India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పలాస రైల్వే స్టేషన్లో సంరక్షకులు లేకుండా ఒంటరిగా తిరుగుతున్న ఓ చిన్నారి కనిపించింది. ప్రయాణికులు 139 నంబర్కు సమాచారం ఇవ్వగా, జీఆర్పీ సిబ్బంది అబ్బాయిని శిశుగృహనికి తరలించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎర్నాకులం ఎక్స్ప్రెస్ నుంచి ఒంటరిగా దిగిన బాలుడికి మూడేళ్లు ఉంటాయని వివరాలు తెలిసిన వారు శ్రీకాకుళంలోని ఉమన్ ఛైల్డ్ డిపార్ట్ మెంట్కు తెలపాలని జీఆర్పీ ఎస్సై శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

పాఠశాల భవనంపై నుంచి జారిపడి ఓ విద్యార్థిని తీవ్రగాయాలపాలైంది. ఈ ఘటన పొందూరు(M) లోలుగులోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మూడంతస్తుల భవనంపైకి వెళ్లి ప్రమాదవశాత్తూ జారిపడింది. తీవ్రగాయాలవ్వడంతో ఆమెను నైట్ డ్యూటీ సిబ్బంది హుటాహుటిన రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సుందర శ్రీకాకుళం నిర్మాణం ప్రతి ఒక్కరి లక్ష్యమవ్వాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు . మండలంలోని గనగలవానిపేట సాగర తీరంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపులో భాగంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గోండు శంకర్ పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం నిమ్మతొర్లువాడ అనే చిన్న పల్లెటూరులో తయారయ్యే ఆర్గానిక్ బెల్లం చాలా ప్రత్యేకం. తిరుమల ప్రసాదాల తయారీలోనే కాదు, కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులకు కూడా దీనినే ఉపయోగిస్తున్నారు. టీటీడీ నాణ్యత ప్రమాణాలు తట్టుకొని ‘అగ్ మార్క్ ‘ సర్టిఫికేషన్ పొందిన ఈ బెల్లానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే డిమాండ్కు సరిపడా ఉత్పత్తి చేయలేకపోతున్నామని ఇక్కడి తయారీదారులు చెబుతున్నారు.

తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగులు కలెక్టర్ స్వప్నిల్ దినకర్కు సమ్మె నోటీసును అందజేశారు. శుక్రవారం సాయంత్రం ఉత్తరాంధ్ర జేఏసీ కోఆర్డినేటర్ కూన సత్యనారాయణతో పాటు పలువురు సభ్యులు నోటీసును అందజేశారు. రాజకీయ, పలు రకాల ఒత్తిడులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వివరించారు. సచివాలయ వ్యవస్థను ద్వితీయ శ్రేణి వ్యవస్థగా చూడడం తగదన్నారు.

ప్రజలు నుంచి వచ్చిన ఫిర్యాలుపై తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని SP మహేశ్వర రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీసు స్టేషన్ ఆవరణలో ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. స్వయంగా ఫిర్యాదు దారులుతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కుటుంబ, ఆస్తి, పౌర సంబంధాలు, గొడవలు, మోసపూరితమైనవి, ఇతర అంశాలుపై ఫిర్యాదులు అందాయన్నారు.

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ <<17761800>>అభినందించారు<<>>. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ను కేంద్ర మంత్రి దత్తతు తీసుకుంటానని వెల్లడించడంతో లోకేశ్ ఆయనను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలను వారి ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు దత్తతు తీసుకుంటే ఆదర్శంగా ఉంటారన్నారు.

దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని వినతులు స్వీకరించారు. శుక్రవారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో దివ్యాంగుల గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యల విని, పడుతున్న కష్టాలను చూసి ఆయన చలించిపోయారు. దివ్యాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్, JC, అధికారులు పాల్గొన్నారు.

కోటబొమ్మాళి మండలం హరిచంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జిఆర్పీ హెడ్ కానిస్టేబుల్ మెట్ట సోమేశ్వరరావు శుక్రవారం తెలిపారు. మృతుడికి సుమారు 50 ఏళ్లు ఉంటాయన్నారు. వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ స్టేషన్కు తెలపాలన్నారు. 9492250069 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు.

ఇచ్ఛాపురం పట్టణ మేజిస్ట్రేట్ పరేష్ కుమార్ అమ్మమ్మ విజయలక్ష్మి (100) గురువారం మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. ఓ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్స్ సుజాత, కృష్ణలు ఆమె కార్నియాను సేకరించారు.
Sorry, no posts matched your criteria.