Prakasam

News May 26, 2024

ప్రకాశం: అర్ధరాత్రి కత్తితో యువకుడు వీరంగం

image

అర్ధరాత్రి ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. అడ్డొచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సంఘటన కురిచేడు మండలం పెద్దవరం గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎర్రగుంట్ల పెద్ద నాగేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో కత్తి చేతబట్టి నలుగురిపై దాడి చేశాడు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 26, 2024

మార్కాపురం: ‘నా కోరిక తీర్చు.. నీ డిప్యూటేషన్ రద్దు చేయించను’

image

డిప్యూటేషన్ మీద వచ్చిన ఓ ఉద్యోగినిపై ఓ అధికారి కీచకుడిగా మారారు. ‘నీ డిప్యూటేషన్ రద్దు చేయించకుండా ఉండాలంటే నా కోరిక తీర్చాలి. మార్కాపురంలో నా స్నేహితుడికి లాడ్జి ఉంది. లేదంటే పొదిలికి రా.. అక్కడా కుదరకుంటే కంభం వచ్చినా సరే.. రాకుంటే నీ డిప్యుటేషన్ రద్దు చేయిస్తా’ ఇవి ఓ కామాంధ అధికారి మాటలు. ఈ మాటలు విన్న ఆ ఉద్యోగి నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులకు శనివారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

News May 26, 2024

చీరాల: సాయం చేయబోయి మృత్యుఒడిలోకి..

image

చీరాల ఆరబిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంపన పవన్ కుమార్ అనే ట్రిపుల్ ఐటీ విద్యార్థి శనివారం మృతి చెందాడు. ఈపూరుపాలెం నుంచి చీరాలకు పవన్ కుమార్ బైకుపై వస్తుండగా మార్గమధ్యంలో ఒక యువకుడు లిఫ్ట్ అడిగి తనను రైల్వే స్టేషన్ వద్ద దింపమని కోరాడు. అతడిని ఎక్కించుకొని ఆరబి మీద వెళుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పవన్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

News May 26, 2024

ఒంగోలు: టీడీపీ నేత కారు దగ్ధం.. నిందితులు అరెస్ట్

image

సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడులో టీడీపీ నాయకుడు చిగురుపాటి శేషగిరిరావుకు చెందిన కారు దగ్ధం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ శ్రీధర్ రావు తెలిపారు. ఒంగోలులోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిందితులు కనసాని ఈశ్వర్ రెడ్డి, పాలెటి అభిషేక్, గోపాలుడని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఏఎస్పీ స్పష్టం చేశారు. ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

News May 26, 2024

ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా చూడాలి: జేసీ

image

ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకొని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విధులను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతీఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండి తమకు కేటాయించిన విధులను పూర్తి చేయాలని అన్నారు

News May 25, 2024

చీరాలలో రైలు కింద పడి వ్యక్తి మృతి

image

చీరాల పట్టణ సమీపంలోని విజయనగర కాలనీ సమీపంలో తేళ్ల బుల్లయ్య (35) అనే వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

News May 25, 2024

మర్రిపూడి: ఉరి వేసుకోని వివాహిత ఆత్మహత్య

image

మర్రిపూడి మండలం పన్నూరు గ్రామంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వివాహిత (33) భార్యాభర్తల వివాదాల నేపథ్యంలో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై శివ బసవరాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎస్సై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News May 25, 2024

ప్రకాశం: భార్యను హతమార్చి తప్పించుకునేందుకు ప్లాన్.. అక్కడే ట్విస్ట్

image

భార్యను హత్య చేసి, ఆపై తప్పించుకునేందుకు విఫలయత్నం చేశాడో కసాయి భర్త. పోలీసుల వివరాల ప్రకారం.. కొనకమిట్ల మండలానికి చెందిన మధులత, దర్శికి చెందిన పరకాల నాగేంద్ర దంపతులు. ఈనెల 4న రాత్రి వారి మధ్య గొడవ కాగా.. నాగేంద్ర ఆవేశంలో భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు. మృతదేహాన్ని ముక్కలు చేయాలనుకొని, ఆపై గ్యాస్ లీక్ చేసి ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు. పోలీసుల దర్యాప్తులో నిజం తేలడంతో కటకటాల పాలయ్యాడు.

News May 25, 2024

ప్రకాశం: అక్రమ ఇసుక తవ్వకాలపై ఫిర్యాదుల స్వీకరణ

image

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వ్యక్తిగత విభాగం ఏర్పాటు చేసినట్లు జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి బి.జగన్నాథరావు తెలిపారు. అక్రమ తవ్వకాలు చేపడుతుంటే 6281799518 నంబరుకు ఫిర్యాదు చేయాలని ఆయన పేర్కొన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు జరిపితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

News May 24, 2024

సంతమాగులూరు: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

మండలంలోని ఏల్చూరులో బాల ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద గురువారం చీరకు నిప్పంటుకొని తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన అంకంశెట్టి పున్నాయమ్మ దీపారాధన చేస్తూ మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు నరసరావుపేట వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.