India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం జిల్లాలో ఉచిత ఇసుక తరలించేందుకు వాహనాల నంబర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మైనింగ్ జిల్లా శాఖ అధికారి జగన్నాథ రావు, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ సుశీల ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 11 నుంచి ఉచిత ఇసుక నూతన పాలసీ విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ మేరకు వాహనదారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ లేని వాహనాలు ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చిన్నగంజాం మండలానికి చెందిన ఓ మహిళ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ శిశువుకు జన్మనిచ్చి మరణించింది. అదే వార్డులో ప్రసవించిన అనంతరం శిశువుని పోగొట్టుకున్న మరో మహిళకు ఆ బిడ్డను శిశువు తండ్రి 1,90,000 అమ్మేశాడు. ఈ ఘటనపై కొత్తపేట పోలీసు స్టేషన్లో జీరో FIR నమోదు అయింది. తదుపరి విచారణ నిమిత్తం కొత్తపేట పోలీసులు చిన్నగంజాం పోలీసు స్టేషన్కు కేసును బదిలీ చేశారు.
ప్రయాణిస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కురిచేడు మండలం పొట్లపాడు సమీపంలో చోటుచేసుకుంది. నంద్యాల నుంచి గుంటూరు వెళుతున్న రైలు నుంచి పడి చనిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మృతుడు వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామానికి చెందిన పులి నాగార్జున ఓ యువతిని ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడేవాడు. 10ఏళ్ల తర్వాత ఇటీవల ఆమె వద్దకు వెళ్లి నమ్మించి సహజీవనం చేశాడు. కొద్ది రోజుల క్రితం మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు పూనుకున్నాడు. దీనిపై ఆమె ప్రశ్నిస్తే హంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడటంతో యువతి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నాగార్జునతోపాటు, మరో అయిదుగురిపై కేసు నమోదు చేశారు.
ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు నర్సరీల నుంచి నారు, మొక్కలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గతంలో పడినంత కష్టం లేకుండా ప్రైవేట్ నర్సరీల నుంచి తెచ్చుకుంటున్నారు. దీని వల్ల సమయం, ఖర్చు కలిసివస్తుందని, నారు ఒకే ఎత్తులో ఉంటుందని, నాణ్యతగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 2023-24 మధ్య మిరప 95,129 ఎకరాల్లో, టమోటా 1746 ఎకరాల్లో సాగైనట్లుగా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు.
ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం దోర్నాల మండలంలో పర్యటించనున్నట్లు మంగళవారం అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు మండలంలోని చిన్న గుడిపాడు సమీపంలో గల ఆర్డీటి కార్యాలయంలో నిర్వహించే పీఎం-జన్ మన్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొననున్నట్లు తెలిపారు.
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో సీఎంను ఆ శాఖ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఒకరోజు జీతాన్ని సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. దాదాపు 10.60 కోట్ల రూపాయలను వరద బాధితుల సహాయార్థం అందించారని మంత్రి చెప్పారు. అలాగే విద్యుత్ పునరుద్ధరణలో ఉద్యోగులు అద్భుతంగా పనిచేశారని అన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం మన్నేటికోటలో దారుణం జరిగింది. 9 ఏళ్ల చిన్నారిపై వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి మానవ మృగంలా అరాచకానికి పాల్పడ్డాడు. తినుబండారాల పేరుతో మాయమాటలు చెప్పి చిన్నారిని తీసుకెళ్లిన కార్తీక్ (20) అత్యాచారానికి తెగబడ్డాడు. బాలిక కేకలు వేయడంతో ఆ కీచకుడు పరారయ్యాడు. ఫిర్యాదు అందుకున్న ఉలవపాడు పోలీసులు చిన్నారిని కందుకూరు ఆసుపత్రికి తరలించారు.
భారీ వర్షాలు, వరదలకు బాపట్ల జిల్లాలోని పెదపులివర్రు, పెనుమూడి, రుద్రవరం, రావిఅనంతారం గ్రామాల్లో కుడికరకట్ట చాలాచోట్ల బలహీనపడింది. దీంతో మంత్రులు అనగాని, గొట్టిపాటి అధికారులతో చర్చించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికుల సాయంతో 100కి పైగా ట్రాక్టర్ల మట్టిని 15వేలకుపైగా బస్తాల్లో నింపి రాత్రికి రాత్రి కరకట్టపై రక్షణ కవచంలా ఏర్పాటు చేశారు.
ముండ్లమూరు మండలం మారెళ్ళకు చెందిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసి గర్భివతిని చేసిన కేసులో నిందితుడు శ్రీరామ్ జాన్ హైడ్ (చెర్రీ)ని అరెస్ట్ చేసినట్లు దర్శి DSP లక్ష్మీనారాయణ తెలిపారు. గత నెల 20న బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై నాగరాజు కేసు నమోదుచేశారు. అప్పటినుంచి నిందితుడు తప్పించుకొని తిరుగుతుండగా సోమవారం అరెస్ట్ చేసినట్లు వివరించారు.
Sorry, no posts matched your criteria.