India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద వినాయక విగ్రహంతో వెళ్తున్న దేసిరెడ్డిపల్లి <<14041015>>ట్రాక్టర్ను లారీ ఢీకొంది.<<>> ఈ ఘటనలో 11 మందికి గాయాలు కాగా ఆ గ్రామంలో పండుగ వేళ విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న SP చలించిపోయారు. దీంతో గ్రామస్థుల్లో బాధను పోగొట్టడానికి ఎస్పీ దామోదర్ స్వయంగా వారితో మాట్లాడి, మరో విగ్రహాన్ని పంపించారు. దీంతో గ్రామంలో తిరిగి ఆనందం నింపారని పలువురు SPని అభినందిస్తున్నారు.
వినాయక చవితి పండగ సందర్భంగా శనివారం ఒంగోలు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో, ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నందు నిర్వహించిన పూజా కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సతీసమేతంగా పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
వినాయక చవితి పండగ సందర్భంగా శనివారం ఒంగోలు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో, ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నందు నిర్వహించిన పూజా కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సతీసమేతంగా పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
గిద్దలూరు- దిగువమెట్ట మధ్య రెండో లైను పనులు జరుగుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు గుంటూరు- కాచిగూడ (17251), గుంటూరు – డోన్ (17228) ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించాలన్నారు.
జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు ఎస్పీ దామోదర్ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, మత సామరస్యం కొనసాగించాలని సూచించారు. జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.
ఒంగోలులోని సమతానగర్లో కొబ్బరి కాయలతో గణనాథుడిని తయారుచేశారు. గత 30 ఏళ్లుగా స్థానిక ‘కమిటీ కుర్రాళ్లు’ గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది సరికొత్తగా దాదాపు 1500 కొబ్బరికాయలతో 17 అడుగుల ఎత్తులో గణేష్ను రూపొందించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితానికి ముందుకు రావాలని కోరారు.
వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి మీడియా మిత్రులకు ఎస్పీ ఏఆర్ దామోదర్ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో వినాయక చవితి పందిళ్లు/ మండపాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీ వారు, పోలీసువారి సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. సంఘటనలు తలెత్తితే వెంటనే స్థానిక పోలీసు లేదా డయల్ 112/100 ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు.
గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కనిగిరి MLA ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం గుంటూరు ఐజీ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MLA ఉగ్ర మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించాలని ఐజీని కోరినట్లు తెలిపారు. పోలీసు అధికారులకు తమ సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.
ఒంగోలులోని సమతానగర్లో కొబ్బరి కాయలతో గణనాథుడిని తయారుచేశారు. గత 30 ఏళ్లుగా స్థానిక ‘కమిటీ కుర్రాళ్లు’ గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది సరికొత్తగా 17 అడుగుల ఎత్తులో కొబ్బరికాయలతో గణేష్ను రూపొందించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితానికి ముందుకు రావాలని కోరారు.
టంగుటూరు మండలం జమ్ములపాలెంలో నాలుగేళ్ల నుంచి లో వోల్టేజీ సమస్య నెలకొంది. దీంతో నిత్యం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులు మొదలు వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్థానిక యువకుడు సమస్యను ప్రస్తావిస్తూ ‘X’ వేదికగా విద్యుత్ శాఖ మంత్రికి పోస్ట్ చేశారు. దీంతో స్పందించిన మంత్రి గంటలోనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. సమస్యకు పరిష్కారం చూపాలన్నారు.
Sorry, no posts matched your criteria.