India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీశైలంలో ఆదివారం అర్ధరాత్రి మార్కాపురం వాసి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బతుకుతెరువు కోసం శ్రీశైలానికి వెళ్లిన ఆవుల అశోక్(32)ను ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో శనివారం రాత్రి అతడిని గొంతు కోసి దారుణ హత్య చేశారని తెలిపారు. ఆదివారం ఉదయం పేపర్లు ఏరుకునే వారు రక్తపు మడుగులో ఉన్న యువకుడిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారించి కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీలో పదో తరగతి, ఇంటర్ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 28వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. రూ.300 అపరాధ రుసుముతో ఈనెల 30 వరకు ఆన్లైన్లో అడ్మిషన్లు పొందవచ్చని డీఈఓ పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లు ఈ విషయాన్ని గమనించి అడ్మిన్ల సంఖ్య పెంచాలని డీఈవో తెలిపారు.
రైతుసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకాశం జిల్లాలో ఈనెల 24 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తమిమ్ అన్సారియా ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు వ్యవసాయ అధికారులు సూచించే పద్ధతులపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి మంగళ, బుధవారాల్లో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తారన్నారు.
‘జై జనసేన, వెల్కమ్ బాస్’ అంటూ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభిమానులు దర్శి పట్టణంలో ఫ్లెక్సీలు కట్టారు. ఇటీవల పవన్ కళ్యాణ్ను కలిసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈనెల 26న జనసేనలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శిలో ఉన్న బాలినేని అభిమానులు దర్శిలో జనసేన ఫ్లెక్సీలు కట్టారు.
లడ్డు వివాదాన్ని కావాలనే సృష్టించి రాజకీయాల కోసం వాడుకుంటున్నారా? అని X వేదికగా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ స్పందించారు. రాష్ట్రంలో మత కల్లోలాలను సృష్టించడానికి CBN యత్నిస్తున్నారన్నారు. దీనికి పవన్ కళ్యాణ్ ఆజ్యం పోస్తున్నారా.. అని ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రశాంతమైన రాష్ట్రాన్ని వల్లకాడు చేయాలనుకుంటున్నారా అని Xలో పోస్ట్ చేశారు. బీజేపీ పేరుతో YCP పార్టీ కార్యాలయంపై దాడి హేయమన్నారు.
మార్కాపురంలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనబడిన వ్యక్తిని మార్కాపురం ఎస్సై సైదుబాబు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారణ చేయగా.. సదరు వ్యక్తిది సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామానికి చెందిన శేషమ్మ కుమారుడు శ్రీహరిగా తెల్సింది. 20 సంవత్సరాల కిందట తప్పిపోయిన అతను తన కుమారుడేనని తల్లి తెలిపింది. ఇన్నేళ్ల తర్వాత తమ కుమారుడి ఆచూకీ లభించడంపై ఆమె ఆనందం వ్యక్తం చేసి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
▶ ఒంగోలు 1 టౌన్ – టి. త్యాగరాజు, పి. శివ నాగరాజు, జి. సుబ్రహ్మణ్యం
▶ ఒంగోలు 2 టౌన్ – అబ్దుల్ రెహమాన్, శివనాంచారయ్య
▶ ఒంగోలు 2 టౌన్ అటాచ్ DCRB – సుబ్బారావు
▶ ఒంగోలు తాలూకా – హరి బాబు, సందీప్
▶ ఒంగోలు తాలూకా అటాచ్ PCR – ఫిరోజ్, అనిత
▶ ఒంగోలు తాలూకా అటాచ్ DCRB – శ్రీనివాసరావు
▶ ఒంగోలు PCR – పి.రాజేశ్
▶ DCRB ఒంగోలు – వెంకటేశ్వరరావు
▶ పుల్లలచెరువు – సంపత్ కుమార్
▶ గిద్దలూరు – ప్రభాకర్ రెడ్డి
ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. డిస్ట్రిక్ట్ వీఆర్లో ఉన్న 14 మంది, పుల్లల చెరువు ఎస్సైను బదిలీ చేస్తూ ఎస్పీ దామోదర్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. వారందరినీ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల్లో పోస్టింగ్ ఇస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.
కనిగిరి మండలంలోని నేలటూరి గొల్లపల్లిలో విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి మాలకొండయ్య సచివాలయం సమీపంలో ఉన్న బోరు మోటర్ వద్ద విద్యుత్ వైరు తెగిపడి ఉండడంతో కటింగ్ బ్లేడుతో జాయింట్ చేసే క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఒంగోలుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి, ప్రకాశం జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి యన్ వెంకటేశ్వర్లును జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, కలెక్టర్ తమిమ్ అన్సారీయా, జిల్లా జడ్జీ భారతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం వారు జిల్లాలోని పలు విషయాల గురించి చర్చించారు.
Sorry, no posts matched your criteria.