India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో మద్యం షాపుల లాటరీ విషయంలో కొన్ని ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. ➤సోంపేటకు చెందిన ఒక వ్యక్తి 45 దరఖాస్తులు చేయగా 1 దుకాణం వరించింది. ➤శ్రీకాకుళం నగరానికి చెందిన వైసీపీ నేత తన సన్నిహితులతో సిండికేట్గా ఏర్పడి 140 దరఖాస్తులు చేయగా 6 దుకాణాలు వచ్చాయి. ➤విజయనగరం జిల్లాకు చెందిన ఒక మిల్లరు జిల్లాలో 150 దరఖాస్తులు చేయగా కొన్ని దుకాణాలు వచ్చాయి. ➤నరసన్నపేట మహిళకు రెండు దుకాణాలు వచ్చాయి.
బంగాళాఖాతంలో అల్పపీడన కారణంగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని EPDCL SE కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం డివిజన్ 94906 10045, 94906 12633, టెక్కలి 83328 43546, పలాస 73825 85630లలో విద్యుత్, స్తంభాలు, తీగలు నేలకొరిగినా వినియోగదారులు సంబంధిత డివిజన్ హెల్ప్ డెస్క్లను సంప్రదించాలని కోరారు. అలాగే టోల్ ఫ్రీ నంబరు 1912కు కూడా ఫోన్ చేయవచ్చాన్నారు.
స్వర్ణాంధ్ర-2047 నాటికి ఆర్థిక వృద్ధి రేటు పెంచే దిశగా ప్రణాళికలు ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. సోమవారం స్వర్ణాంధ్ర-2047 పై మండల, జిల్లాల విజన్ ప్లానింగ్ పై జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు.
శ్రీకాకుళంలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కళావేదికలో ప్రారంభమైన మద్యం షాపులు కేటాయింపులో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లాటరీ నిర్వహించారు. జిల్లాలో 158 మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో 158 పేర్లు ఖరారు చేసినట్లు వారు పేర్కొన్నారు.
శ్రీకాకుళం నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కళావేదిలో ప్రారంభమైన మద్యం షాపులు కేటాయింపులో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి, ఆర్డీవో కె.సాయి ప్రత్యూషలు లాటరీ నిర్వహణ చేపట్టారు. ఇప్పటి వరకు 113 మద్యం షాపుల పేర్లు లాటరీ పద్ధతిలో ప్రకటించినట్లు వారు తెలిపారు.
సంతబొమ్మాళి మండలం తెనిగిపెంట గ్రామానికి చెందిన పెంట రేవతి (19) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈనెల 4వ తేదీ నుంచి రేవతి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈనెల 6వ తేదీన గ్రామంలోని ఒక బావిలో రేవతి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. అయితే రేవతిది హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కొత్తగా నెలకొల్పనున్న 158 మద్యం దుకాణాల నిర్వహణకు ఇవాళ టెండర్లు నిర్వహించనున్నారు. 158 మద్యం దుకాణాలకు 4,671 దరఖాస్తులు అందాయి. దీంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీలు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
DSC రాయనున్న SC,ST అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ DD విశ్వమోహన్ రెడ్డి తెలిపారు. అర్హత గల అభ్యర్థులు 3 నెలల పాటు శిక్షణ పొందేందుకు ఈ నెల 21 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. http:jnanabhumi.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 22 నుంచి 25లోగా హల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ నెల 27న స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో మద్యం దుకాణాలను సోమవారం లాటరీ పద్ధతిలో దరఖాస్తుదార్లకు కేటాయించనున్నారు. నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ మొదలు కానుంది. జిల్లావ్యాప్తంగా 158 దుకాణాలకు గాను, 4670 దరఖాస్తులు వచ్చాయి. మద్యాన్ని ప్రయివేట్కు అప్పగిస్తూ ప్రభుత్వం వెలువరించిన విధివిధానాలకు లోబడి ఈప్రక్రియ జరగనుంది. స్టేషన్ల వారీగా ఆడిటోరియంలోకి పిలిచి లాటరీ తీస్తారు.
శ్రీకాకుళం జిల్లాలో రేపటి నుంచి పాఠశాలు, ఇంటర్ కాలేజీలు తెరుచుకొనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ఇవ్వగా నేటితో ముగిశాయి. అలాగే మరో పక్క జిల్లాలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలకు ఈనెల 7వ తేదీ నుంచి సెలవులు ప్రకటించగా నేటితో ముగియనున్నాయి. దీనితో జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పునఃప్రారంభం కానున్నాయి.
Sorry, no posts matched your criteria.