకేశ్

image

సంతమాగులూరు మండలంలోని ఏల్చూరులో ఈనెల రెండో తేదీన రోడ్డు ప్రమాదం జరిగి బాలుడికి గాయాలయ్యాయి. ఈ కథనం <<15047387>>Way2News<<>>లో ప్రచురితమైంది. ఈ వార్తకు ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ట్విటర్(X) వేదికగా స్పందించారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తన బృందం దానిని పరిశీలించి, సాధ్యమైన సహాయం బాలుడికి చేస్తుందని ట్వీట్ చేశారు.

News January 7, 2025

ప్రకాశం జిల్లా ప్రజలు భయపడకండి: DMHO

image

బెంగళూరులో HMPV కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతికి ప్రకాశం జిల్లాకు రానున్నారు. దీంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాగా దీని ప్రభావం ఉండదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రకాశం జిల్లా DMHO టి. వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.

News January 7, 2025

ప్రకాశం: భయపడుతున్న ఫేక్ లబ్ధిదారులు..!

image

ఉమ్మడి ప్రకాశంలో జిల్లాలోని ఫేక్ పెన్షన్లపై అధికారులు నిన్నటి నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో కొందరిలో టెన్షన్ నెలకొంది. కొండపి మండలంలో నకిలీ వికలాంగుల పెన్షన్‌దారులను గుర్తించేందుకు ఎంపీడీఓ నేతృత్వంలో డాక్టర్లు పర్యటించారు. వీరి రాకను గమనించిన కొందరు నకిలీ పెన్షన్‌దారులు ఇళ్లకు తాళాలువేసి ఊరెళ్లారని తెలుస్తోంది. మరికొందరు కనిపించకుండా పరారయ్యారని సమాచారం.

News January 7, 2025

ప్రకాశం: రోడ్డు ప్రమాదాల్లో ఒకే రోజు ముగ్గురి మృతి

image

ప్రకాశం జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో సోమవారం ముగ్గురు మృతి చెందారు. పోలీసులు వివరాల మేరకు.. ఎదురాళ్లపాడుకులో నాగం గంగమ్మ(42) కారు ఢీకొనడంతో మృతిచెందగా, దర్శి ఓబన్నపల్లికి చెందిన కాశీనాయన రెడ్డి(24) గడ్డి ట్రాక్టర్ ఢీకొని మృతి చెందాడు. ముండ్లమూరులో సుధీర్(18) వరి కోత ర్యాంప్ ఢీకొనగా అక్కడికక్కడే చనిపోయాడు.

News January 7, 2025

ఒంగోలు: కానిస్టేబుళ్ల రాత పరీక్షకు 233 మంది ఎంపిక

image

ఒంగోలులోని పోలీస్ పెరేడ్ మైదానంలో సోమవారం జరిగిన కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో 233 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. మొత్తం 600 మంది అభ్యర్థులకు గాను 319 మంది మాత్రమే హాజరయ్యారు. వారికి ఉదయం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం పలు ఈవెంట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ దామోదర్, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

News January 6, 2025

ఒంగోలు: ‘ఇలా చేస్తే మరణాలను నివారించవచ్చు’

image

ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో సోమవారం జిల్లాలోని ఏఎన్ఎంలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అధిక రక్తపోటు, మధుమేహం, రక్తస్రావంతో బాధపడుతున్న వారిని సరైన సమయంలో గుర్తించి వైద్య సేవలు అందించడం ద్వారా మాతృ మరణాలు, శిశు మరణాలను నివారించవచ్చు అని తెలిపారు.

News January 6, 2025

ప్రకాశంలో మహిళా ఓటర్లే ఎక్కువ.!

image

జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు తన ఛాంబర్ సోమవారం ప్రకాశం జిల్లాకు సంబందించిన 8 నియోజకవర్గాల నూతన ఓటరు లిస్టుల సీడీ కాపీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం పోలింగ్ బూతులు..2183, జిల్లా మొత్తం ఓటర్లు 1819448, పురుషు ఓటర్లు 905885, మహిళా ఓటర్లు 913450, థర్డ్ జండర్ ఓటర్లు 113 మంది అని తెలిపారు. జిల్లా లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నారని తెలిపారు.