Prakasam

News September 26, 2024

ప్రకాశం: కేజీబీవీల్లో సిబ్బంది నియామకానికి దరఖాస్తులు

image

జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బందిని ఒప్పంద, అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపడుతున్నట్లు డీఈవో డి. సుభద్ర పేర్కొన్నారు. బోధనా సిబ్బందిని ఒప్పంద విధానంలో, బోధనేతర సిబ్బందిని అవుట్ సోర్సింగ్ కింద 2024-25 సంవత్సర కాలానికి భర్తీ చేస్తామన్నారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో రూ.250లు చెల్లించి దరఖాస్తు చేయాలన్నారు.

News September 26, 2024

నేడు జనసేనలోకి బాలినేని

image

మాజీ మంత్రి బాలినేని ఇవాళ జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారీ బహిరంగ సభ పెట్టి తనతో పాటు తన అనుచరవర్గంతో కలిసి జనసేనలో చేరుతానన్నారు. అయితే ప్రస్తుతం ఒంగోలులో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా ఒక్కరే వచ్చి పార్టీలో చేరాలని జనసేన పెద్దలు ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది.

News September 26, 2024

ఒంగోలు: ‘బాలినేని అక్రమాలను డిప్యూటీ సీఎం పవన్ గుర్తించాలి’

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అవినీతి గురించి తెలుసుకోవాలని టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్య ప్రకాశ్ రెడ్డి కోరారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు సంవత్సరాల్లో బాలినేని చేసిన అవినీతికి సాక్ష్యాలు చూపిస్తామని తెలిపారు. బాలినేనిని జనసేనలోకి చేర్చుకోవడం వల్ల జనసేన పార్టీ విలువలకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.

News September 26, 2024

MP మాగుంటను ఫోన్‌ ద్వారా పరామర్శించిన చంద్రబాబు

image

మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి, మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట పార్వతమ్మ మరణించిన విషయం తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న CM నారా చంద్రబాబు నాయుడు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఫోన్ చేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ప్రభుత్వం తరఫున మంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో పార్వతమ్మకి అంత్యక్రియలు ఏర్పాటు చేస్తామని కుటుంబ సభ్యులకు తెలిపారు.

News September 25, 2024

కనిగిరి మండలంలో బాలుడు ఆత్మహత్య

image

కనిగిరి మండలం మాచవరంలో ఉరి వేసుకుని బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతుడి పెదనాన్న ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతున్న మధుసూదన్ (14) మాచవరంలోని అమ్మమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News September 25, 2024

మాగుంట పార్వతమ్మ మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

image

ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ మృతికి సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. మాజీ ఎంపీ పార్వతమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెందడం బాధాకరమన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా విశేషసేవలందించారని కొనియాడారు. ఒంగోలు, నెల్లూరు జిల్లాల రాజకీయాల్లో మాగుంట కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. దశాబ్దాలుగా ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ స్థానిక ప్రజలతో మాగుంట కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు.

News September 25, 2024

అభివృద్ధిలో మాగుంట కుటుంబానికి చెరగని ముద్ర: మంత్రి

image

మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ మృతి బాధాకరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పార్వతమ్మ ఒంగోలు ఎంపీగా నాడు జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, జిల్లా అభివృద్ధిలో మాగుంట కుటుంబం చెరగని ముద్ర వేసిందని అన్నారు. మాగుంట పార్వతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

News September 25, 2024

మాగుంట పార్వతమ్మ రాజకీయ నేపథ్యం ఇదే..

image

ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో 1947 జూలై 27న జన్మించారు. 1967న మాగుంట సుబ్బరామ రెడ్డితో వివాహం జరిగింది. 1996 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఒంగోలు నుంచి పోటీ చేసి గెలిచి 11వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

News September 25, 2024

మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు నెల్లూరులో

image

ఒంగోలు మాజీ MP మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి, కావలి మాజీ MLA మాగుంట పార్వతమ్మ నేడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె పార్థివదేహాన్ని నెల్లూరు జిల్లా సరస్వతినగర్‌లోని ఆమె స్వగృహానికి తీసుకెళ్లనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. మాగుంట అభిమానుల సందర్శనార్థం రేపు మధ్యాహ్నం వరకు వారి స్వగృహంలో ఉంచుతారు. 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

News September 25, 2024

ప్రకాశం జిల్లా నేతలకు కీలక పదవులు

image

ప్రకాశం జిల్లాలో నలుగురు కూటమి నేతలకు కీలక పదవులు దక్కాయి.
1. ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్- దామచర్ల సత్యనారాయణ
2. నూకసాని బాలాజీ – ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్
3. లంకా దినకర్ – 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్
4. పాకనాటి గౌతమ్ రాజు- ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ సభ్యుడు