India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
IPL మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న దోర్నాలకు చెందిన మనీశ్ రెడ్డి రూ.30 లక్షల బేస్ ఫ్రైస్తో రిజిస్టర్ చేసుకున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్లో మన ప్రకాశం జిల్లా ఆటగాడు వేలంలో ఎంత మేరకు పలకొచ్చని అనుకుంటున్నారు. ఏ టీమ్కు సెలెక్ట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.
సంతనూతలపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురించి ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. పిల్లల్లో అభ్యాస శక్తిని పెంపొందించాలని సూచించారు.
మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా ఒంగోలులో BJP నాయకులు శనివారం రాత్రి బాణసంచాలు కాల్చి సంబరాలు జరిపారు. ముందుగా ఒంగోలులో ర్యాలీ నిర్వహించిన నాయకులు మహారాష్ట్రలో బీజేపీ హ్యాట్రిక్ సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం చర్చి కూడలి వద్ద బాణసంచాలో కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెద్దారవీడు మండలం గుండంచర్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. పశువులను మేతకోసం తీసుకువచ్చిన సందర్భంలో.. అటవీశాఖ అధికారులు తమపై దాడి చేశారని పశువుల కాపర్లు ఆరోపించారు. పశువుల కాపరి వెంకటేశ్వర్లును అటవీశాఖ అధికారులు కొట్టడంతో గాయాలయ్యాయని మార్కాపురం ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అయితే అటవీశాఖ అధికారులు తమపైనే పశువుల కాపర్లు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కూటమి ప్రభుత్వం ఆర్థిక దోపిడీ చేయడానికి PAC ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వలేదని యర్రగొండపాలెం MLA తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ‘పీయూసీ కమిటీ మెంబర్గా నామినేషన్ వేసిన నేనంటే చంద్రబాబు కుమారుడికి ఎందుకంత భయం? ఎందుకు ఇన్నిన్ని కేసులు పెడుతున్నారు? దళితులకు ఇచ్చే ప్రాధాన్యం ఇదేనా? మాదిగ జాతి బిడ్డలను ఇలా హింసించడం దారుణం. చంద్రబాబును దెబ్బకు దెబ్బ తీస్తాం’ అని ఎమ్మెల్యే హెచ్చరించారు.
మధ్యాహ్న సమయంలో మాత్రమే దొంగతనాలు చేసే వ్యక్తి తిరుపతి పోలీసులకు చిక్కాడు. ప్రకాశం(D) సింగరాయకొండ(M) సోమరాజుపల్లికి చెందిన గురువిళ్ల అప్పలనాయుడు(29), చెడు అలవాట్లకు బానిసై 16వ ఏట నుంచి దొంగతనాలు చేస్తున్నాడు. విమానాల్లో తిరుగుతూ.. ఎంజాయ్ చేస్తుంటాడు. తిరుపతిలోని ఓ ఫైనాన్స్ ఆఫీసులో ఈనెల 15న రూ.8 లక్షలు దొంగలించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరాయకొండ, ఒంగోలు, విశాఖలో ఇతనిపై 18 కేసులు ఉన్నాయి.
అసెంబ్లీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ) సభ్యుల ఎన్నికకు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈయన వైసీపీ నుంచి యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా 5477 ఓట్లతో గూడూరి ఎరిక్షన్ బాబుపై గెలిచారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఈయన ఒకరు.
పట్టణాలు, గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను గుర్తించడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం ఎస్పీ దామోదర్ సూచించారు. ప్రజలు, విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల పర్యవసనాలు, గుడ్, బ్యాడ్ టచ్, రోడ్డు ప్రమాదాల నివారణలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు ఎస్పీ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఊచలు లెక్కపెట్టక తప్పదని మంత్రి స్వామి అన్నారు. మంగళవారం విశాఖలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీస్ కమిషనర్తో మాట్లాడి ఘటనకు సంభందించిన వివరాలు తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేశించినట్లు తెలిపారు. ఫిర్యాదు వచ్చిన గంటలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
శానసమండలిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ గత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మిగులు విద్యుత్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ రంగం సంక్షోభంలో చిక్కుకుందన్నారు.అవగాహన, ముందు చూపు లేని సీఎం వల్ల విద్యుత్ శాఖలో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు, పెరగనున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా అడుగులేస్తోందన్నారు.
Sorry, no posts matched your criteria.