Prakasam

News October 19, 2024

ఆ గ్రామాలపై ప్రత్యేక దృష్టి: ప్రకాశం కలెక్టర్

image

భూగర్భజలాలను అధికంగా వినియోగించిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి తిరిగి నీటిమట్టం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. మార్కాపురం మండలంలోని నికరంపల్లిని మోడల్ గ్రామంగా ఎంపిక చేశామన్నారు. ఈ గ్రామంలో భూగర్భ నీటిమట్టం పెంచడానికి తీసుకోవలసిన చర్యలపై శుక్రవారం సాయంత్రం ప్రకాశం భవనంలోని తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో ఆమె ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

News October 18, 2024

ప్రకాశం జిల్లాలో TDP బలోపేతానికి కృషి చేయాలి: CM

image

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నేడు ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని MLA,MPలు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు ఎటువంటి తప్పులు చేసినా సహించేది లేదన్నారు. ప్రజలకు అందుబాటలో ఉండాలన్నారు. 

News October 18, 2024

అద్దంకి వద్ద రోడ్డు ప్రమాదం.. టీచర్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన వినుకొండలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అద్దంకికి చెందిన ఉపాధ్యాయురాలు వినుకొండ మండలం గోకనకొండలో విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా బైక్‌పై స్కూల్‌కు వెళ్తుండగా.. నాగులవరం వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడ్డారు. తలకు బలంగా గాయమై తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 18, 2024

ప్రకాశం: మద్యం మత్తులో భార్య గొంతు కోసిన భర్త

image

కుటుంబ కలహాలతో మద్యం మత్తులో ఓ భర్త తన భార్య గొంతు కోసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాలెంలో పుట్టా వెంకట్రావు, తిరుపతమ్మలకు ఐదేళ్లక్రితం వివాహమైంది. కాగా గురువారం మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తకు తిరుపతమ్మకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తిరుపతమ్మ భర్తను కర్రతో కొట్టగా.. ఆగ్రహించిన భర్త కత్తితో ఆమె గొంతు కోశాడు. దీంతో తిరుపతమ్మ మృతి చెందింది.

News October 18, 2024

ప్రకాశం జిల్లా వాసులకు శుభవార్త చెప్పిన దామచర్ల

image

ప్రకాశం జిల్లా వాసులకు దామచర్ల జనార్దన్ శుభవార్త చెప్పారు. 2014-19 మధ్య TDP ప్రభుత్వంలో ఎందరో పక్కా ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. కాగా చాలావరకు అప్పుడు నిర్మించుకున్న ఇళ్ల బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. త్వరలోనే ఆ బిల్లులను చెల్లిస్తామని దామచర్ల జనార్దన్ ఓ కార్యక్రమంలో హామీ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల వివరాలను సేకరించి త్వరలోనే బిల్లులు మంజూరు చేస్తామన్నారు.

News October 18, 2024

ఒంగోలు: జిల్లాలో 4,155 ఎకరాలలో పంట నష్టం

image

భారీ వర్షాల వలన ప్రకాశం జిల్లాలో 48 గ్రామాలలో 1,706 మంది రైతులకు చెందిన 4,155 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనాలు అందినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా సజ్జ 3,912.5 ఎకరాలు, మినుము 1,142.5 ఎకరాలు, వరి 100 ఎకరాల్లో నష్టం వాటిల్లిన్నట్లు తెలిపారు. పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.

News October 17, 2024

ప్రకాశం జిల్లా వరదస్థితిపై ఆరా తీసిన సీఎం

image

భారీ వర్షాలపై కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలోని తాజా పరిస్థితిని కలెక్టర్ తమీమ్ అన్సారియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంకు వివరించారు. సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, వాగుల ప్రవాహాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ వివరించారు.

News October 17, 2024

ప్రకాశం రీజినల్ కో ఆర్డినేటర్‌గా పెద్దిరెడ్డి

image

ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్గా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నియమితులయ్యారు. వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ స్థానంలో ఉండగా ఆయన వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన విషయం తెలిసిందే.

News October 17, 2024

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ టీం ఏర్పాటు: ఎస్పీ

image

తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ టీంను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. ముగ్గురు అదనపు ఎస్పీలు, నలుగురు డిఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బందితో 18 టీములు ఏర్పాటు చేసినట్లు, ప్రతి టీములో 20 మంది సిబ్బంది, ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ బలగాలు ఉంటాయన్నారు. ఎప్పటికప్పుడు తుఫాను స్థితిని గమనిస్తున్నామన్నారు.

News October 16, 2024

ప్రకాశం జిల్లాలో రేపు కూడా సెలవు

image

ప్రకాశం జిల్లాలో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు రేపు కూడా సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కోరారు.
NOTE: చీరాల, పర్చూరు, కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలకు ఇది వర్తించదు.