Prakasam

News May 29, 2024

దర్శి: స్నేహితులతో సరదా ఈత.. ప్రాణం తీసింది

image

తాళ్లూరు మండలంలోని రామభద్రపురానికి చెందిన మణికంఠరెడ్డి ఆదివారం రామతీర్థం రిజర్వాయర్లో గల్లంతైన విషయం తెలిసిందే. మణికంఠరెడ్డి తన మిత్రులతో కలిసి ఆదివారం రామతీర్థం రిజర్వాయర్లో సరదాగా ఈతకెళ్లి అక్కడ ఈతకొడుతూ లోపలికి వెళ్లి కనిపించకుండా పోయాడు. ఆరోజు నుంచి గాలింపు చర్యలు చేపట్టగా, మంగళవారం మృతదేహం ఒకపక్కకు కొట్టుకొని వచ్చింది. మణికంఠ మృతితో రామభద్రపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 28, 2024

ఉలవపాడు: బొలెరో వాహనాన్ని ఢీ కొట్టిన కారు

image

ఉలవపాడులోని ఉత్తర బైపాస్‌లో బైక్‌ను తప్పించబోయి బొలెరో వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైపాస్ రోడ్డులో వెళ్తున్న కారుకు సడన్‌గా వచ్చిన బైక్‌ను తప్పించబోయి ముందున్న బొలోరో వాహనాన్ని ఢీకొట్టగా ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. దానితో స్థానికులు పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.

News May 28, 2024

మార్కాపురం: లాయర్‌పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

image

న్యాయవాదిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు మార్కాపురం పట్టణ రెహమాన్ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. మార్కాపురం పట్టణంలోని కోర్టు సెంటర్లో ఈనెల 25న రాత్రి రసూల్ అనే న్యాయవాదిపై నిసార్ మొహమ్మద్ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఆస్తుల వివాదానికి సంబంధించిన ఓ కేసులో న్యాయవాది రసూల్‌పై కక్ష పెంచుకొని దాడికి పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుడని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు.

News May 28, 2024

మరో 7 రోజులే.. ప్రకాశంలో పట్టాభిషేకం ఎవరిది.?

image

ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4 వచ్చేస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 MLA, 2 MP స్థానాలు ఉండగా.. ఫలితాలకు మరో 7 రోజుల సమయమే ఉంది. ఓ వైపు ఉత్కంఠ నెలకొనగా, బెట్టింగులు జోరందుకున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో YCP 8 MLA, 2 MP, టీడీపీ 4 MLA స్థానాలను గెలుచుకుంది. తాజా ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇరుపార్టీల నేతలు గెలుపుపై ధీమాగా ఉండగా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కామెంట్ చేయండి.

News May 28, 2024

టంగుటూరు: వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

టంగుటూరు మండలం తేటుపురంలోని పాలేరు వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. పోలీసుల వివరాల మేరకు.. 35 సంవత్సరాలు కలిగిన వ్యక్తి బ్లూ రంగు డ్రాయర్ ధరించి ఉన్నాడు. ఒడ్డుకు మృతదేహం కొట్టుకు రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News May 28, 2024

ప్రకాశం: ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజిల్లో 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా జూన్ 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత పత్రాలను ప్రింట్ తీసుకోని తమ వద్ద ఉంచుకోవాలన్నారు. 

News May 28, 2024

కురిచేడు: కరెంట్ షాక్‌తో నాలుగు గేదెల మృతి

image

కరెంట్ షాక్‌తో నాలుగు గేదెలు మృతి చెందిన ఘటన కురిచేడు మండలంలో సోమవారం జరిగింది. గంగదొనకొండ గ్రామంలో గోదాల సుబ్బారెడ్డి, కర్నాటి పెద్ద వెంకటరెడ్డి, బెండయ్య గేదెలు పొలాల్లో గడ్డి తింటుండగా మధ్యాహ్నం అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో సమీపంలో ఉన్న పొలాలలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. గేదెలు వాటిని తగలండంతో నాలుగు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

News May 28, 2024

అభ్యర్థులు శాంతిభద్రతలకు సహకరించండి: బాపట్ల కలెక్టర్

image

బాపట్లలోని 8 నియోజకవర్గాలకు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. బాపట్లలోని కలెక్టరేట్‌లో పోటీలో ఉన్న అభ్యర్థులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ అయిపోయిన మరుసటి రోజు కూడా శాంతి భద్రతలకు సహకరించాలన్నారు.

News May 27, 2024

పర్చూరు: కోడిగుడ్డు @ రూ.8

image

పర్చూరు మండలంలో నిన్న మొన్నటి వరకు కోడి గుడ్డు ధర రూ.5ల వరకు ఉండగా నేడు రూ.8కు ఎగబాకింది. ఎండాకాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోవడంతో సరఫరా తగ్గి డిమాండ్ పెరిగిందని, రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్థులు తెలిపారు. ప్రస్తుతం పర్చూరులో 30 గుడ్ల ధర రూ.200 పలుకుతున్నాయి. హోల్ సేల్లో ఒక కోడిగుడ్డు రూ.6.5లు కాగా రిటైల్ మార్కెట్లో రూ.8 రూపాయలు పలుకుతోంది.

News May 27, 2024

266 మందిపై కేసులు నమోదు: బాపట్ల SP

image

కౌంటింగ్ నేపథ్యంలో బాపట్ల జిల్లాలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ సామాన్య ప్రజలకు, మహిళలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఒక్కరోజే 266 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై కేసులు నమోదు చేశామన్నారు.