Prakasam

News May 31, 2024

యర్రగొండపాలెంలో జర్నలిస్టు మృతి

image

యర్రగొండపాలెంలో సీనియర్ జర్నలిస్టు షేక్ కలీం శుక్రవారం ఉదయం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయన స్వగృహానికి వెళ్లి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రెస్ క్లబ్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో పాత్రికేయులు వలి సాహెబ్, బాజీ, రసూల్ ఖాన్, నాగేష్, గణేశ్, కొండయ్య, అజహర్, తదితరులు పాల్గొన్నారు.

News May 31, 2024

చీమకుర్తి: రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి

image

చీమకుర్తిలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ఇసుక వాగుకు చెందిన గుంటూరు రమేశ్ (43) పొదిలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తూర్పు బైపాస్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో సీఐ దుర్గాప్రసాద్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 31, 2024

చీమకుర్తి: ట్రైయాంగిల్ లవ్ స్టోరీ.. యువతి సూసైడ్

image

బెంగళూరుకు చెందిన ఇంపాన(23), చేతన్ ల మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. వీరికి పెద్దలు పంచాయతీ చేసి నగదు ఇచ్చేలా ఒప్పందం రాయించారు. తరువాత చేతన్ మరొకరిని వివాహం చేసుకుని చీమకుర్తిలో బేకరీ నిర్వహిస్తున్నాడు. బుధవారం చీమకుర్తికి వచ్చిన ఇంపాన పెళ్లి చేసుకోవాలని చేతన్‌ను అడగ్గా, ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

News May 31, 2024

దోర్నాల: టిప్పర్‌ను ఢీ కొట్టిన బైకు.. వ్యక్తి స్పాట్‌డెడ్

image

దోర్నాల మండలం యడవల్లి గ్రామ సమీపంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. వెంకటేశ్వర నాయుడు బైకుపై వెళ్తున్న నేపథ్యంలో వాహనం అదుపుతప్పి టిప్పర్‌ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణాలు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 31, 2024

కనిగిరి: గుండెపోటుతో బస్సులో ఫొటోగ్రాఫర్ మృతి

image

ఒంగోలు నుంచి కనిగిరికి వస్తున్న ఆర్టీసీ బస్సులో వెలిగండ్ల మండలం అగ్రహారానికి చెందిన ఫొటోగ్రాఫర్ రామకృష్ణ గుండెపోటుతో మృతి చెందారు. ఒంగోలులో చదువుతున్న తన కుమార్తెను చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కనిగిరి డిపోలో ఆర్టీసీ డ్రైవర్ వెళ్లి చూడగా.. సీటులో పడిపోయి ఉన్నాడు. రామకృష్ణను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 31, 2024

అద్దంకి: మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ

image

అద్దంకికి చెందిన మహిళ బుధవారం సాయంత్రం స్నానం చేస్తోంది. ఇదే సమయంలో పక్కింటి బాలుడు ఆమెను వీడియో తీశాడు. దీన్ని గుర్తించిన మహిళ కుటుంబ సభ్యులు అతడ్ని నిలదీశారు. తొలుత తాను అలాంటి చర్యలకు పాల్పడలేదని బుకాయించినప్పటికీ అనంతరం మొబైల్ పరిశీలించగా దృశ్యాలు కనిపించడంతో చేసిన తప్పును అంగీకరించాడు. ఆమేరకు మహిళ బంధువులు పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News May 30, 2024

అలా స్టిక్కర్లు వేయించుకుంటే బైక్ సీజ్: అద్దంకి సీఐ

image

బైక్ వెనకాల నంబర్ లేకుండా మంత్రి తాలుకా అంటూ స్టిక్కర్లు వేయించుకుంటే వాటిని సీజ్ చేస్తామని అద్దంకి పట్టణ సీఐ కృష్ణయ్య తెలిపారు. పట్టణంలో గొట్టిపాటి రవి మంత్రి తాలూకా అని, మరొకరు అద్దంకి ఎమ్మెల్యే హనిమిరెడ్డి తాలూకా అని బైక్ నంబర్ ప్లేట్లపై పేర్లు రాయించుకుని తిరగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో సీఐ వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

News May 30, 2024

ప్రకాశం: అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. తమ్ముడు మృతి

image

జిల్లాలోని ముండ్లమూరు మండలం సుంకరవారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో అన్నదమ్ముల మధ్య గురువారం రాత్రి ఘర్షణ చోటు చేసుకోవడంతో తమ్ముడు మృతి చెందాడు. రాయితో అన్న దాడి చేయడంతో తమ్ముడు బ్రహ్మయ్య(29) ఘటనా స్థలంలోని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

ప్రకాశం: సైకిల్ కొనివ్వలేదని ఆత్మహత్య

image

జిల్లాలోని రాచర్ల మండలం చోళవీడులో ఉరివేసుకొని మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. చోళవీడుకు చెందిన ఓ మైనర్ బాలుడు తన తల్లిదండ్రులు తను కోరిన సైకిల్ ఇప్పించలేదని ఇంటిలోకి వెళ్లి తలుపులు బిగించి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

ప్రకాశం: 4 రోజుల్లో మన MLA ఎవరో తెలుస్తుంది

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలింగ్‌ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఫలితాల కోసం అటు అభ్యర్థులు, ఇటు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ ఉంది. 2019లోని 12 స్థానాల్లో YCP-8, TDP-4 గెలిచాయి. YCP మరోసారి ఎక్కువ స్థానాలపై కన్నేయగా, TDPకి మెజార్టీ సీట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్ పట్టు సాధించాలని చూస్తుండగా, దీంతో ఎవరు గెలుస్తారనే చర్చ నడుస్తోంది. మరి మీ MLAగా ఎవరు గెలవబోతున్నారు.