Prakasam

News May 30, 2024

టంగుటూరు టోల్ ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టివేత

image

చెన్నై నుంచి మిర్యాలగూడకు వెళుతున్న కారులో భారీగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టంగుటూరు హైవే మీద ఉన్న టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా మద్దిశెట్టి మల్లేష్ వద్ద బిల్లులు లేకుండా 112 గ్రాముల బంగారం తీసుకెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. ఇందులో రూ.58 వేలు నగదు, రూ.89,98,220 విలువచేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశామని ఎస్సై పున్నారావు తెలిపారు.

News May 30, 2024

సాయంత్రం 5 గంటలలోగా ఎన్నికల ఫలితాలు: కలెక్టర్

image

జిల్లాలో జూన్ 4వ తేదీన సాయంత్రం ఐదు గంటలలోగా ఎన్నికల ఫలితాలు విడుదలయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఆయన మాట్లాడుతూ.. ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గం వేస్తున్నట్లు, నియోజకవర్గానికి ఐదు చొప్పున టేబుల్ వేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

News May 30, 2024

చీమకుర్తి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

చీమకుర్తి ఈస్ట్ బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న సీఐ దుర్గా ప్రసాద్ మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ హాస్పటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 30, 2024

వై.పాలెం: విధులు మరిచి తన్నుకున్న పోలీసులు

image

పోస్టల్ బ్యాలెట్ బాక్సుల వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు తమ విధులను మరిచారు. మంగళవారం రాత్రి పూటుగా మద్యం సేవించి ఆ మత్తులో మాట మాట పెరిగి వాగ్వాదానికి దిగి కొట్టుకున్న సంఘటన వై.పాలెంలోని అర్వో కార్యాలయం వద్ద జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారి అక్కడికి చేరుకుని పరిశీలించి మద్యం పరీక్ష నిర్వహించి తాగినట్లు గుర్తించి విధుల నుంచి తొలగించారు.

News May 30, 2024

10th మార్కుల జాబితాలో తప్పులుంటే ఇలా చేయండి: డీఈవో

image

ప్రకాశం: పదవ తరగతి మార్కుల జాబితా (2023-24 సంవత్సరం) లో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు తక్షణమే స్పందించాలని డీఈవో సుభద్ర తెలిపారు. తప్పులను సరిచేసుకోవాలంటే డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, విజయవాడ కార్యాలయంలోని మాణిక్యమాంబను సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.

News May 30, 2024

యర్రగొండపాలెం ఆర్ఓ సస్పెండ్

image

యర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీలేఖను తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి మీనా కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 13న జరిగిన పోలింగ్‌లో యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఘర్షణలు జరిగిన సమయంలో, సకాలంలో స్పందించకపోవడంతో ఎన్నికల కమిషన్ వేటు వేసినట్లు తెలిపారు. గురువారం నియోజకవర్గంకు కొత్త ఆర్ఓ ను కలెక్టర్ నియమించనున్నట్లు చెప్పారు.

News May 29, 2024

కందుకూరు: పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

గుర్తు తెలియని వ్యక్తి పురుగు ముందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం కందుకూరు పట్టణ శివారు ధూబగుంట ప్రాంతంలోని వైఎస్సార్ కాలనీలో వెలుగు చూసింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని కేసు నమో చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 29, 2024

ఒంగోలు: ఉద్యోగం ఇప్పిస్తానని రూ.10 లక్షల మోసం

image

తన భర్తకు ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ప్రధానోపాధ్యాయుడికి రూ.10లక్షలు ఇచ్చి మోసపోయినట్టు సంధ్యలత అనే మహిళ మీడియా ముందు వాపోయారు. కనిగిరికి చెందిన విజయభాస్కర్‌ రెడ్డి అనే వ్యక్తి కుంచనపల్లి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారని, ఒంగోలులో తన ఇంటి పక్కన వారి ద్వారా పరిచయమయ్యారని చెప్పారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.

News May 29, 2024

గొడవలు జరగకుండా ప్రత్యేక చర్యలు: ఎస్పీ

image

ఓట్ల లెక్కింపు రోజున జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునిల్ తెలిపారు. బుధవారం కనిగిరిలో రాజకీయ నాయకులు, ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో కౌంటింగ్ తర్వాత ఎటువంటి గొడవలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాలలో బాణసంచా కాల్చడం, డ్రోన్ ఎగురవేయడం చేయరాదని స్పష్టం చేశారు.

News May 29, 2024

కౌంటింగ్ రోజు ప్రకాశం జిల్లాలో ఆంక్షలు

image

జూన్ 4న జిల్లాలో పలు ఆంక్షలు విధించనున్నట్లు SP గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజున ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించి, జాతీయ రహదారిపై ఒకే మార్గంలో రాకపోకలు వచ్చేలా చేస్తామన్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో బాణసంచా కాల్చడం, డ్రోన్ ఎగరవేడయం చేయరాదన్నారు. మద్యం విక్రయించకుండా చేయడంతో పాటు, కేంద్రంలోకి వచ్చే వారికి బ్రీత్ అనలైజ్ పరీక్షీంచనున్నట్లు తెలిపారు.