India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కంభం పట్టణంలోని స్థానిక చెరువు కట్ట సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్పై ఆదివారం గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. రైలు నుంచి జారిపడి మృతి చెందాడ లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద ఉన్న 50 కేజీల లడ్డును కమిటీ నెంబర్లు వేలం వెయ్యగా.. గ్రామానికి చెందిన ముస్లిం యువకుడు షేక్ కమల్ వలి రూ.26 వేలకు లడ్డును దక్కించుకున్నాడు. లడ్డును దక్కించుకున్న ముస్లిం యువకుడిని హిందువులు అభినందించారు. ఈ సంఘటన మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పలువురు అన్నారు.
చీరాల మండలంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చీరాల పరిధిలో ఓ మహిళ నివసిస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంటివద్దకు వచ్చి తలుపులు పగలగొట్టి మరీ లోపలికి ప్రవేశించి వివాహితను బంధించి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై బాధితురాలు శనివారం ఈపూరుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ANM/GNM/ BSC-నర్సింగ్ చదివిన వారికి, జపాన్ హాస్పిటల్స్లో ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా అధికారి రవితేజ శనివారం తెలియజేశారు. జపాన్లో పనిచేయడానికి ఆసక్తి కలిగి (32)లోపు వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు. జపనీస్ బాషలో 6 నెలలపాటు శిక్షణ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఒంగోలు కొత్తపట్నం రోడ్లోని స్కిల్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
ఒంగోలు పట్టణంలోనిసంఘమిత్ర ఆసుపత్రి వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనకనుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. హైవే పోలీసులు వెంకటరామయ్య, రాజాలు, మేదరమెట్ల వద్ద లారీని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సిఉంది.
బాపట్ల జిల్లా యద్దనపూడి మండల పరిధిలోని పూనూరు గ్రామంలో హృదయ విధారక ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పూనూరు గ్రామానికి చెందిన తండ్రీ, కొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఒకేసారి తండ్రీ, కొడుకులు తనువు చాలించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన విద్యార్థి లోకేశ్ తిరుపతి MBU యూనివర్షిటీలో చదువుతున్నాడు. అయితే శనివారం అతను ఓ థియేటర్లో సినిమాకు వెళ్లగా.. లోకేశ్ పై కార్తీక్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం కార్తీక్తోపాటు మరో యువతి కావ్య పరారయ్యారని పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కార్తీక్, కావ్యది సూళ్లూరుపేటగా గుర్తించారు.
కొండపి పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వేలానికి జువ్విగుంట, అయ్యవారిపాలెం, తంగేళ్ల, జాళ్లపాలెం, పీరాపురం గ్రామాలకు చెందిన రైతులు 1354 బేళ్లను వేలానికి తీసుకొని వచ్చారు. అందులో 1009 బేళ్లను కొనుగోలు చేశారు. వ్యాపారులు వివిధ కారణాలతో 345 బేళ్లను తిరస్కరించారు. పొగాకు గరిష్ఠ ధర కేజీ రూ.358, కనిష్ఠ ధర కేజీ రూ.180, సరాసరి ధర రూ.266.88 పలికింది.
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రకాశం జిల్లాకు చెందిన జూపూడి ప్రభాకర్ రావు నియమితులయ్యారు. శుక్రవారం YCP కేంద్ర కార్యాలయంలో YS జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికార ప్రతినిధుల పేర్లను ప్రకటించింది. జిల్లా నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా జూపూడి ప్రభాకర్ రావు నియమితులవడంతో జిల్లాలోని పలువురు వైసీపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.
*బాలినేని<<14089340>> పార్టీ మార్పుపై<<>> మరోసారి చర్చ
*అర్ధవీడు: 15 మంది వైసీపీ వర్గీయులపై కేసు
*ఈ నెల 18న దర్శిలో జాబ్ మేళా
*చీరాల:108లో పైలెట్ & డ్రైవర్ ఉద్యోగాలు
*దోర్నాల మాజీ ZPTCపై అవినీతి ఆరోపణలు
*మార్కాపురం: చెరువు స్థలాలను ఆక్రమిస్తే చర్యలు
* అర్ధవీడు: మైనర్ బాలుడికి మూడేళ్లు జైలు శిక్ష
*యర్రగొండపాలెం వినాయక ఊరేగింపులో ఘర్షణ
* మార్కాపురం: కరెన్సీ నోట్లతో దర్శనమిస్తున్న గణేషుడు
Sorry, no posts matched your criteria.