Prakasam

News December 20, 2024

మార్కాపురం: కులం పేరుతో దూషణ.. కేసు నమోదు

image

మార్కాపురం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి కె. శ్రీనివాసులును దూషించిన కేసులో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కార్యాలయం లోపలికి వచ్చి విధులకు ఆటంకం కలిగించి, దౌర్జన్యానికి దిగి కులం పేరుతో దూషించినట్లు శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మార్కాపురానికి చెందిన గాలి వెంకటరామిరెడ్డి, పెరుమాళ్ళ సుబ్రహ్మణ్యం (బుల్లి) అనే ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు.

News December 20, 2024

ప్రకాశం: ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!

image

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.

News December 20, 2024

ప్రకాశం: జ్వరాలతో తల్లడిల్లుతున్న రామాయపాలెం

image

మర్రిపూడి మండలం రామాయపాలెంలో కొద్దిరోజులుగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ వైద్యం అందక గత్యంతరం లేక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. రెండు రోజుల్లో ఈ గ్రామం నుంచి 10 మందికి పైగా ఒంగోలులోని కార్పొరేట్ వైద్యశాలల్లో చేరారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని కొందరు గ్రామంలోనే RMPలచే వైద్యం చేయించుకుంటున్నారు. గురువారం మరికొందరు ఒంగోలు ఆసుపత్రులకు వెళ్లినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.

News December 20, 2024

ఒంగోలు: టక్కరి దొంగ బాలుడితో జాగ్రత్త

image

ఒంగోలు నడిబొడ్డులో పట్టపగలే 15 ఏళ్ల బాలుడు టక్కరి దొంగగా మారాడు. పట్టణంలోని ఓ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోగ్రాం కవర్ చేయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల బ్యాగులో నుంచి పర్సులు, చిప్స్ సునాయాసంగా చోరీ చేశాడు. అనంతరం ఫోటోగ్రాఫర్లు తమ బ్యాగులు చెల్లా చెదురుగా పడి ఉండటానికి గమనించి షోరూమ్‌లోని సీసీ కెమెరాలు చెక్ చేశారు. దీంతో బాలుడి ఉదంతం బయటపడింది.

News December 20, 2024

ప్రకాశం: ‘తక్కువ ధరకే ఏపీ ఫైబర్ నెట్వర్క్ సేవలు’

image

పేద, మద్య తరగతి ప్రజలకు ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్స్, ల్యాండ్ ఫోన్ లను అతి తక్కువ ధరకే ఏపి ఫైబర్ నెట్వర్క్ సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ జీవి రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని సీవియన్ రీడింగ్ రూమ్ లో ఉమ్మడి ప్రకాశం జిల్లా APSFL కేబుల్ ఆపరేటర్లతో ఆయన సమావేశం నిర్వహించారు.కేబుల్ ఆపరేటర్ల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానని తెలిపారు.

News December 19, 2024

ప్రకాశం: ‘నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలి’

image

నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించి సమాజంలో పేదరికాన్ని నిర్మూలించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని  సాధించేలా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయటంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపట్టిన కార్యక్రమాల అమలులో పురోగతిపై సంబంధిత అధికారులతో గురువారం ఆమె ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.

News December 19, 2024

 అధికారులు సంసిద్ధం కావాలి: ప్రకాశం కలెక్టర్

image

సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీకి అధికారులు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాపై నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. యువ ఓటర్ల నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సాధారణ జనాభాకు ఓటర్ల జాబితా నిష్పత్తిని సరి చూసుకోవాలన్నారు.

News December 19, 2024

మార్కాపురం: భార్యపై భర్త గొడ్డలితో దాడి

image

అనుమానంతో భార్యపై గొడ్డలితో దాడి చేసిన ఘటన మార్కాపురంలోని ఏకలవ్య కాలనీలో జరిగింది. దోర్నాల మండలం చిన్నగుడిపాడులో VROగా పనిచేస్తున్న చిన్న కొండయ్య, మరియమ్మ దంపతులకు కొన్నేళ్లుగా మనస్పర్ధలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెపై అనుమానం పెంచుకున్న చిన్న కొండయ్య తెల్లవారుజామున గొడ్డలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన మరియమ్మను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడు పెద్దారవీడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

News December 19, 2024

మర్రిపూడి: చనిపోయిన వారి పేరుతో డబ్బులు నొక్కేశారు

image

మర్రిపూడి మండలంలో ఉపాధి హామీ పనుల్లో మృతుల పేర్లతో నిధులు స్వాహా చేశారు. ఈ ఉదంతం బుధవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో డ్వామా PD జోసెఫ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజావేదికలో వెలుగులోకి వచ్చింది. మండలంలో 569 పనులుకు రూ.7,52,57,643 ఖర్చు చేసినట్లు చెప్పారు. కొన్ని గ్రామాల్లో జరిగిన ఉపాది పనుల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించి ప్రజావేదిక దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన PD నిధులు రికవరీకి ఆదేశించారు.

News December 19, 2024

ఒంగోలు బస్టాండ్‌లో డాగ్ స్క్వాడ్

image

ఒంగోలులోని బస్టాండ్ వద్ద బుధవారం రాత్రి ఎస్పీ దామోదర ఆదేశాల మేరకు పోలీసులు డెమో డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీ అశోక్ బాబు, డీఎస్పీ శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద ఎక్స్ ప్లోజీవ్ బ్యాగును ఉంచి, డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా డెమో డ్రిల్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.