Prakasam

News September 13, 2024

ప్రకాశం: మైనర్ బాలుడికి మూడేళ్ల జైలుశిక్ష

image

ప్రకాశం జిల్లా అర్ధవీడుకు చెందిన ఓ మైనర్ బాలుడికి ఒంగోలు కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. 2018లో ఏడవ తరగతి చదువుతున్న బాలుడిని ఇంటర్ విద్యార్థినికి ప్రేమలేఖ ఇవ్వాలంటూ నిందితుడు ఒత్తిడి చేశాడు. దీంతో ప్రేమలేఖ ఇవ్వనన్న విద్యార్థిపై మైనర్ బాలుడు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో బాలుడు మృతి చెందాడు. విచారణ అనంతరం ఒంగోలు కోర్టు నేడు నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

News September 13, 2024

ప్రకాశం: 108లో డ్రైవర్& పైలట్ ఉద్యోగాలు

image

104,108 వాహనాల్లో డ్రైవర్లు & పైలట్స్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బాపట్ల 104 జిల్లా మేనేజర్ జె నాగేశ్వరరావు తెలిపారు. డ్రైవర్& పైలట్ 10వ తరగతి ఉత్తీర్ణత, హెవీ లైసెన్స్, 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండి, ఇంగ్లిష్ చదవడం & రాయడం తెలిసి ఉండాలన్నారు. అర్హులైన వారు Sep 16వ తేదీలోపు చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో 104 కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

News September 13, 2024

బాపట్ల: ‘సర్వే పారదర్శకంగా నిర్వహించాలి’

image

వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు దెబ్బతిన్న గృహాల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. శుక్రవారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయం నుంచి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదకు బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు అధికంగా దెబ్బతిన్నాయన్నారు. 24 లంక గ్రామాలలో దెబ్బతిన్న గృహాల వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలన్నారు. నష్టం అంచనాలను స్పష్టంగా ఉండాలన్నారు.

News September 13, 2024

బాలినేని పార్టీ మార్పుపై మరోసారి చర్చ

image

మాజీ మంత్రి బాలినేని వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరతారనే వార్తలు మరోసారి చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీ క్యాడర్‌లో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. మరోవైపు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కు అధిష్ఠానం నుంచి గురువారం పిలుపొచ్చింది. ఈ క్రమంలో ఆయనకు జిల్లా బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో బాలినేని నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News September 13, 2024

లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

image

ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఎక్కువ కేసులు డిస్పోజల్ అయ్యేలా కృషి చెయ్యాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీస్ అధికారులు తమ స్టేషన్ల పరిధిలోని కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, భూతగాదాలు, మోటార్ బైక్ యాక్సిడెంట్, చిట్ ఫండ్ వంటి కేసులు, ఇతర కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని గురువారం సూచించారు.

News September 12, 2024

ప్రకాశం: వరద బాధితులకు రూ.1 కోటీ 55 లక్షల విరాళం

image

ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండల పరిధిలోని గోణసపూడి గ్రామవాసి, పారిశ్రామికవేత్త విక్రం నారాయణ కుటుంబం వరద బాధితులకు అండగా నిలిచింది. ఈ మేరకు గురువారం CM చంద్రబాబు నాయుడిని కలిసి రూ.1,55,55,555 భారీ చెక్కును విక్రం నారాయణ అందజేశారు. ఆపద సమయాల్లో వరద బాధితులకు అండగా నిలిచిన విక్రం నారాయణ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. మంత్రి అనగాని, ఎమ్మెల్యే విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

News September 12, 2024

షర్మిలను కలిసిన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు

image

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, సంతనూతలపాడు ఇన్‌ఛార్జ్ పాలపర్తి విజేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌పై చర్చించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు షర్మిల సూచించారు.

News September 12, 2024

ప్రకాశం జిల్లా నేటి TOP NEWS

image

➤ దోర్నాల మండలంలో పర్యటించిన ప్రకాశం జిల్లా కలెక్టర్
➤ ఆసుపత్రిలో తల్లి మృతి.. బిడ్డను అమ్మేసిన తండ్రి
➤ కనిగిరి: రూ.66 వేలు పలికిన లడ్డూ
➤ కురిచేడు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
➤ కొత్తపట్నం: నమ్మించి సహజీవనం.. మరో పెళ్లిక యత్నం
➤ గిద్దలూరు: గణేష్ లడ్డూ పాడిన ముస్లిం సోదరులు

News September 11, 2024

ప్రకాశం: APSSDC ఉద్యోగ ప్రకటన

image

విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్‌కు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉద్యోగాలు కల్పించనుంది. ప్రకాశం జిల్లాలో ఆసక్తి ఉన్నవారు ముందుకు వస్తే.. విజయవాడలో రోజూవారీ వేతనంపై పని కల్పిస్తామని జిల్లా అధికారి రవితేజ చెప్పారు. అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్స్‌తో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద ఉన్న NAC ట్రైనింగ్ సెంటర్‌ను సంప్రదించాలి.

News September 11, 2024

గణేశుడి లడ్డూను పాడిన ముస్లిం సోదరులు

image

ప్రకాశం జిల్లాలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్ వద్ద వినాయకుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా గణనాథుడి లడ్డూను వేలం వేశారు. ముస్లిం సోదరులు షరీఫ్, నజీర్ రూ.33800లకు లడ్డూను దక్కించుకున్నారు. మతసామరస్యానికి ఇది నిదర్శనమని పలువురు వారిని అభినందించారు.