Prakasam

News June 3, 2024

మార్టూరు: మద్యం మత్తులో యువకుడిపై దాడి

image

మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన మార్టూరులో చోటుచేసుకుంది. వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో మస్తాన్ అనే యువకుడు కళ్యాణ్ అనే వ్యక్తిపై బీరు సీసాతో తలపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ కళ్యాణిని 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అర్బన్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

News June 3, 2024

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో TDP-9, YCP-2

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి RTV ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. వీరి ప్రకారం TDP-9, YCP-2, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుస్తుందని తెలిపారు. దర్శి, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి స్థానాల్లో TDP పాగా వేస్తుందని, కందుకూరు, వై.పాలెంలో YCP గెలిచే అవకాశం ఉందన్నారు. కాగా చీరాలలో ఆమంచి గెలుస్తారన్నారు. దీంతో TDP శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News June 3, 2024

ప్రకాశం: చెరువులో పడి 13 ఏళ్ల బాలుడు మృతి

image

కురిచేడు మండలం పడమరకాశీపురంలో చెరువులో పడి ఓ బాలుడు మృతి చెందాడు. సోమవారం గ్రామానికి చెందిన సాధం బంగారు(13) తమ గేదెలను తోలుకొని మేతకు వెళ్ళాడు. గేదెలకు నీళ్లు తాగించడానికి చెరువులోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో చెరువులోకి దిగిన గేదెలను తోలేందుకు వెళ్ళగా.. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు బాలుడి మృతదేహాన్ని చెరువులో నుంచి బయటికి తీశారు.

News June 3, 2024

చెవిరెడ్డి గెలుస్తారు: ఆరా

image

ఒంగోలు YCP MP అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుస్తారని ఓ ఇంటర్వ్యూలో ఆరా సర్వే సంస్థ ప్రతినిధి మస్తాన్ చెప్పుకొచ్చారు. దీనికి కారణం.. మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి YCPకి బలమైన నియోజకవర్గాలు కాబట్టి ఒంగోలు ఎంపీగా గెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాగే చీరాల, ఒంగోలులో వైసీపీ విజయం సాధిస్తుందని, కొండపిలో ఓడిపోతుందని, కందుకూరు, అద్దంకిలో టైట్ ఫైట్ ఉండబోతోందని తెలిపారు.

News June 3, 2024

ఒంగోలు: కుమారుడిని కాల్చి చంపిన తండ్రి అరెస్ట్

image

కుమారుడిని తుపాకీతో కాల్చిచంపిన కానిస్టేబుల్‌ను 302 సెక్షన్ కింద ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏఆర్ కానిస్టేబుల్ కొదమల ప్రసాద్ బాబు గార్డ్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ప్రసాద్ కుమారుడు శేషుకమల్ జీతం డబ్బులు డ్రా చేసుకొని ఇంట్లో ఇవ్వమని తండ్రిని అడగ్గా.. ప్రసాద్ నిరాకరించాడు. దీంతో మాటామాటా పెరిగి.. కోపంతో తన సర్వీస్ రివాల్వర్‌తో శేషును కాల్చడంతో శేషుకుమార్ చనిపోయాడు.

News June 3, 2024

బాల కార్మికుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు కేంద్రంలోని కలెక్టరేట్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఈనెల 1 నుంచి 30 వరకు జరిగే ప్రత్యేక తనిఖీల కార్యక్రమాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. బాల కార్మికులు ఎక్కడైనా పనిచేసినట్లయితే పోలీసు నంబరు 100 లేదా చైల్డ్ లైన్‌కు సమాచారం అందించాలని సూచించారు.

News June 2, 2024

ప్రకాశం: కౌంటింగ్ ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష

image

కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా జరిగేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్, రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్లోని స్పందన హాలులో రిటర్నింగ్ అధికారులతో సమావేశమై కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఉదయం 5 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని, కౌంటింగ్ హాలులోకి సెల్ఫోన్లు అనుమతించవద్దన్నారు.

News June 2, 2024

మార్కాపురంలో కూటమి అభ్యర్థుల సమావేశం

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా కూటమి అభ్యర్థులు ఆదివారం మార్కాపురంలోని కందుల నారాయణరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. తాజా ఎన్నికల అంశాలు, భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతుందని, చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నారని వారు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News June 2, 2024

చీరాల అభ్యర్థులకు నోటీసులు జారీ చేసిన డీఎస్పీ

image

ఓట్ల లెక్కింపు రోజు పాటించాల్సిన నియమ నిబంధనలపై పోటీలో ఉన్న అభ్యర్థులకు చీరాల DSP బేతపూడి ప్రసాద్ ఆదివారం నోటీసులు జారీ చేశారు. ఆ రోజున నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున నేతలు, కార్యకర్తలతో ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేయరాదన్నారు. ప్రత్యర్థులనుద్దేశించి ఎలాంటి విమర్శలు లేదా రెచ్చగొట్టే ప్రకటనలు చేయరాదన్నారు. అభ్యర్థుల ఇళ్లలో వారివారి కుటుంబ సభ్యులు తప్ప ఇతరులు ఉండరాదన్నారు. పోలీసులకు సహకరించాలని కోరారు.

News June 2, 2024

ఒంగోలు: దర్గాలో పూజలు చేసిన టీడీపీ నేతలు

image

టీడీపీ కూటమి అఖండ విజయం సాధించాలని కోరుతూ ఆదివారం తర్లుపాడు మండలం తుమ్మలచెరువులోని దర్గాలో టీడీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వీరిలో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్, గొట్టిపాటి రవికుమార్, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అశోక్ రెడ్డి, గూడూరి తదితరులు దర్శించుకున్నారు.