India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు – కృష్ణాకెనాల్ జంక్షన్ మధ్య రోలింగ్ కారిడార్ బ్లాక్ పనుల కారణంగా ఈ నెల 1 నుంచి 14వ తేదీ వరకు జన శతాబ్ది రైలును దారి మళ్లించినట్లు గుంటూరు డీఆర్ఎం రామకృష్ణ పేర్కొన్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ (గుంటూరు) వెళ్లడానికి ఈ రైలును ఎక్కువగా వినియోగించుకుంటారు. జన శతాబ్ది ఎక్స్ప్రెస్ ను తెనాలి నుంచి నేరుగా విజయవాడకు మళ్లిస్తామన్నారు.
అద్దంకి పట్టణంలో ఆదివారం మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఏల్చూరు గ్రామానికి చెందిన కుంచాల మంజుల అనే మహిళ కొంతకాలంగా అద్దంకిలో ఉంటున్నారు. అయితే ఆమె కుటుంబ కలహాల నేపథ్యంలో పట్టణంలో జ్యూస్ సెంటర్ వద్దకు వచ్చి ఆపిల్ జ్యూస్లో వాస్మాయిల్ కలుపుకొని తాగింది. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఆమెను హుటా హుటిన అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు.
ఒంగోలు MPగా YCP అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుస్తారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి ఓడిపోతారని సీప్యాక్ సర్వే ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది. అలాగే బాపట్ల MP అభ్యర్థిగా నందింగం సురేశ్ విజయం సాధిస్తారని పేర్కొంది. నెల్లూరు ఎంపీగా విజయసాయి రెడ్డి విజయం సాధిస్తారని తెలిపింది. ఉమ్మడి జిల్లాలోని 3 ఎంపీ స్థానాల్లో వైసీపీ సొంతం చేసుకుంటాయన్న ఈ సర్వేపై మీ COMMENT.
బల్లికురవ మండలంలోని కొప్పెరపాడు వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొప్పెరపాడు గ్రామానికి చెందిన పిచ్చయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న బల్లికురవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రజలు టీడీపీకే పట్టం కట్టారని చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 12 స్థానాల్లో కూటమి 7 సీట్లు గెలుస్తుందని, రెండు చోట్ల ఎడ్జ్ ఉన్నట్లు పేర్కొంది. ఇదే క్రమంలో వైసీపీకి ఒక సీటు వస్తుందని, మరో చోట ఎడ్జ్ ఉంటుందని పేర్కొంది. మిగిలిన ఒక చోట రెండు పార్టీలకు టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది. ఈ సర్వేపై మీ COMMENT.
ఒంగోలు ఒకటో కొనుగోలు కేంద్రంలో శనివారం పొగాకు వేలాన్ని నిర్వహించారు. చిలకపాడు రైతులు 1,330 బేళ్లను తీసుకురాగా.. వ్యాపారులు 1,247 బేళ్లను కొనుగోలు చేశారు. కిలో గరిష్ఠ ధర రూ.360, కనిష్ఠం రూ.205.. సగటున రూ.296.06 లభించింది. వేలంలో మొత్తం 25 కంపెనీలు పాల్గొన్నాయి. బోర్డు సూపరింటెండెంట్ రవికాంత్ పర్యవేక్షించారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికమని వేలం నిర్వహకులు తెలిపారు.
ఓట్ల పండగ ముగిసినప్పటి నుంచి ఊరు..వాడా ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. కాగా ఉమ్మడి ప్రకాశంలోని 12 స్థానాలకు సంబంధించి పలు సర్వే సంస్థలు ఫలితాలను అంచనావేశాయి. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ కూటమికి 9, YCPకి 2, ఒకటి టఫ్ ఫైట్ ఉంటుందని, కేకే సంస్థ కూటమి-11, YCP-1 గెలుస్తాయని సర్వేలో పేర్కొన్నాయి. ఇదే తుది ఫలితం కాకపోయినప్పటికీ ఓ అంచనా వచ్చేందుకు దోహదపడుతోంది. ఇంతకీ మీ అంచనా ఏంటి..?
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 సీట్లకు గాను NDA కూటమి 7- 8 గెలుస్తుందని బిగ్టీవీ సర్వే తెలిపింది. 4-5 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి 2-4 స్థానాల్లో, కూటమికి 8-10 స్థానాల్లో విజయం సాధిస్తుందని పోస్ట్పోల్ సర్వే తెలిపింది. మరోవైపు జిల్లాలోని ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ స్థానంలో టీడీపీ గెలవనున్నట్లు చాణక్య ఎక్స్ PR సర్వే పేర్కొంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకుగాను కూటమి 8, వైసీపీ 3 చోట విజయం సాధిస్తుండగా.. 1 చోట టఫ్ ఉండనుందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొంది. అలాగే కూటమి 11, వైసీపీ 1 స్థానంలో విజయం సాధిస్తుందని కే.కే సర్వే తెలిపింది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. దీనిపై మీ కామెంట్.
Sorry, no posts matched your criteria.