India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఫేక్ ప్రొఫైల్ DPలతో అపరిచిత ఫోన్ నంబర్ల నుంచి వచ్చే నగదు అభ్యర్థనలకు స్పందించవద్దని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ బుధవారం తెలిపారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదుచేయాలని సూచించారు. స్నేహితుల ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ల DPలుగా పెట్టుకొని మోసాలకు పాల్పడతారని, అటువంటి వారిపై జాగ్రత్తగా ఉండాలన్నారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి 1999నుంచి చాలా ఏళ్లు ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించారు. కాంగ్రెస్, వైసీపీలోనూ ఆయన హవా కొనసాగింది. కాగా, YCP ప్రభుత్వ హయాంలో క్యాబినేట్ విస్తరణలో మంత్రి పదవి కోల్పోవడం, ఆయన సూచించిన వారికి టికెట్లు ఇవ్వకపోవడంతో పార్టీ అధిష్ఠానంపై బాలినేని అసంతృప్తిగా ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. మరోవైపు, తాజా ఎన్నికల్లో ఓటమి, ఇతరత్రా కారణాలతో ఆయన వైసీపీని వీడినట్లు తెలుస్తోంది.
చీరాల నియోజకవర్గంలో ఐటీ హబ్ ఏర్పాటుచేయాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మంత్రి నారా లోకేష్ను కోరారు. బుధవారం ఆయన మంత్రిని కలిసి హబ్ ఏర్పాటుకు సంబంధించిన వసతుల గురించి తెలియజేశారు. హబ్ ఏర్పాటైతే స్థానిక యువతకు ఉపాధి కూడా లభిస్తుందన్నారు. ఈ అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి హబ్ ఏర్పాటుకు కృషిచేస్తామని లోకేశ్ తెలిపారు.
అర్హులైన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన- 2.0 పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలో విడుదల చేశారు. ఒంగోలులోని ప్రకాశం భవనం నుంచి కలెక్టర్, లబ్ధిదారులు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల మంజురు పత్రాలను కలెక్టర్ అందజేశారు.
అర్హులైన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన- 2.0 పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలో విడుదల చేశారు. ఒంగోలులోని ప్రకాశం భవనం నుంచి కలెక్టర్, లబ్ధిదారులు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల మంజురు పత్రాలను కలెక్టర్ అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిస్షిప్ చేసేందుకు ఆసక్తి గల ఐటీఐ ఉత్తీర్ణుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఒంగోలు ప్రజా రవాణా అధికారి బి.సుధాకర్రావు తెలిపారు. <
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అల్బెండజోల్ మాత్రల పంపిణీ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. జిల్లాలో ఒకటి నుంచి 19 ఏళ్లలోపు వారు 5,96,751 మంది ఉన్నారని చెప్పారు. అల్బెండజోల్ మాత్రలను వైద్య సిబ్బందితో మంగళవారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. మంగళవారం మాత్రలు వేసుకోలేని వారు ఉంటే ఈనెల 25న మాప్-అప్ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఒంగోలు రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 01 వరకు, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాకు చెందిన 19- 45 ఏళ్ల వయస్సు గల నిరుద్యోగ మహిళలు అర్హులని అన్నారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. వివరాలకు 4/11, భాగ్య నగర్, దామచర్ల సక్కుబాయమ్మ కాలేజ్ ఒంగోలులో సంప్రదించాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలెవరూ పోషకాహార లోపంతో బాధపడకూడదని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రకాశం భవనంలో ఐసీడీఎస్ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోషకాహార లోపంతో ఉన్న పిల్లలను గుర్తించి, వయస్సుకు తగినట్టుగా ఎత్తు, బరువు ఉండేలా తగిన ఆహారం అందించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం కచ్చితంగా అందేలా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
ఆస్పత్రులలో పారిశుద్ధ్యం, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆయా ఆస్పత్రుల వారీగా ఉన్న సిబ్బంది విధుల కేటాయింపు, పారిశుద్ధ్యం, భద్రత, వివిధ పనులలో పురోగతిపై చర్చించారు. హెచ్.డి.ఎస్. నిధుల లభ్యత, ఎన్.టి.ఆర్. వైద్య సేవలు లభిస్తున్న తీరు తదితరాలపై సమీక్షించారు.
Sorry, no posts matched your criteria.